Skip to main content

మరణించిన రైతుల వారసులకు రైతు భరోసా వర్తింపజేస్తాం: మంత్రి కన్నబాబు

ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు రైతు భరోసా లబ్దిదారుల ఎంపికపై స్పందించారు. రైతు భరోసా పథకం అర్హుల జాబితా తయారు చేసే ప్రక్రియ వేగంగా సాగుతోందని తెలిపారు. పీఎం కిసాన్ యోజన పథకం కింద 42 లక్షల మంది లబ్దిదారులు ఉన్నట్టు వెల్లడించారు. అయితే ఆ పథకంలో లక్షల సంఖ్యలో అనర్హులు ఉన్నట్టు గుర్తించినట్టు వివరించారు. మరణించిన రైతుల వారసులకు రైతు భరోసా వర్తింపచేయాలని నిర్ణయించినట్టు కన్నబాబు తెలిపారు. మృతి చెందిన రైతుల వారసులు 1.07 లక్షల మంది ఉన్నారని చెప్పారు.

లబ్దిదారులు, అనర్హుల జాబితాను వేర్వేరుగా ప్రదర్శిస్తామని, ఆదాయపన్ను చెల్లించే 1.5 లక్షల మంది రైతులు అనర్హులుగా తేలిందని వెల్లడించారు. అదేసమయంలో భూములున్న 21 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈ పథకానికి అనర్హులని స్పష్టం చేశారు. కౌలు రైతుల విషయానికొస్తూ, రాష్ట్రంలో 15.5 లక్షల మంది కౌలు రైతులు ఉన్నట్టు రికార్డులు చెబుతున్నాయని తెలిపారు. ఆధార్ సీడింగ్, ప్రజాసాధికార సర్వేతో లబ్దిదారుల వివరాలు పరిశీలిస్తున్నామని, 4.2 లక్షల ఆధార్ కార్డులు భూముల వివరాలకు సరిపోలడం లేదని అన్నారు.

Comments

Popular posts from this blog

అత్యంత కష్టం మీద బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం బృందం

నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

మీడియాపై మాకు గౌరవముంది: కోటంరెడ్డి

  కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ పాలనపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మీడియాపై తమకు గౌరవం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. జీవో 2430 కొత్తగా తీసుకొచ్చింది కాదని, ఎప్పటినుంచో అది ఉందని తెలిపారు.  ఈ రోజు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్ని పత్రికలు, ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు వార్తలతో అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలని పేర్కొన్నారు. ఒకప్పుడు సాక్షి మీడియాను చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నేతలు ఎటుపోయారని నిలదీశారు. లోకేశ్ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మంగళగిరి నియోజక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేశ్ కు తెలియదని విమర్శించారు. తమ పాలనను చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, తన హయాంలో తన కొడుకు లోకేశ్ తో కలిసి దోచుకుని లోటు బడ్జెట్ ను చూపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని చెప్పారు.  చంద్రబాబుకు చదువుకునేటప్పటి నుంచే కులపిచ్చి ఉందని పేర్కొన్నారు. స్థాని...