Skip to main content

చిన్నారి సుహానా పరిస్థితి చూసి చలించిన పోయిన వైఎస్ జగన్!



ఏడాదిన్నర పాప సుహానా పరిస్థితి గురించి మీడియాలో వచ్చిన కథనాలు చూసి, అధికారులను అడిగి విషయం తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చలించిపోయారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ తో స్వయంగా మాట్లాడి, పాప ఆరోగ్య పరిస్థితిపై వివరాలు అడిగారు. సుహానా చికిత్సకు అవసరమైన మొత్తం ఖర్చును సీఎం సహాయనిధి నుంచి విడుదల చేయాలని ఆదేశించారు. చిన్నారికి రోజువారీ చికిత్సకు అవసరమయ్యే ఇన్సులిన్‌ ను ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ఉచితంగా అందించాలని ఆదేశించారు.

కాగా, చిత్తూరు జిల్లా బి. కొత్తకోటకు చెందిన బావాజాన్, షబానా దంపతులుకు తొలుత ఇద్దరు పిల్లలు పుట్టి, షుగర్‌ స్ధాయి పడిపోవడంతో చనిపోగా, గత సంవత్సరం సుహానా జన్మించింది. పాప శారీరక ఎదుగుదల సరిగ్గా లేకపోవడంతో వైద్యులకు చూపించగా, ఆమెకు కూడా షుగర్‌ లెవల్స్‌ తక్కువగా ఉన్నాయని, జన్యు పరమైన లోపాల కారణంగా ఈ వ్యాధి వచ్చిందని తేల్చారు.

బావాజాన్ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే కావడంతో కారుణ్య మరణానికి అనుమతించాలని కోర్టును ఆశ్రయించగా, సుహానా గురించి బయటి ప్రపంచానికి తెలిసింది. తమ పాపను  మెర్సీ కిల్లింగ్ విధానంలో చంపాలని అనుకుంటున్నామని, అనుమతించాలని వారు చేసిన విన్నపం వైరల్ అయింది. దీనిపై ఎన్నో కథనాలు వచ్చాయి. వాటిని చూసిన జగన్, స్వయంగా స్పందించారు. స్వయంగా ముఖ్యమంత్రి స్పందించడం, కలెక్టర్ ఇంటికి వచ్చి వివరాలు అడిగి, పాపకు నయం చేయిస్తామని చెప్పడంతో ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

Comments

Popular posts from this blog

వారానికోసారి కష్టమేమీ కాదు... సీఎం జగన్‌ కేసులో సీబీఐ కౌంటర్

కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం జగన్ వేసిన పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. అక్రమాస్తుల కేసు విచారణ నుంచి తనకు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీబీఐ కోర్టులో వేసిన పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. సీఎం జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. సాక్షులను జగన్ ప్రభావితం చేసే అవకాశం ఉందని పిటిషన్‌లో పేర్కొంది. ఆయన వాస్తవాలను దాచిపెట్టి పిటిషన్ వేశారని ఆరోపించింది. జగన్ జైల్లో ఉన్నప్పుడు సాక్షులను ప్రభావితం చేశారని... సీఎం పదవిలో ఉన్న జగన్ సాక్షులను మరింత ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ తన పిటిషన్‌లో పేర్కొంది. ఏపీలో రెవెన్యూ లోటు అనేది సీఎంగా ఉన్న జగన్ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చే కారణం కాదని తెలిపింది. సీఎంగా ఉన్న జగన్ విజయవాడ నుంచి వారానికోసారి హైదరాబాద్ రావడంకష్టమేమీ కాదని కౌంటర్‌ పిటిషన్‌లో సీబీఐ పేర్కొన్నట్టు తెలుస్తోంది. సీబీఐ కౌంటర్‌పై కోర్టు శుక్రవారం వాదనలు వినిపించనుంది.

బోటు వెలికితీత మరింత ఆలస్యం

కచ్చులూరు వద్ద మునిగిన బోటును రేపు వెలికితీస్తామని ధర్మాడి సత్యం తెలిపారు. బోటు వెలికితీత కోసం రెండోరోజు చేసిన ప్రయత్నాలు విఫలమైనట్లు చెప్పారు. వాతావరణం అనుకూలించనందువల్లే ఈ ఆలస్యం జరుగుతుందని వివరించారు. గోదావరిలో వరద ప్రహహం తగ్గిన కారణంగా బోటును రేపు బయటికి తీస్తామని స్పష్టం చేశారు. కాగా.. ధర్మాడి సత్యం బృందం వేసిన లంగర్‌కు బోటు తగిలి కదిలిందని స్థానికులు తెలిపారు.