Skip to main content

తీరిన టీటీడీ చిల్లర కష్టం... చిత్తూరు నుంచి తిరుపతికి ఆర్బీఐ చెస్ట్!

 


ఏళ్ల తరబడి భక్తులు సమర్పించిన చిల్లర కానుకలను నిల్వ చేయలేక, మార్చుకోలేక తీవ్ర ఇబ్బందులు పడిన, తిరుమల తిరుపతి దేవస్థానం కష్టాలు ఎట్టకేలకు తీరిపోయాయి. గత రెండు నెలల్లో మొత్తం రూ. 26 కోట్ల విలువైన చిల్లర నాణాలను ఆర్బీఐ తీసుకుంది. మరో రూ. 5 కోట్ల విలువైన నాణాలు మాత్రం టీటీడీ వద్ద ఇంకా మిగిలివుండగా, నెలాఖరులోగా వాటిని కూడా మారుస్తామని అధికారులు అంటున్నారు.

కాగా, ప్రస్తుతం చిత్తూరులో ఉన్న ఆర్బీఐ చెస్ట్ ను తిరుపతికి తరలించాలని టీటీడీ కోరగా, అందుకు ఆర్బీఐ సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. ఆర్బీఐ చెస్ట్ ను తిరుపతిలో ఏర్పాటు చేస్తే, చిల్లర నాణాల మార్పిడితో పాటు, నోట్ల డిపాజిట్ కూడా సులభతరం అవుతుందని టీటీడీ భావిస్తోంది. దీనిపై రిజర్వ్ బ్యాంక్ ఉన్నతాధికారులు త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు.   

Comments

Popular posts from this blog

అమరావతిలో భూముల రేట్లు తగ్గకుండా: సీఆర్డీఏ స్థానంలో కొత్త అథారిటీ: కీలక నోటిఫికేషన్

 మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందడం, రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్డీ) రద్దు నేపథ్యంలో.. ప్రభుత్వం మెరుపు వేగంతో నిర్ణయాలను తీసుకుంటోంది. పరిపాలనను వేగవంతం చేసేలా తక్షణ చర్యలకు దిగింది. సీఆర్డీఏ బిల్లు రద్దు అనంతరం దాని స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలిని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. దాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఏఎంఆర్డీఏ కమిటీ సభ్యులనూ నియమించింది. సీఆర్డీఏకు బదులుగా ఏఎంఆర్డీఏ సీఆర్డీఏ స్థాయంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలి (ఏఎంఆర్డీఏ)ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్‌ను జారీ చేసింది. సీఆర్డీఏను రద్దు చేస్తూ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేసిన మరుసటి రోజే ఏఎంఆర్డీఏను తెరపైకి తీసుకొచ్చింది. దానితో పాటు కొత్త సభ్యులను నియమించింది. మున్సిపల్ శాఖ కార్యదర్శి జే శ్యామల రావు దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను జారీ చేశారు. మొత్తం 11 మంది సభ్యులను ఏఎంఆర్డీఏ కమిటీలో నియమించారు. సభ్యులు వీరే.. మున్సిపల్ శాఖ కార్యదర్శి డిప్య...