తెలంగాణ సచివాలయం కూల్చివేతపై హైకోర్టు మంగళవారం కీలక ఆదేశాలిచ్చింది. రెండు వారాలపాటు సచివాలయం కూల్చివేత పనులు చేపట్టవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 14వ తేదీకి వాయిదా వేసింది. మరోవైపు మున్సిపల్ ఎన్నికల పిటిషన్పై కూడా ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. ఎన్నికల నోటిఫికేషన్ను విడుదల చేయవద్దని న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది. తరుపరి ఉత్తర్వులు దసరా సెలవుల తర్వాత వెల్లడిస్తామని, అప్పటివరకు ఎన్నికలపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని న్యాయస్థానం పేర్కొంది.
నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.
Comments
Post a Comment