Skip to main content

సీనియర్ నటి గీతాంజలి కన్నుమూత

అద్భుతమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన సీనియర్ నటి గీతాంజలి (72) ఇకలేరు. గురువారం తెల్లవారు జామున గుండెపోటుతో మృతిచెందారు. జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ఈ రోజు ఉదయం 4 గంటలకు ఆమె తుది శ్వాస విడిచారు.
 
  1947లో తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో గీతాంజలి జన్మించారు. ఆమె తెలుగుతో పాటు తమిళం, మళయాలం,హిందీ చిత్రాలలో ఆమె నటించారు. తెలుగులో 1961లో తొలిసారిగా సీతారామ కల్యాణం చిత్రంతో ఆమె సినీ ప్రయాణం మొదలైంది. బొబ్బిలి యుద్ధం, దేవత, లేతమనసులు,తోడు-నీడ, గుఢచారి-116 వంటి ఎన్నో సినిమాల్లో ఆమె నటించి మెప్పించారు. గీతాంజలి నటించిన తొలి సినిమా సీతారామ కల్యాణం అయితే.. తమన్నా కథానాయికగా రూపొందుతున్న దటీజ్ మహాలక్ష్మీ చివరి సినిమా. ఈ సినిమా షూటింగ్ ఇంకా జరుగుతోంది. తమిళంలో 13,హిందీలో5,మళయాలంలో 3సినిమాల్లో గీతాంజలి నటించారు. తెలుగులో ఎన్టీఆర్,ఏఎన్నార్,రామకృష్ణ సరసన ఆమె హీరోయిన్‌గా నటించారు.

Comments

Popular posts from this blog

అమరావతిలో భూముల రేట్లు తగ్గకుండా: సీఆర్డీఏ స్థానంలో కొత్త అథారిటీ: కీలక నోటిఫికేషన్

 మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందడం, రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్డీ) రద్దు నేపథ్యంలో.. ప్రభుత్వం మెరుపు వేగంతో నిర్ణయాలను తీసుకుంటోంది. పరిపాలనను వేగవంతం చేసేలా తక్షణ చర్యలకు దిగింది. సీఆర్డీఏ బిల్లు రద్దు అనంతరం దాని స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలిని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. దాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఏఎంఆర్డీఏ కమిటీ సభ్యులనూ నియమించింది. సీఆర్డీఏకు బదులుగా ఏఎంఆర్డీఏ సీఆర్డీఏ స్థాయంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలి (ఏఎంఆర్డీఏ)ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్‌ను జారీ చేసింది. సీఆర్డీఏను రద్దు చేస్తూ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేసిన మరుసటి రోజే ఏఎంఆర్డీఏను తెరపైకి తీసుకొచ్చింది. దానితో పాటు కొత్త సభ్యులను నియమించింది. మున్సిపల్ శాఖ కార్యదర్శి జే శ్యామల రావు దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను జారీ చేశారు. మొత్తం 11 మంది సభ్యులను ఏఎంఆర్డీఏ కమిటీలో నియమించారు. సభ్యులు వీరే.. మున్సిపల్ శాఖ కార్యదర్శి డిప్య...