Skip to main content

ఆ ఎమ్మెల్యే వ‌ద్దు.. గ‌ళ‌మెత్తిన‌ ఉమాభార‌తి



హ‌ర్యానా అసెంబ్లీ ఫ‌లితాలు ర‌స‌వ‌త్త‌రంగా వెలుబ‌డిన విష‌యం తెలిసిందే. బీజేపీ 40 సీట్ల‌తో ఆధిక్యంలో ఉన్నా.. ప్ర‌భుత్వ ఏర్పాటుకు కావాల్సిన బ‌లం లేదు. దీంతో స్వ‌తంత్య్ర ఎమ్మెల్యేలు.. ఇప్పుడు ఆ పార్టీలో చేరుతున్నారు. ఆ జాబితాలోనే ఎమ్మెల్యే గోపాల్ కండా కూడా ఉన్నారు. గ‌తంలో బీజేపీలోనే ఉన్న అత‌ను.. లైంగిక దాడి ఆరోప‌ణ‌లు రావ‌డంతో ఆ పార్టీకి దూరం అయ్యారు. సిర్‌సా నుంచి గెలిచిన గోపాల్ కండా ఇప్పుడు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నాడు. మ‌ద్ద‌తు ఇస్తానంటూ ముందుకువ‌చ్చాడు. కానీ ఆ పార్టీ మ‌హిళా నేత‌లు ఆ ఎమ్మెల్యేను తీసుకోవ‌ద్దు అంటూ త‌మ అభిప్రాయాన్ని వినిపిస్తున్నారు. హ‌ర్యానాలో ప్ర‌భుత్వ ఏర్పాటును స‌మ‌ర్థిస్తున్నా.. గోపాల్ లాంటి ఎమ్మెల్యేల‌ను పార్టీలోకి తీసుకోరాదు అని సీనియ‌ర్ నేత ఉమాభార‌తి ట్వీట్ చేశారు. పార్టీలో మోదీ లాంటి శ‌క్తివంత‌మైన నేత ఉన్న‌ప్పుడు .. గోపాల్ లాంటి ఎమ్మెల్యేలు ఎందుకు అని ఆమె ప్ర‌శ్నించారు. రేప్ ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న గోపాల్ కండాను బీజేపీ స్వాగ‌తిస్తోంద‌ని, అంటే ఆ పార్టీకి మ‌హిళ‌ల భ‌ద్ర‌త ప‌ట్ల చిత్త‌శుద్ధి లేద‌ని మ‌హిళా కాంగ్రెస్ నేత సుష్మితా దేవ్ విమ‌ర్శించారు. 90 సీట్లు ఉన్న హ‌ర్యానాలో కాంగ్రెస్ 31, జేపీపీ 10 సీట్లు నెగ్గాయి. బీజేపీకి చెందిన 8 మంది మంత్రులు ఓట‌మిపాల‌య్యారు.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...