Skip to main content

సి యమ్ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి, కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇచ్చిన సలహా వింటే అందరు షాక్ అవుతారు.


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి రాజకీయపరమైన సలాహా ఇచ్చారు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌‌తో కలవొద్దని సూచించారు. ‘జగన్‌కు చెబుతున్నా.. ఇలాంటి కార్మిక వ్యతిరేకి, ఇద్దరు ఆర్టీసీ కార్మికులు చావడానికి కారణమైన కేసీఆర్‌తో కలువకు.. కలిస్తే మీ పేరు, మీ నాన్న పేరు కూడా చెడిపోతుంది. ఇలాంటి దుర్మార్గుల్ని కలవొద్దని కోరుతున్నా’అన్నారు కోమటిరెడ్డి. ఆర్టీసీ సమ్మె విషయంలో స్పందించిన ఆయన.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
credit: third party image reference
ఆర్టీసీ కార్మికుల సమస్యలకు కేసీఆర్‌కు పట్టవా అని ప్రశ్నించారు కోమటిరెడ్డి. ఆర్టీసీ డ్రైవర్లు బలి దానాలు చేసుకున్నా కనీసం స్పందించకపోవడం దారుణం అన్నారు. ఆర్టీసీ కార్మికులు ధైర్యంగా ఉండాలని.. తాము అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. ఏపీలో లోటు బడ్జెట్.. ఇక్కడ మిగులు బడ్జెట్ ఉందని.. అయినా అక్కడి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారని గుర్తు చేశారు వెంకటరెడ్డి.
credit: third party image reference
కేసీఆర్ నెలకోసారి జగన్‌మోహన్‌రెడ్డిని పిలిపించుకొని.. ఆయనేదో గెలిపించుకున్నట్లు ఫీలవుతున్నారని కోమటిరెడ్డి ఎద్దేవా చేశారు. గతంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చేసిన సేవలు.. జగన్ పడిన కష్టంతోనే ఎన్నికల్లో విజయం సాధించారని.. కేసీఆర్ బతికున్నా కూడా బిడ్డను గెలిపించుకోలేకపోయిన అసమర్థుడని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయన జగన్‌మోహన్‌రెడ్డిని గెలిపించలేదన్నారు.

Comments

Popular posts from this blog

పవన్ కు శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవి

  సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటోన్న నేపథ్యంలో ఆయనకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు.  ఆయనకు మహేశ్ బాబుతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో పవన్ కల్యాణ్ అద్భుత విజయాలు సాధించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.

చింతమనేనికి బెయిల్ నిరాకరణ: అక్టోబర్ 9వరకు రిమాండ్ పొడిగింపు

తెలుగుదేశం పార్టీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు కోర్టులో చుక్కెదురు అయ్యింది. చింతమనేనికి బెయిల్ ఇచ్చేందుకు ఏలూరు కోర్టు నిరాకరించింది. అంతేకాదు చింతమనేని రిమాండ్ ను అక్టోబర్ 9 వరకు పొండిగించింది.  2017లో అప్పనపాడు గ్రామంలో స్థల వివాదంలో వ్యక్తిని నిర్బంధించి కులం పేరుతో దూషించిన కేసులో కేసు నమోదు అయ్యింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో భాగంగా ఇటీవలే చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.  అనంతరం చింతమనేని ప్రభాకర్ ను ఏలూరులోని ఎస్సీఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరచగా కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. రిమాండ్ పూర్తవ్వడంతో బుధవారం పోలీసులు మరోసారి ఏలూరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరిచారు.  అలాగే బెయిల్ ఇవ్వాలంటూ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తరపు న్యాయవాది సైతం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. చింతమనేని బెయిల్ పిటీషన్ ను న్యాయస్థానం తోసిపుచ్చింది. అనంతరం చింతమనేని రిమాండ్ ను వచ్చే నెల 9 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏలూరు కోర్టు.  ఇకపోతే చింతమనేని ప్రభాకర్ ను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన సమయంలో మహిళా పో...