తెలంగాణ సచివాలయం కూల్చివేతపై హైకోర్టు మంగళవారం కీలక ఆదేశాలిచ్చింది. రెండు వారాలపాటు సచివాలయం కూల్చివేత పనులు చేపట్టవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 14వ తేదీకి వాయిదా వేసింది. మరోవైపు మున్సిపల్ ఎన్నికల పిటిషన్పై కూడా ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. ఎన్నికల నోటిఫికేషన్ను విడుదల చేయవద్దని న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది. తరుపరి ఉత్తర్వులు దసరా సెలవుల తర్వాత వెల్లడిస్తామని, అప్పటివరకు ఎన్నికలపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని న్యాయస్థానం పేర్కొంది.
సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటోన్న నేపథ్యంలో ఆయనకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. ఆయనకు మహేశ్ బాబుతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో పవన్ కల్యాణ్ అద్భుత విజయాలు సాధించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.
Comments
Post a Comment