Skip to main content

నేను సంపాదించిన దాంట్లో చాలా వరకూ ఈ సినిమాపైనే పెట్టాను: విజయ్ దేవరకొండ

 
ఒక వైపున హీరోగా స్టార్ డమ్ ను అందుకున్న విజయ్ దేవరకొండ, మరో వైపున నిర్మాతగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రంగంలోకి దిగాడు. ఆయన నిర్మాతగా షమ్మీర్ సుల్తాన్ దర్శకత్వంలో 'మీకు మాత్రమే చెప్తాను' రూపొందింది. తరుణ్ భాస్కర్ .. అనసూయ .. వాణి భోజన్ .. అభినవ్ గోమఠం ఈ సినిమాలో ప్రధానమైన పాత్రలను పోషించారు. రేపు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ..'పెళ్లి చూపులు' సమయంలోనే షమ్మీర్ సుల్తాన్ చేసిన షార్ట్ ఫిల్మ్స్ చూసి మాట ఇచ్చాను. అలా ఈ ప్రాజెక్టు పట్టాలెక్కింది. కథ నచ్చడంతో .. నేను ఇంతవరకూ సంపాదించిన దానిలో చాలా వరకూ ఈ సినిమాపైనే పెట్టాను. టీమ్ అంతా కష్టపడి మంచి అవుట్ పుట్ తెచ్చారు. ఆడియన్స్ తప్పకుండా ఎంజాయ్ చేస్తారనే నమ్మకం నాకు వుంది" అని చెప్పుకొచ్చాడు.  

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.