తెలంగాణ సచివాలయం కూల్చివేతపై హైకోర్టు మంగళవారం కీలక ఆదేశాలిచ్చింది. రెండు వారాలపాటు సచివాలయం కూల్చివేత పనులు చేపట్టవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 14వ తేదీకి వాయిదా వేసింది. మరోవైపు మున్సిపల్ ఎన్నికల పిటిషన్పై కూడా ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. ఎన్నికల నోటిఫికేషన్ను విడుదల చేయవద్దని న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది. తరుపరి ఉత్తర్వులు దసరా సెలవుల తర్వాత వెల్లడిస్తామని, అప్పటివరకు ఎన్నికలపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని న్యాయస్థానం పేర్కొంది.
బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Comments
Post a Comment