Skip to main content

తీరిన టీటీడీ చిల్లర కష్టం... చిత్తూరు నుంచి తిరుపతికి ఆర్బీఐ చెస్ట్!

 


ఏళ్ల తరబడి భక్తులు సమర్పించిన చిల్లర కానుకలను నిల్వ చేయలేక, మార్చుకోలేక తీవ్ర ఇబ్బందులు పడిన, తిరుమల తిరుపతి దేవస్థానం కష్టాలు ఎట్టకేలకు తీరిపోయాయి. గత రెండు నెలల్లో మొత్తం రూ. 26 కోట్ల విలువైన చిల్లర నాణాలను ఆర్బీఐ తీసుకుంది. మరో రూ. 5 కోట్ల విలువైన నాణాలు మాత్రం టీటీడీ వద్ద ఇంకా మిగిలివుండగా, నెలాఖరులోగా వాటిని కూడా మారుస్తామని అధికారులు అంటున్నారు.

కాగా, ప్రస్తుతం చిత్తూరులో ఉన్న ఆర్బీఐ చెస్ట్ ను తిరుపతికి తరలించాలని టీటీడీ కోరగా, అందుకు ఆర్బీఐ సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. ఆర్బీఐ చెస్ట్ ను తిరుపతిలో ఏర్పాటు చేస్తే, చిల్లర నాణాల మార్పిడితో పాటు, నోట్ల డిపాజిట్ కూడా సులభతరం అవుతుందని టీటీడీ భావిస్తోంది. దీనిపై రిజర్వ్ బ్యాంక్ ఉన్నతాధికారులు త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు.   

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.