Skip to main content

ఆర్టీసీ సమ్మె.. ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమావేశం

ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో కార్మికులతో చర్చలు జరపాలన్న హైకోర్టు ఆదేశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సహా ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఆర్టీసీ సమ్మె 18వ రోజుకు చేరడంతో హైకోర్టు ప్రజల కష్టాలను దృష్టిలో పెట్టుకొని కార్మికులతో చర్చలు ప్రారంభించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

 సాయంత్రం వరకు సీఎం కేసీఆర్, మంత్రి పువ్వాడ, అధికారుల మధ్య  సమాలోచనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆర్టీసీలోని ఈడీ స్థాయి అధికారులతో కార్మికులను చర్చలకు ఆహ్వానించే అవకాశముందని సమాచారం. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న కార్మికుల ప్రధాన డిమాండ్ మినహా మిగతా డిమాండ్లపై చర్చలకు పిలిచే అవకాశముంది.   

Comments

Popular posts from this blog

అమరావతిలో భూముల రేట్లు తగ్గకుండా: సీఆర్డీఏ స్థానంలో కొత్త అథారిటీ: కీలక నోటిఫికేషన్

 మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందడం, రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్డీ) రద్దు నేపథ్యంలో.. ప్రభుత్వం మెరుపు వేగంతో నిర్ణయాలను తీసుకుంటోంది. పరిపాలనను వేగవంతం చేసేలా తక్షణ చర్యలకు దిగింది. సీఆర్డీఏ బిల్లు రద్దు అనంతరం దాని స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలిని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. దాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఏఎంఆర్డీఏ కమిటీ సభ్యులనూ నియమించింది. సీఆర్డీఏకు బదులుగా ఏఎంఆర్డీఏ సీఆర్డీఏ స్థాయంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలి (ఏఎంఆర్డీఏ)ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్‌ను జారీ చేసింది. సీఆర్డీఏను రద్దు చేస్తూ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేసిన మరుసటి రోజే ఏఎంఆర్డీఏను తెరపైకి తీసుకొచ్చింది. దానితో పాటు కొత్త సభ్యులను నియమించింది. మున్సిపల్ శాఖ కార్యదర్శి జే శ్యామల రావు దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను జారీ చేశారు. మొత్తం 11 మంది సభ్యులను ఏఎంఆర్డీఏ కమిటీలో నియమించారు. సభ్యులు వీరే.. మున్సిపల్ శాఖ కార్యదర్శి డిప్య...