Skip to main content

హర్యానా సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన మనోహర్ లాల్ ఖత్తర్

 


హర్యానా రాజకీయ అనిశ్చితికి తెరపడింది. బీజేపీ-జేజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానం పలకగా, ముఖ్యమంత్రిగా బీజేపీ నేత మనోహర్ లాల్ ఖత్తర్ ప్రమాణస్వీకారం చేశారు. ఖత్తర్ తో రాష్ట్ర గవర్నర్ సత్యదేవ్ నారాయణ ఆర్య ప్రమాణం చేయించారు. చండీగఢ్ లోని రాజ్ భవన్ లో ఈ కార్యక్రమం జరిగింది. ఖత్తర్ సీఎంగా వ్యవహరించడం ఇది రెండోసారి. గత ప్రభుత్వంలోనూ ఆయనే ముఖ్యమంత్రి అన్న సంగతి తెలిసిందే. అయితే ఈసారి ఎన్నికల్లో బీజేపీకి స్పష్టమైన ఆధిక్యం దక్కకపోవడంతో స్థానిక పార్టీ అయిన జన్ నాయక్ జనతా పార్టీ (జేజేపీ) మద్దతు తీసుకుని ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. కాగా,  ఖత్తర్ ప్రమాణస్వీకారోత్సవానికి బీజేపీ అగ్రనేత జేపీ నడ్డా, ఎన్డీయే పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు.  

Comments

Popular posts from this blog

వారానికోసారి కష్టమేమీ కాదు... సీఎం జగన్‌ కేసులో సీబీఐ కౌంటర్

కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం జగన్ వేసిన పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. అక్రమాస్తుల కేసు విచారణ నుంచి తనకు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీబీఐ కోర్టులో వేసిన పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. సీఎం జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. సాక్షులను జగన్ ప్రభావితం చేసే అవకాశం ఉందని పిటిషన్‌లో పేర్కొంది. ఆయన వాస్తవాలను దాచిపెట్టి పిటిషన్ వేశారని ఆరోపించింది. జగన్ జైల్లో ఉన్నప్పుడు సాక్షులను ప్రభావితం చేశారని... సీఎం పదవిలో ఉన్న జగన్ సాక్షులను మరింత ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ తన పిటిషన్‌లో పేర్కొంది. ఏపీలో రెవెన్యూ లోటు అనేది సీఎంగా ఉన్న జగన్ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చే కారణం కాదని తెలిపింది. సీఎంగా ఉన్న జగన్ విజయవాడ నుంచి వారానికోసారి హైదరాబాద్ రావడంకష్టమేమీ కాదని కౌంటర్‌ పిటిషన్‌లో సీబీఐ పేర్కొన్నట్టు తెలుస్తోంది. సీబీఐ కౌంటర్‌పై కోర్టు శుక్రవారం వాదనలు వినిపించనుంది.

బోటు వెలికితీత మరింత ఆలస్యం

కచ్చులూరు వద్ద మునిగిన బోటును రేపు వెలికితీస్తామని ధర్మాడి సత్యం తెలిపారు. బోటు వెలికితీత కోసం రెండోరోజు చేసిన ప్రయత్నాలు విఫలమైనట్లు చెప్పారు. వాతావరణం అనుకూలించనందువల్లే ఈ ఆలస్యం జరుగుతుందని వివరించారు. గోదావరిలో వరద ప్రహహం తగ్గిన కారణంగా బోటును రేపు బయటికి తీస్తామని స్పష్టం చేశారు. కాగా.. ధర్మాడి సత్యం బృందం వేసిన లంగర్‌కు బోటు తగిలి కదిలిందని స్థానికులు తెలిపారు.