Skip to main content

తీరిన టీటీడీ చిల్లర కష్టం... చిత్తూరు నుంచి తిరుపతికి ఆర్బీఐ చెస్ట్!

 


ఏళ్ల తరబడి భక్తులు సమర్పించిన చిల్లర కానుకలను నిల్వ చేయలేక, మార్చుకోలేక తీవ్ర ఇబ్బందులు పడిన, తిరుమల తిరుపతి దేవస్థానం కష్టాలు ఎట్టకేలకు తీరిపోయాయి. గత రెండు నెలల్లో మొత్తం రూ. 26 కోట్ల విలువైన చిల్లర నాణాలను ఆర్బీఐ తీసుకుంది. మరో రూ. 5 కోట్ల విలువైన నాణాలు మాత్రం టీటీడీ వద్ద ఇంకా మిగిలివుండగా, నెలాఖరులోగా వాటిని కూడా మారుస్తామని అధికారులు అంటున్నారు.

కాగా, ప్రస్తుతం చిత్తూరులో ఉన్న ఆర్బీఐ చెస్ట్ ను తిరుపతికి తరలించాలని టీటీడీ కోరగా, అందుకు ఆర్బీఐ సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. ఆర్బీఐ చెస్ట్ ను తిరుపతిలో ఏర్పాటు చేస్తే, చిల్లర నాణాల మార్పిడితో పాటు, నోట్ల డిపాజిట్ కూడా సులభతరం అవుతుందని టీటీడీ భావిస్తోంది. దీనిపై రిజర్వ్ బ్యాంక్ ఉన్నతాధికారులు త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు.   

Comments

Popular posts from this blog

అంబులెన్స్‌కు దారి ఇచ్చిన సీఎం కాన్వాయ్...‌

వీడియో చూడండి : Click here ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాహన శ్రేణి అంబులెన్స్‌కు దారిఇచ్చింది. పులివెందుల నుంచి తిరిగివచ్చిన సీఎం గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి నివాసానికి బయల్దేరారు. గూడవల్లి నిడమానూరు మధ్య ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని తరలిస్తున్న అబులెన్స్‌కు దారి ఇచ్చారు. ఉయ్యూరు నుంచి గన్నవరం బైక్‌పైవెళ్తున్న చాపర్తిన శేఖర్‌ అనే వ్యక్తి ఉషారామ ఇంజినీరింగ్‌కాలేజీ సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. అతన్ని నేషనల్‌ హైవే అంబులెన్స్‌ ద్వారా విజయవాడ ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలిస్తుండగా, దీనికి ముందు ఉన్న ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పక్కకు తొలగి అంబులెన్స్‌కు దారి ఇచ్చింది.

మరోసారి రంగంలోకి దిగిన ధర్మాడి సత్యం... ఓ చిన్నారి కోసం అన్వేషణ!

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో దీప్తిశ్రీ అనే ఏడేళ్ల చిన్నారి అదృశ్యం కావడం సంచలనం సృష్టించింది. దీప్తిశ్రీని  హత్యచేసి ఇంద్రపాలెం వద్ద ఉప్పుటేరులో పడవేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. అమె సవతి తల్లి శాంతకుమారి ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటుందని దీప్తిశ్రీ బంధువులు ఆరోపిస్తున్నారు. ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించడంతో కీలక సమాచారం అందజేసినట్టు తెలుస్తోంది. శాంతకుమారి ఇచ్చిన సమాచారం ఆధారంగా ఇంద్రపాలెం లాకుల వద్ద దీప్తిశ్రీ మృతదేహం కోసం గాలింపు చేపట్టారు. అందుకోసం పోలీసులు ధర్మాడి సత్యం బృందం సాయం కోరారు. ఇటీవలే గోదావరి నదిలో బోటును వెలికితీసిన ధర్మాడి సత్యం ఓ చిన్నారి కోసం వెంటనే స్పందించారు. తన బృందంతో ఉప్పుటేరులో గాలింపు చేపట్టారు. అయితే, 30 గంటలు గడిచిన తర్వాతే మృతదేహం నీటిపై తేలుతుందని, ఈలోపు తమ ప్రయత్నాలు కొనసాగిస్తామని ధర్మాడి సత్యం తెలిపారు.