Skip to main content

సి యమ్ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి, కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇచ్చిన సలహా వింటే అందరు షాక్ అవుతారు.


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి రాజకీయపరమైన సలాహా ఇచ్చారు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌‌తో కలవొద్దని సూచించారు. ‘జగన్‌కు చెబుతున్నా.. ఇలాంటి కార్మిక వ్యతిరేకి, ఇద్దరు ఆర్టీసీ కార్మికులు చావడానికి కారణమైన కేసీఆర్‌తో కలువకు.. కలిస్తే మీ పేరు, మీ నాన్న పేరు కూడా చెడిపోతుంది. ఇలాంటి దుర్మార్గుల్ని కలవొద్దని కోరుతున్నా’అన్నారు కోమటిరెడ్డి. ఆర్టీసీ సమ్మె విషయంలో స్పందించిన ఆయన.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
credit: third party image reference
ఆర్టీసీ కార్మికుల సమస్యలకు కేసీఆర్‌కు పట్టవా అని ప్రశ్నించారు కోమటిరెడ్డి. ఆర్టీసీ డ్రైవర్లు బలి దానాలు చేసుకున్నా కనీసం స్పందించకపోవడం దారుణం అన్నారు. ఆర్టీసీ కార్మికులు ధైర్యంగా ఉండాలని.. తాము అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. ఏపీలో లోటు బడ్జెట్.. ఇక్కడ మిగులు బడ్జెట్ ఉందని.. అయినా అక్కడి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారని గుర్తు చేశారు వెంకటరెడ్డి.
credit: third party image reference
కేసీఆర్ నెలకోసారి జగన్‌మోహన్‌రెడ్డిని పిలిపించుకొని.. ఆయనేదో గెలిపించుకున్నట్లు ఫీలవుతున్నారని కోమటిరెడ్డి ఎద్దేవా చేశారు. గతంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చేసిన సేవలు.. జగన్ పడిన కష్టంతోనే ఎన్నికల్లో విజయం సాధించారని.. కేసీఆర్ బతికున్నా కూడా బిడ్డను గెలిపించుకోలేకపోయిన అసమర్థుడని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయన జగన్‌మోహన్‌రెడ్డిని గెలిపించలేదన్నారు.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...