Skip to main content

మరణించిన రైతుల వారసులకు రైతు భరోసా వర్తింపజేస్తాం: మంత్రి కన్నబాబు

ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు రైతు భరోసా లబ్దిదారుల ఎంపికపై స్పందించారు. రైతు భరోసా పథకం అర్హుల జాబితా తయారు చేసే ప్రక్రియ వేగంగా సాగుతోందని తెలిపారు. పీఎం కిసాన్ యోజన పథకం కింద 42 లక్షల మంది లబ్దిదారులు ఉన్నట్టు వెల్లడించారు. అయితే ఆ పథకంలో లక్షల సంఖ్యలో అనర్హులు ఉన్నట్టు గుర్తించినట్టు వివరించారు. మరణించిన రైతుల వారసులకు రైతు భరోసా వర్తింపచేయాలని నిర్ణయించినట్టు కన్నబాబు తెలిపారు. మృతి చెందిన రైతుల వారసులు 1.07 లక్షల మంది ఉన్నారని చెప్పారు.

లబ్దిదారులు, అనర్హుల జాబితాను వేర్వేరుగా ప్రదర్శిస్తామని, ఆదాయపన్ను చెల్లించే 1.5 లక్షల మంది రైతులు అనర్హులుగా తేలిందని వెల్లడించారు. అదేసమయంలో భూములున్న 21 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈ పథకానికి అనర్హులని స్పష్టం చేశారు. కౌలు రైతుల విషయానికొస్తూ, రాష్ట్రంలో 15.5 లక్షల మంది కౌలు రైతులు ఉన్నట్టు రికార్డులు చెబుతున్నాయని తెలిపారు. ఆధార్ సీడింగ్, ప్రజాసాధికార సర్వేతో లబ్దిదారుల వివరాలు పరిశీలిస్తున్నామని, 4.2 లక్షల ఆధార్ కార్డులు భూముల వివరాలకు సరిపోలడం లేదని అన్నారు.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...