Skip to main content

అవ్వా... ఇంతటి అసత్యపు కథనాలా..? ఓ వార పత్రికపై జేసికి పిర్యాదు చేసిన రూరల్ ఎమ్మెల్యే


తనపై ఓ వార పత్రిక అసత్యపు కథనాలు ప్రచురిస్తోందని రురల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపించారు..తన పావు వచ్చిన అసత్య కథనాలపై జిల్లా జాయింట్ కలెక్టర్ వినోద్ కుమార్ ను కలిశారు..
కావాలనే ఉద్దేశ్యపూర్వకంగా తనపై ఇటీవల ఓ వార పత్రిక అసత్య ప్రచారాలు చేస్తూ వార్తలు రాస్తున్నారని జేసికి వివరించారు. తనతో పాటు పోలీస్, విజిలెన్స్ అధికారులపై తప్పుడు వార్తలు రాస్తున్నారని ఫిర్యాదు చేశారు.
వెంటనే దీనిపై విచారణ జరిపి నిజమని తేలితే తనపై చర్యలు తీసుకోవాలని కోరారు.వార్త అబద్దమని తేలితే పత్రిక ఎడిటర్, పాత్రికేయుడిపై కూడా క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు. ఇసుక అక్రమ రవాణా అంటూ వార్తలు రాస్తూ ప్రజలను ప్రక్కదోవ పట్టిస్తున్నారని జెసి దృష్టికి ఆయన తీసుకెళ్లారు.. ఈ సందర్భంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు..
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఫోర్ట్ ఎస్టేట్ గా ఉన్న మీడియా.. ఒక వర్గానికి కొమ్ము కాస్తుందన్నారు.. ఒక్కరినే టార్గెట్ చేస్తూ వ్యక్తిగతంగా వార్తలు రాయడం సరైన పద్ధతి కాదన్నారు.. ప్రభుత్వంపై కూడా ఒక వర్గం మీడియా తప్పుడు వార్తలు ప్రచురిస్తున్నాయని ఆరోపించారు.. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైసీపీ ఎమ్మెల్యేలే టార్గెట్ గా తప్పడు వార్తలు రాస్తున్నారన్నారు..

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...