Skip to main content

మరణించిన రైతుల వారసులకు రైతు భరోసా వర్తింపజేస్తాం: మంత్రి కన్నబాబు

ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు రైతు భరోసా లబ్దిదారుల ఎంపికపై స్పందించారు. రైతు భరోసా పథకం అర్హుల జాబితా తయారు చేసే ప్రక్రియ వేగంగా సాగుతోందని తెలిపారు. పీఎం కిసాన్ యోజన పథకం కింద 42 లక్షల మంది లబ్దిదారులు ఉన్నట్టు వెల్లడించారు. అయితే ఆ పథకంలో లక్షల సంఖ్యలో అనర్హులు ఉన్నట్టు గుర్తించినట్టు వివరించారు. మరణించిన రైతుల వారసులకు రైతు భరోసా వర్తింపచేయాలని నిర్ణయించినట్టు కన్నబాబు తెలిపారు. మృతి చెందిన రైతుల వారసులు 1.07 లక్షల మంది ఉన్నారని చెప్పారు.

లబ్దిదారులు, అనర్హుల జాబితాను వేర్వేరుగా ప్రదర్శిస్తామని, ఆదాయపన్ను చెల్లించే 1.5 లక్షల మంది రైతులు అనర్హులుగా తేలిందని వెల్లడించారు. అదేసమయంలో భూములున్న 21 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈ పథకానికి అనర్హులని స్పష్టం చేశారు. కౌలు రైతుల విషయానికొస్తూ, రాష్ట్రంలో 15.5 లక్షల మంది కౌలు రైతులు ఉన్నట్టు రికార్డులు చెబుతున్నాయని తెలిపారు. ఆధార్ సీడింగ్, ప్రజాసాధికార సర్వేతో లబ్దిదారుల వివరాలు పరిశీలిస్తున్నామని, 4.2 లక్షల ఆధార్ కార్డులు భూముల వివరాలకు సరిపోలడం లేదని అన్నారు.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.