Skip to main content

అవ్వా... ఇంతటి అసత్యపు కథనాలా..? ఓ వార పత్రికపై జేసికి పిర్యాదు చేసిన రూరల్ ఎమ్మెల్యే


తనపై ఓ వార పత్రిక అసత్యపు కథనాలు ప్రచురిస్తోందని రురల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపించారు..తన పావు వచ్చిన అసత్య కథనాలపై జిల్లా జాయింట్ కలెక్టర్ వినోద్ కుమార్ ను కలిశారు..
కావాలనే ఉద్దేశ్యపూర్వకంగా తనపై ఇటీవల ఓ వార పత్రిక అసత్య ప్రచారాలు చేస్తూ వార్తలు రాస్తున్నారని జేసికి వివరించారు. తనతో పాటు పోలీస్, విజిలెన్స్ అధికారులపై తప్పుడు వార్తలు రాస్తున్నారని ఫిర్యాదు చేశారు.
వెంటనే దీనిపై విచారణ జరిపి నిజమని తేలితే తనపై చర్యలు తీసుకోవాలని కోరారు.వార్త అబద్దమని తేలితే పత్రిక ఎడిటర్, పాత్రికేయుడిపై కూడా క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు. ఇసుక అక్రమ రవాణా అంటూ వార్తలు రాస్తూ ప్రజలను ప్రక్కదోవ పట్టిస్తున్నారని జెసి దృష్టికి ఆయన తీసుకెళ్లారు.. ఈ సందర్భంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు..
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఫోర్ట్ ఎస్టేట్ గా ఉన్న మీడియా.. ఒక వర్గానికి కొమ్ము కాస్తుందన్నారు.. ఒక్కరినే టార్గెట్ చేస్తూ వ్యక్తిగతంగా వార్తలు రాయడం సరైన పద్ధతి కాదన్నారు.. ప్రభుత్వంపై కూడా ఒక వర్గం మీడియా తప్పుడు వార్తలు ప్రచురిస్తున్నాయని ఆరోపించారు.. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైసీపీ ఎమ్మెల్యేలే టార్గెట్ గా తప్పడు వార్తలు రాస్తున్నారన్నారు..

Comments

Popular posts from this blog

అత్యంత కష్టం మీద బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం బృందం

నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

మీడియాపై మాకు గౌరవముంది: కోటంరెడ్డి

  కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ పాలనపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మీడియాపై తమకు గౌరవం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. జీవో 2430 కొత్తగా తీసుకొచ్చింది కాదని, ఎప్పటినుంచో అది ఉందని తెలిపారు.  ఈ రోజు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్ని పత్రికలు, ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు వార్తలతో అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలని పేర్కొన్నారు. ఒకప్పుడు సాక్షి మీడియాను చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నేతలు ఎటుపోయారని నిలదీశారు. లోకేశ్ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మంగళగిరి నియోజక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేశ్ కు తెలియదని విమర్శించారు. తమ పాలనను చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, తన హయాంలో తన కొడుకు లోకేశ్ తో కలిసి దోచుకుని లోటు బడ్జెట్ ను చూపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని చెప్పారు.  చంద్రబాబుకు చదువుకునేటప్పటి నుంచే కులపిచ్చి ఉందని పేర్కొన్నారు. స్థాని...