Skip to main content

సీఎం కేసీఆర్, ముగ్గురు మంత్రులపై... పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

సీఎం కేసీఆర్, ముగ్గురు మంత్రులపై... పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు ముగ్గురు మంత్రుల పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు మాజీ ఎమ్మెల్యే బోడిగె శోభ. కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఆమె కంప్లైంట్ చేశారు. సీఎం కేసీఆర్, మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, దయాకర్ రావు, గంగుల కమలాకర్ రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్లే ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.

మరోవైపు ఆర్టీసీ కార్మికుల సమ్మె ఇవాళ పదోరోజుకు చేరుకుంది. ఆర్టీసీ జేఏసీ పలు ఆందోళనలు నిర్వహిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ డిపోల ముందు బైఠాయింపు చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్ ఆత్మహత్య చేసుకున్నారు.

Comments

Popular posts from this blog

అంబులెన్స్‌కు దారి ఇచ్చిన సీఎం కాన్వాయ్...‌

వీడియో చూడండి : Click here ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాహన శ్రేణి అంబులెన్స్‌కు దారిఇచ్చింది. పులివెందుల నుంచి తిరిగివచ్చిన సీఎం గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి నివాసానికి బయల్దేరారు. గూడవల్లి నిడమానూరు మధ్య ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని తరలిస్తున్న అబులెన్స్‌కు దారి ఇచ్చారు. ఉయ్యూరు నుంచి గన్నవరం బైక్‌పైవెళ్తున్న చాపర్తిన శేఖర్‌ అనే వ్యక్తి ఉషారామ ఇంజినీరింగ్‌కాలేజీ సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. అతన్ని నేషనల్‌ హైవే అంబులెన్స్‌ ద్వారా విజయవాడ ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలిస్తుండగా, దీనికి ముందు ఉన్న ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పక్కకు తొలగి అంబులెన్స్‌కు దారి ఇచ్చింది.

పవన్ కు శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవి

  సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటోన్న నేపథ్యంలో ఆయనకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు.  ఆయనకు మహేశ్ బాబుతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో పవన్ కల్యాణ్ అద్భుత విజయాలు సాధించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.