Skip to main content

అర్చకుల చిరకాల స్వప్నాన్ని సీఎం జగన్ నెరవేర్చారు: ఏపీ మంత్రి వెల్లంపల్లి

 




అర్చకులు, బ్రాహ్మణుల పట్ల టీడీపీ ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించిందని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆరోపించారు. వంశపారం పర్యంగా అర్చకులకు న్యాయం చేస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జీవోపై ఆంధ్రప్రదేశ్ అర్చకుల సమాఖ్య హర్షం వ్యక్తం చేసింది.

ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్ కు వారు తమ కృతఙ్ఞతలు తెలిపారు. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, సెంట్రల్ నియోజక వర్గ ఎమ్మెల్యే మల్లాది విష్ణును వారు సన్మానించారు. విజయవాడ, బ్రాహ్మణ వీధిలోని దేవాదాయ శాఖ కార్యాలయంలో ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో వెల్లంపల్లి శ్రీనివాసరావు, డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొన్నారు.

మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, జీవో 439 విడుదల చేయడం ద్వారా అర్చకుల చిరకాల స్వప్నాన్ని సీఎం జగన్ నెరవేర్చారని ప్రశంసించారు. టీడీపీ హయాంలో బ్రాహ్మణులను ఓటు బ్యాంకుగా మాత్రమే చంద్రబాబు చూశారని, అర్చకులను నమ్మించి మోసం చేశారని ఆరోపించారు.

2007లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఈ చట్టాన్ని తీసుకు వచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. వైఎస్ హయాం తర్వాత అధికారంలో ఉన్న వాళ్లు ఆ చట్టాన్ని అమలు చేయలేదని చెప్పారు. దీనిపై పాదయాత్ర సమయంలో జగన్ ని కలిసిన అర్చకులు తమ సమస్యను విన్నవించుకున్నారని, నాడు వారికి ఇచ్చిన హామీని నేడు జగన్ నెరవేర్చారని చెప్పారు.

ఈ జీవో విడుదలైన దగ్గర నుంచి అర్చకులు తమ సంతోషం వ్యక్తం చేస్తున్నట్టు చెప్పారు. దేవాలయాల్లో ధూపదీప నైవేద్యం నిమిత్తం ఇస్తున్న మొత్తం రూ.5,000 నుంచి రూ.10,000కు పెంచుతామని, అర్చకులకు, బ్రాహ్మణులకు తప్పకుండా న్యాయం చేస్తామని చెప్పారు.

ఈ జీవోతో అర్చకులకు భరోసా లభిస్తుంది: కోన రఘుపతి
అర్చకుల కోరిక మేరకు ఎన్నికల్లో ఇచ్చిన హామీని జీవో 439 ద్వారా ఆచరణలో చూపారని కోన రఘుపతి అన్నారు. బ్రాహ్మణ, అర్చక సంఘాల ఎన్నో ఏళ్ల కలను సీఎం జగన్ సాకారం చేశారని కొనియాడారు. ఈ జీవో విడుదలతో అర్చకులకు వారి కుటుంబాల్లో ఉన్న భయాందోళనలు తొలగాయని అన్నారు. దేవుడి సేవలో సంతోషంగా నిస్వార్థంగా పనిచేసుకునేందుకు అర్చకులకు ఈ జీవో ద్వారా భరోసా లభిస్తుందని చెప్పారు.

అర్చకుల సమస్యలు పరిష్కరిస్తాం: మల్లాది విష్ణు

అర్చకులు సంక్షేమం నిమిత్తం వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 439 చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. హిందూ ధర్మాన్ని కాపాడతామని, అర్చకుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. అనంతరం, కోన రఘుపతిని, వెల్లంపల్లిని, మల్లాదిని అర్చకులు ఘనంగా సన్మానించారు.   

Comments

Popular posts from this blog

అత్యంత కష్టం మీద బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం బృందం

నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

మీడియాపై మాకు గౌరవముంది: కోటంరెడ్డి

  కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ పాలనపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మీడియాపై తమకు గౌరవం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. జీవో 2430 కొత్తగా తీసుకొచ్చింది కాదని, ఎప్పటినుంచో అది ఉందని తెలిపారు.  ఈ రోజు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్ని పత్రికలు, ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు వార్తలతో అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలని పేర్కొన్నారు. ఒకప్పుడు సాక్షి మీడియాను చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నేతలు ఎటుపోయారని నిలదీశారు. లోకేశ్ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మంగళగిరి నియోజక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేశ్ కు తెలియదని విమర్శించారు. తమ పాలనను చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, తన హయాంలో తన కొడుకు లోకేశ్ తో కలిసి దోచుకుని లోటు బడ్జెట్ ను చూపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని చెప్పారు.  చంద్రబాబుకు చదువుకునేటప్పటి నుంచే కులపిచ్చి ఉందని పేర్కొన్నారు. స్థాని...