Skip to main content

చిన్నారి సుహానా పరిస్థితి చూసి చలించిన పోయిన వైఎస్ జగన్!



ఏడాదిన్నర పాప సుహానా పరిస్థితి గురించి మీడియాలో వచ్చిన కథనాలు చూసి, అధికారులను అడిగి విషయం తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చలించిపోయారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ తో స్వయంగా మాట్లాడి, పాప ఆరోగ్య పరిస్థితిపై వివరాలు అడిగారు. సుహానా చికిత్సకు అవసరమైన మొత్తం ఖర్చును సీఎం సహాయనిధి నుంచి విడుదల చేయాలని ఆదేశించారు. చిన్నారికి రోజువారీ చికిత్సకు అవసరమయ్యే ఇన్సులిన్‌ ను ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ఉచితంగా అందించాలని ఆదేశించారు.

కాగా, చిత్తూరు జిల్లా బి. కొత్తకోటకు చెందిన బావాజాన్, షబానా దంపతులుకు తొలుత ఇద్దరు పిల్లలు పుట్టి, షుగర్‌ స్ధాయి పడిపోవడంతో చనిపోగా, గత సంవత్సరం సుహానా జన్మించింది. పాప శారీరక ఎదుగుదల సరిగ్గా లేకపోవడంతో వైద్యులకు చూపించగా, ఆమెకు కూడా షుగర్‌ లెవల్స్‌ తక్కువగా ఉన్నాయని, జన్యు పరమైన లోపాల కారణంగా ఈ వ్యాధి వచ్చిందని తేల్చారు.

బావాజాన్ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే కావడంతో కారుణ్య మరణానికి అనుమతించాలని కోర్టును ఆశ్రయించగా, సుహానా గురించి బయటి ప్రపంచానికి తెలిసింది. తమ పాపను  మెర్సీ కిల్లింగ్ విధానంలో చంపాలని అనుకుంటున్నామని, అనుమతించాలని వారు చేసిన విన్నపం వైరల్ అయింది. దీనిపై ఎన్నో కథనాలు వచ్చాయి. వాటిని చూసిన జగన్, స్వయంగా స్పందించారు. స్వయంగా ముఖ్యమంత్రి స్పందించడం, కలెక్టర్ ఇంటికి వచ్చి వివరాలు అడిగి, పాపకు నయం చేయిస్తామని చెప్పడంతో ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

Comments

Popular posts from this blog

పవన్ కు శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవి

  సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటోన్న నేపథ్యంలో ఆయనకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు.  ఆయనకు మహేశ్ బాబుతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో పవన్ కల్యాణ్ అద్భుత విజయాలు సాధించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.

చింతమనేనికి బెయిల్ నిరాకరణ: అక్టోబర్ 9వరకు రిమాండ్ పొడిగింపు

తెలుగుదేశం పార్టీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు కోర్టులో చుక్కెదురు అయ్యింది. చింతమనేనికి బెయిల్ ఇచ్చేందుకు ఏలూరు కోర్టు నిరాకరించింది. అంతేకాదు చింతమనేని రిమాండ్ ను అక్టోబర్ 9 వరకు పొండిగించింది.  2017లో అప్పనపాడు గ్రామంలో స్థల వివాదంలో వ్యక్తిని నిర్బంధించి కులం పేరుతో దూషించిన కేసులో కేసు నమోదు అయ్యింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో భాగంగా ఇటీవలే చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.  అనంతరం చింతమనేని ప్రభాకర్ ను ఏలూరులోని ఎస్సీఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరచగా కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. రిమాండ్ పూర్తవ్వడంతో బుధవారం పోలీసులు మరోసారి ఏలూరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరిచారు.  అలాగే బెయిల్ ఇవ్వాలంటూ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తరపు న్యాయవాది సైతం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. చింతమనేని బెయిల్ పిటీషన్ ను న్యాయస్థానం తోసిపుచ్చింది. అనంతరం చింతమనేని రిమాండ్ ను వచ్చే నెల 9 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏలూరు కోర్టు.  ఇకపోతే చింతమనేని ప్రభాకర్ ను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన సమయంలో మహిళా పో...