Skip to main content

తనకు బొత్స, సుచరిత తెలుసని బండ్ల గణేశ్ నన్ను బెదిరించాడు: నిర్మాత పీవీపీ

టాలీవుడ్ నిర్మాతలు పీవీపీ, బండ్ల గణేశ్ ల మధ్య నెలకొన్న ఆర్థిక వివాదం కారణంగా వీళ్లిద్దరూ పోలీసులను ఆశ్రయించి పరస్పరం ఫిర్యాదు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పీవీపీని పలకరించిన మీడియాతో ఆయన మాట్లాడుతూ, 2013, నవంబర్ లో ‘టెంపర్’ సినిమాకు ఫైనాన్స్ చేశామని, 2015, ఫిబ్రవరి 13న ఈ సినిమా రిలీజు అయిందని చెప్పారు.

అయితే, ఈ సినిమా రిలీజు అయిన రోజున బండ్ల గణేశ్ తమకు రూ.7 కోట్లు తక్కువగా చెల్లించారని ఆరోపించారు. ఈ డబ్బు చెల్లించకుండా గత ఐదేళ్ల నుంచి తప్పించుకుని తిరుగుతున్నాడని, తమ ఉద్యోగస్తులను ఇబ్బందికి గురిచేయడం వంటి పనులు చేస్తున్నారని ఆరోపించారు. మోసం చేసే మనస్తత్వంతో తమకు కట్టుకథలు చెబుతున్నాడని, లీగల్ గా తాము తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పారు.

ఇక నిన్న సాయంత్రం తన నివాసం వద్దకు ముగ్గురు వ్యక్తులు వచ్చారని, తాను వాళ్లకు తెలుసని చెప్పడంతో వారిని సెక్యూరిటీ సిబ్బంది లోపలకి అనుమతించారని అన్నారు. ఆ ముగ్గురు వ్యక్తుల్లో ఒకరి పేరు కిశోర్ అని, ఇద్దరు ముస్లిం వ్యక్తులని చెప్పారు. బండ్ల గణేశ్ తరపున మాట్లాడాలని కిషోర్ అనే వ్యక్తి తనతో చెప్పాడని, వారి బాడీ లాంగ్వేజ్ తేడాగా ఉందని, తన నివాసం నుంచి బయటకెళ్లిన తర్వాత ముప్పావు గంట అక్కడే నిలబడ్డారని ఆరోపించారు.

తన నివాసానికి వచ్చిన కిశోర్ తో పాటు ఆ ఇద్దరు వ్యక్తులను మళ్లీ చూస్తే గుర్తుపట్టగలుగుతానని అన్నారు. ఇలాంటి వాటికి తానేమీ భయపడనని చెప్పిన పీవీపీ, ఈ విషయమై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశానని చెప్పారు.

ఇటీవల పార్క్ హయత్ హోటల్ లో ఓ మీటింగ్ కు వెళ్లానని, అక్కడ వేరే వాళ్లను కలిసేందుకు వచ్చిన బండ్ల గణేశ్ తనను చూసి మాట్లాడాడని చెప్పారు. ఈ సందర్భంగా వారి మధ్య జరిగిన సంభాషణను ఆయన వివరించారు. ‘ఏమైంది, కనపడట్లేదు..లాస్ట్ వీక్ వస్తానన్నావుగా’ అని బండ్ల గణేశ్ తో తాను అంటే, ‘బిజీగా ఉన్నాను’ అని చెప్పాడని అన్నారు.

‘అమౌంట్ ఎప్పుడు క్లోజ్ చేస్తున్నారు?’ అని ప్రశ్నిస్తే, రూ.1.8 కోట్లు కదా! అని గణేశ్ అనడంతో, కాదు, రూ.7 కోట్లు అని చెప్పిన విషయాన్ని పీవీపీ గుర్తుచేశారు. ‘అన్న, నువ్వు నాతో పెట్టుకుంటే ఎప్పటికీ గెలవలేవు. నాకు హోం మినిస్టర్ సుచరిత గారు తెలుసు, బొత్స గారు తెలుసు’ అని గణేశ్ తనను పరోక్షంగా బెదిరించాడని చెప్పారు.

