Skip to main content

ఆ ఎమ్మెల్యే వ‌ద్దు.. గ‌ళ‌మెత్తిన‌ ఉమాభార‌తి



హ‌ర్యానా అసెంబ్లీ ఫ‌లితాలు ర‌స‌వ‌త్త‌రంగా వెలుబ‌డిన విష‌యం తెలిసిందే. బీజేపీ 40 సీట్ల‌తో ఆధిక్యంలో ఉన్నా.. ప్ర‌భుత్వ ఏర్పాటుకు కావాల్సిన బ‌లం లేదు. దీంతో స్వ‌తంత్య్ర ఎమ్మెల్యేలు.. ఇప్పుడు ఆ పార్టీలో చేరుతున్నారు. ఆ జాబితాలోనే ఎమ్మెల్యే గోపాల్ కండా కూడా ఉన్నారు. గ‌తంలో బీజేపీలోనే ఉన్న అత‌ను.. లైంగిక దాడి ఆరోప‌ణ‌లు రావ‌డంతో ఆ పార్టీకి దూరం అయ్యారు. సిర్‌సా నుంచి గెలిచిన గోపాల్ కండా ఇప్పుడు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నాడు. మ‌ద్ద‌తు ఇస్తానంటూ ముందుకువ‌చ్చాడు. కానీ ఆ పార్టీ మ‌హిళా నేత‌లు ఆ ఎమ్మెల్యేను తీసుకోవ‌ద్దు అంటూ త‌మ అభిప్రాయాన్ని వినిపిస్తున్నారు. హ‌ర్యానాలో ప్ర‌భుత్వ ఏర్పాటును స‌మ‌ర్థిస్తున్నా.. గోపాల్ లాంటి ఎమ్మెల్యేల‌ను పార్టీలోకి తీసుకోరాదు అని సీనియ‌ర్ నేత ఉమాభార‌తి ట్వీట్ చేశారు. పార్టీలో మోదీ లాంటి శ‌క్తివంత‌మైన నేత ఉన్న‌ప్పుడు .. గోపాల్ లాంటి ఎమ్మెల్యేలు ఎందుకు అని ఆమె ప్ర‌శ్నించారు. రేప్ ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న గోపాల్ కండాను బీజేపీ స్వాగ‌తిస్తోంద‌ని, అంటే ఆ పార్టీకి మ‌హిళ‌ల భ‌ద్ర‌త ప‌ట్ల చిత్త‌శుద్ధి లేద‌ని మ‌హిళా కాంగ్రెస్ నేత సుష్మితా దేవ్ విమ‌ర్శించారు. 90 సీట్లు ఉన్న హ‌ర్యానాలో కాంగ్రెస్ 31, జేపీపీ 10 సీట్లు నెగ్గాయి. బీజేపీకి చెందిన 8 మంది మంత్రులు ఓట‌మిపాల‌య్యారు.

Comments

Popular posts from this blog

అమరావతిలో భూముల రేట్లు తగ్గకుండా: సీఆర్డీఏ స్థానంలో కొత్త అథారిటీ: కీలక నోటిఫికేషన్

 మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందడం, రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్డీ) రద్దు నేపథ్యంలో.. ప్రభుత్వం మెరుపు వేగంతో నిర్ణయాలను తీసుకుంటోంది. పరిపాలనను వేగవంతం చేసేలా తక్షణ చర్యలకు దిగింది. సీఆర్డీఏ బిల్లు రద్దు అనంతరం దాని స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలిని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. దాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఏఎంఆర్డీఏ కమిటీ సభ్యులనూ నియమించింది. సీఆర్డీఏకు బదులుగా ఏఎంఆర్డీఏ సీఆర్డీఏ స్థాయంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలి (ఏఎంఆర్డీఏ)ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్‌ను జారీ చేసింది. సీఆర్డీఏను రద్దు చేస్తూ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేసిన మరుసటి రోజే ఏఎంఆర్డీఏను తెరపైకి తీసుకొచ్చింది. దానితో పాటు కొత్త సభ్యులను నియమించింది. మున్సిపల్ శాఖ కార్యదర్శి జే శ్యామల రావు దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను జారీ చేశారు. మొత్తం 11 మంది సభ్యులను ఏఎంఆర్డీఏ కమిటీలో నియమించారు. సభ్యులు వీరే.. మున్సిపల్ శాఖ కార్యదర్శి డిప్య...

కర్ఫ్యూ ఎత్తేస్తే రక్తపాతమే.. యుద్ధం వస్తే మేం సిద్ధం : ఇమ్రాన్‌

జమ్ముకశ్మీర్‌లో కర్ఫ్యూ ఎత్తేస్తే రక్తపాతమేనని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చెప్పుకొచ్చారు. శుక్రవారం నాడు 74వ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో భాగంగా ఇమ్రాన్ మాట్లాడుతూ.. ఐరాస వేదికగా కవ్వింపు ప్రకటన చేశారు. కశ్మీర్‌ను కేవలం రాజకీయం కోసం మాత్రమే వాడుకుంటున్నారని విమర్శలు గుప్పించారు.   ప్రపంచం ఏం చేసింది?.   బాలాకోట్‌లో 500 మంది తీవ్రవాదులు రెడీగా ఉన్నారని ఇండియా రక్షణ మంత్రి చెబుతున్నారు. 500 మంది తీవ్రవాదులను పంపి మేమేం సాధిస్తాం?. 500 మంది తీవ్రవాదులను పంపాల్సిన అవసరం మాకేంటి.?. ఇస్లామిక్ టెర్రరిజం అంటూ ఇండియా మాపై ముద్ర వేస్తుంది. కశ్మీరీల హక్కులు ఎవరికీ పట్టవు. కశ్మీర్‌లో అనుసరిస్తున్న విధానాలు భారత్‌లో ఉన్న ముస్లింలపై ఎలా ప్రభావం చూపుతాయో మోదీ ఆలోచించారా?. 10 లక్షల మంది రోహింగ్యాలను బర్మా నుంచి గెంటేస్తే ప్రపంచం ఏం చేసింది?. ఇలాంటి పరిణామాలే ఇస్లాం సమాజంలో ఆవేదన, అసంతృప్తిని రేపుతున్నాయి ’  అని ఇమ్రాన్ ఆగ్రహ వ్యక్తం చేశారు. యుద్ధం వస్తే మేం సిద్ధం! ‘ ఇప్పుడు చాలా సంక్లిష్టం సమయం నడుస్తోంది. అణ్వాయుధాలున్న రెండు దేశాలు తలపడాల్స...