Skip to main content

ఆ ఎమ్మెల్యే వ‌ద్దు.. గ‌ళ‌మెత్తిన‌ ఉమాభార‌తి



హ‌ర్యానా అసెంబ్లీ ఫ‌లితాలు ర‌స‌వ‌త్త‌రంగా వెలుబ‌డిన విష‌యం తెలిసిందే. బీజేపీ 40 సీట్ల‌తో ఆధిక్యంలో ఉన్నా.. ప్ర‌భుత్వ ఏర్పాటుకు కావాల్సిన బ‌లం లేదు. దీంతో స్వ‌తంత్య్ర ఎమ్మెల్యేలు.. ఇప్పుడు ఆ పార్టీలో చేరుతున్నారు. ఆ జాబితాలోనే ఎమ్మెల్యే గోపాల్ కండా కూడా ఉన్నారు. గ‌తంలో బీజేపీలోనే ఉన్న అత‌ను.. లైంగిక దాడి ఆరోప‌ణ‌లు రావ‌డంతో ఆ పార్టీకి దూరం అయ్యారు. సిర్‌సా నుంచి గెలిచిన గోపాల్ కండా ఇప్పుడు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నాడు. మ‌ద్ద‌తు ఇస్తానంటూ ముందుకువ‌చ్చాడు. కానీ ఆ పార్టీ మ‌హిళా నేత‌లు ఆ ఎమ్మెల్యేను తీసుకోవ‌ద్దు అంటూ త‌మ అభిప్రాయాన్ని వినిపిస్తున్నారు. హ‌ర్యానాలో ప్ర‌భుత్వ ఏర్పాటును స‌మ‌ర్థిస్తున్నా.. గోపాల్ లాంటి ఎమ్మెల్యేల‌ను పార్టీలోకి తీసుకోరాదు అని సీనియ‌ర్ నేత ఉమాభార‌తి ట్వీట్ చేశారు. పార్టీలో మోదీ లాంటి శ‌క్తివంత‌మైన నేత ఉన్న‌ప్పుడు .. గోపాల్ లాంటి ఎమ్మెల్యేలు ఎందుకు అని ఆమె ప్ర‌శ్నించారు. రేప్ ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న గోపాల్ కండాను బీజేపీ స్వాగ‌తిస్తోంద‌ని, అంటే ఆ పార్టీకి మ‌హిళ‌ల భ‌ద్ర‌త ప‌ట్ల చిత్త‌శుద్ధి లేద‌ని మ‌హిళా కాంగ్రెస్ నేత సుష్మితా దేవ్ విమ‌ర్శించారు. 90 సీట్లు ఉన్న హ‌ర్యానాలో కాంగ్రెస్ 31, జేపీపీ 10 సీట్లు నెగ్గాయి. బీజేపీకి చెందిన 8 మంది మంత్రులు ఓట‌మిపాల‌య్యారు.

Comments

Popular posts from this blog

అత్యంత కష్టం మీద బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం బృందం

నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

మీడియాపై మాకు గౌరవముంది: కోటంరెడ్డి

  కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ పాలనపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మీడియాపై తమకు గౌరవం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. జీవో 2430 కొత్తగా తీసుకొచ్చింది కాదని, ఎప్పటినుంచో అది ఉందని తెలిపారు.  ఈ రోజు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్ని పత్రికలు, ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు వార్తలతో అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలని పేర్కొన్నారు. ఒకప్పుడు సాక్షి మీడియాను చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నేతలు ఎటుపోయారని నిలదీశారు. లోకేశ్ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మంగళగిరి నియోజక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేశ్ కు తెలియదని విమర్శించారు. తమ పాలనను చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, తన హయాంలో తన కొడుకు లోకేశ్ తో కలిసి దోచుకుని లోటు బడ్జెట్ ను చూపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని చెప్పారు.  చంద్రబాబుకు చదువుకునేటప్పటి నుంచే కులపిచ్చి ఉందని పేర్కొన్నారు. స్థాని...