Skip to main content

వల్లభనేని వంశీ బీజేపీని సంప్రదించారు: సుజనా చౌదరి

 

గన్నవరం శాసనసభ్యుడు వల్లభనేని వంశీ ఇప్పుడు ఏ పార్టీలో చేరతారన్నది అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. టీడీపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ ఆయన చంద్రబాబుకు లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి స్పందించారు. వల్లభనేని వంశీ బీజేపీని సంప్రదించి తన సాధకబాధకాలు చెప్పుకున్నారని వెల్లడించారు. తాను ఎదుర్కొంటున్న ఇబ్బందులను బీజేపీ నాయకత్వంతో చెప్పుకున్నారని, ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సింది ఆయనేనని సుజనా స్పష్టం చేశారు. సత్తా ఉన్న నేతలు బీజేపీలోకి రావొచ్చని, అలాంటివారికి తాము ఆహ్వానం పలుకుతున్నామని తెలిపారు.

కాగా, తన రాజీనామా ప్రకటించకముందు వంశీ బీజేపీ నేత సుజనాతో ఒకే కారులో ప్రయాణించడం పలు సందేహాలకు తావిచ్చింది. వంశీ బీజేపీలో చేరతారని భావించినా ఆయన వేచిచూసే ధోరణి అవలంబిస్తున్నట్టు తెలుస్తోంది.  

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.