Skip to main content

బాగ్దాదీపై దాడిని లైవ్ చూసిన డొనాల్డ్ ట్రంప్... దాడి చేస్తున్న వీడియోలు ఇవిగో!


ఎనిమిది అమెరికన్ యుద్ధ హెలికాప్టర్లు... వారికి తాము చేయాల్సిన పనేమిటో తెలుసు. అది ఎంత క్లిష్టమైనదో కూడా తెలుసు. శత్రువుకు ఏ మాత్రం అనుమానం రాకుండా చుట్టుముట్టాలి. దానికన్నా ముందు వారిని భయకంపితులను చేసేలా వైమానిక దాడులు జరపాలి. ఈ ఆపరేషన్ మొత్తం ఐసిస్ చీఫ్ అబూ బకర్ అల్ బాగ్దాదీని హతమార్చేందుకే.

తమ సైన్యం బాగ్దాదీని హతమార్చేందుకు బయలుదేరిన తరువాత, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మొత్తం వ్యవహారాన్ని దగ్గరుండి లైవ్ చూశారు. కొందరు సైనికాధికారులు, సలహాదారులతో కలిసి దాదాపు 90 నిమిషాల పాటు జరిగిన ఆపరేషన్ ను సమీక్షించారు. అమెరికా దళాలు చుట్టుముట్టిన తరువాత, బాగ్దాదీతో పాటు అతని భార్య, తమ వద్ద ఉన్న బాంబులను పేల్చేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అమెరికన్ సైనికులు దాడి జరుపుతున్న దృశ్యాలతో పాటు, దాడి తరువాత బాగ్దాదీ దాగున్న బంకర్ దృశ్యాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.


Comments

Popular posts from this blog

అత్యంత కష్టం మీద బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం బృందం

నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

మీడియాపై మాకు గౌరవముంది: కోటంరెడ్డి

  కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ పాలనపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మీడియాపై తమకు గౌరవం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. జీవో 2430 కొత్తగా తీసుకొచ్చింది కాదని, ఎప్పటినుంచో అది ఉందని తెలిపారు.  ఈ రోజు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్ని పత్రికలు, ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు వార్తలతో అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలని పేర్కొన్నారు. ఒకప్పుడు సాక్షి మీడియాను చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నేతలు ఎటుపోయారని నిలదీశారు. లోకేశ్ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మంగళగిరి నియోజక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేశ్ కు తెలియదని విమర్శించారు. తమ పాలనను చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, తన హయాంలో తన కొడుకు లోకేశ్ తో కలిసి దోచుకుని లోటు బడ్జెట్ ను చూపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని చెప్పారు.  చంద్రబాబుకు చదువుకునేటప్పటి నుంచే కులపిచ్చి ఉందని పేర్కొన్నారు. స్థాని...