Skip to main content

తనకు బొత్స, సుచరిత తెలుసని బండ్ల గణేశ్ నన్ను బెదిరించాడు: నిర్మాత పీవీపీ

టాలీవుడ్ నిర్మాతలు పీవీపీ, బండ్ల గణేశ్ ల మధ్య నెలకొన్న ఆర్థిక వివాదం కారణంగా వీళ్లిద్దరూ పోలీసులను ఆశ్రయించి పరస్పరం ఫిర్యాదు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పీవీపీని పలకరించిన మీడియాతో ఆయన మాట్లాడుతూ, 2013, నవంబర్ లో ‘టెంపర్’ సినిమాకు ఫైనాన్స్ చేశామని, 2015, ఫిబ్రవరి 13న ఈ సినిమా రిలీజు అయిందని చెప్పారు.

అయితే, ఈ సినిమా రిలీజు అయిన రోజున బండ్ల గణేశ్ తమకు రూ.7 కోట్లు తక్కువగా చెల్లించారని ఆరోపించారు. ఈ డబ్బు చెల్లించకుండా గత ఐదేళ్ల నుంచి తప్పించుకుని తిరుగుతున్నాడని, తమ ఉద్యోగస్తులను ఇబ్బందికి గురిచేయడం వంటి పనులు చేస్తున్నారని ఆరోపించారు. మోసం చేసే మనస్తత్వంతో తమకు కట్టుకథలు చెబుతున్నాడని, లీగల్ గా తాము తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పారు.

ఇక నిన్న సాయంత్రం తన నివాసం వద్దకు ముగ్గురు వ్యక్తులు వచ్చారని, తాను వాళ్లకు తెలుసని చెప్పడంతో వారిని సెక్యూరిటీ సిబ్బంది లోపలకి అనుమతించారని అన్నారు. ఆ ముగ్గురు వ్యక్తుల్లో ఒకరి పేరు కిశోర్ అని, ఇద్దరు ముస్లిం వ్యక్తులని చెప్పారు. బండ్ల గణేశ్ తరపున మాట్లాడాలని కిషోర్ అనే వ్యక్తి తనతో చెప్పాడని, వారి బాడీ లాంగ్వేజ్ తేడాగా ఉందని, తన నివాసం నుంచి బయటకెళ్లిన తర్వాత ముప్పావు గంట అక్కడే నిలబడ్డారని ఆరోపించారు.

తన నివాసానికి వచ్చిన కిశోర్ తో పాటు ఆ ఇద్దరు వ్యక్తులను మళ్లీ చూస్తే గుర్తుపట్టగలుగుతానని అన్నారు. ఇలాంటి వాటికి తానేమీ భయపడనని చెప్పిన పీవీపీ, ఈ విషయమై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశానని చెప్పారు.

ఇటీవల పార్క్ హయత్ హోటల్ లో ఓ మీటింగ్ కు వెళ్లానని, అక్కడ వేరే వాళ్లను కలిసేందుకు వచ్చిన బండ్ల గణేశ్ తనను చూసి మాట్లాడాడని చెప్పారు. ఈ సందర్భంగా వారి మధ్య జరిగిన సంభాషణను ఆయన వివరించారు. ‘ఏమైంది, కనపడట్లేదు..లాస్ట్ వీక్ వస్తానన్నావుగా’ అని బండ్ల గణేశ్ తో తాను అంటే, ‘బిజీగా ఉన్నాను’ అని చెప్పాడని అన్నారు.

‘అమౌంట్ ఎప్పుడు క్లోజ్ చేస్తున్నారు?’ అని ప్రశ్నిస్తే, రూ.1.8 కోట్లు కదా! అని గణేశ్ అనడంతో, కాదు, రూ.7 కోట్లు అని చెప్పిన విషయాన్ని పీవీపీ గుర్తుచేశారు. ‘అన్న, నువ్వు నాతో పెట్టుకుంటే ఎప్పటికీ గెలవలేవు. నాకు హోం మినిస్టర్ సుచరిత గారు తెలుసు, బొత్స గారు తెలుసు’ అని గణేశ్ తనను పరోక్షంగా బెదిరించాడని చెప్పారు.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...