Comments

Popular posts from this blog

అమరావతిలో భూముల రేట్లు తగ్గకుండా: సీఆర్డీఏ స్థానంలో కొత్త అథారిటీ: కీలక నోటిఫికేషన్

 మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందడం, రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్డీ) రద్దు నేపథ్యంలో.. ప్రభుత్వం మెరుపు వేగంతో నిర్ణయాలను తీసుకుంటోంది. పరిపాలనను వేగవంతం చేసేలా తక్షణ చర్యలకు దిగింది. సీఆర్డీఏ బిల్లు రద్దు అనంతరం దాని స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలిని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. దాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఏఎంఆర్డీఏ కమిటీ సభ్యులనూ నియమించింది. సీఆర్డీఏకు బదులుగా ఏఎంఆర్డీఏ సీఆర్డీఏ స్థాయంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలి (ఏఎంఆర్డీఏ)ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్‌ను జారీ చేసింది. సీఆర్డీఏను రద్దు చేస్తూ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేసిన మరుసటి రోజే ఏఎంఆర్డీఏను తెరపైకి తీసుకొచ్చింది. దానితో పాటు కొత్త సభ్యులను నియమించింది. మున్సిపల్ శాఖ కార్యదర్శి జే శ్యామల రావు దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను జారీ చేశారు. మొత్తం 11 మంది సభ్యులను ఏఎంఆర్డీఏ కమిటీలో నియమించారు. సభ్యులు వీరే.. మున్సిపల్ శాఖ కార్యదర్శి డిప్య...

కర్ఫ్యూ ఎత్తేస్తే రక్తపాతమే.. యుద్ధం వస్తే మేం సిద్ధం : ఇమ్రాన్‌

జమ్ముకశ్మీర్‌లో కర్ఫ్యూ ఎత్తేస్తే రక్తపాతమేనని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చెప్పుకొచ్చారు. శుక్రవారం నాడు 74వ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో భాగంగా ఇమ్రాన్ మాట్లాడుతూ.. ఐరాస వేదికగా కవ్వింపు ప్రకటన చేశారు. కశ్మీర్‌ను కేవలం రాజకీయం కోసం మాత్రమే వాడుకుంటున్నారని విమర్శలు గుప్పించారు.   ప్రపంచం ఏం చేసింది?.   బాలాకోట్‌లో 500 మంది తీవ్రవాదులు రెడీగా ఉన్నారని ఇండియా రక్షణ మంత్రి చెబుతున్నారు. 500 మంది తీవ్రవాదులను పంపి మేమేం సాధిస్తాం?. 500 మంది తీవ్రవాదులను పంపాల్సిన అవసరం మాకేంటి.?. ఇస్లామిక్ టెర్రరిజం అంటూ ఇండియా మాపై ముద్ర వేస్తుంది. కశ్మీరీల హక్కులు ఎవరికీ పట్టవు. కశ్మీర్‌లో అనుసరిస్తున్న విధానాలు భారత్‌లో ఉన్న ముస్లింలపై ఎలా ప్రభావం చూపుతాయో మోదీ ఆలోచించారా?. 10 లక్షల మంది రోహింగ్యాలను బర్మా నుంచి గెంటేస్తే ప్రపంచం ఏం చేసింది?. ఇలాంటి పరిణామాలే ఇస్లాం సమాజంలో ఆవేదన, అసంతృప్తిని రేపుతున్నాయి ’  అని ఇమ్రాన్ ఆగ్రహ వ్యక్తం చేశారు. యుద్ధం వస్తే మేం సిద్ధం! ‘ ఇప్పుడు చాలా సంక్లిష్టం సమయం నడుస్తోంది. అణ్వాయుధాలున్న రెండు దేశాలు తలపడాల్స...