Skip to main content

బాగ్దాదీ వేటలో అదే టర్నింగ్‌ పాయింట్‌..!

 
బాగ్దాదీ వేటలో అదే టర్నింగ్‌ పాయింట్‌..!
 ప్రపంచ మోస్ట్‌వాంటెడ్‌ టెర్రిరిస్ట్‌ అబు బకర్‌ అల్‌ బాగ్దాదీ అంతానికి 2018లోనే కీలక అడుగులు పడ్డాయి. అతడికి అత్యంత సన్నిహితుల్లో ఒకరే.. ఈ కరుడగట్టిన ముష్కరుడి కదలికలపై సమాచారం అందజేశాడు. ఇది అతని ఆచూకీ పసిగట్టడం ఇంటెలిజెన్స్ వర్గాలకు ఎంతో ఉపయోగపడింది. ఈ మేరకు నిఘా వర్గాలు, ఇరాకీ సైన్యం చెప్పిన కథనాల ప్రకారం ప్రముఖ వార్త సంస్థ ఓ కథనం ప్రచురించింది. బాగ్దాదీ ఐదుగురు సన్నిహిత అనుచరుల్లో ఇస్మామయిల్‌ అల్‌-ఎతావి ఒకరు. టర్కీ బలగాలు ఇతన్ని అరెస్టు చేసి ఇరాకీ సైన్యానికి అప్పగించాయి. ఈ క్రమంలో బాగ్దాదీ సంబంధించిన కీలక సమాచారాన్ని ఎతావి సైన్యానికి తెలిపాడు. తన కదలికల్ని ప్రత్యర్థులు పసిగట్టకుండా కూరగాయలు రవాణా చేసే మినీ బస్సుల్లో బాగ్దాదీ ప్రయాణించేవాడని చెప్పాడు. అలాగే కమాండర్లతో వ్యూహాత్మక సమావేశాలు జరిపేవాడని తెలిపాడు. దీంతో బాగ్దాదీ కదలికలపై అప్పటి వరకు నిఘా వర్గాలకున్న గందరగోళం తొలగిపోయిందని ఇరాక్‌కి చెందిన ఓ భద్రతాధికారి తెలిపారు. బాగ్దాదీ తన అనుచరులను కలిసే సిరియాలోని కొన్ని ప్రాంతాలను కూడా ఎతావినే తమకు చెప్పాడన్నారు. అప్పటి వరకు సామూహిక హత్యలు, తలలు నరకడం వంటి ఘోర మారణకాండకు ఆదేశాలు జారీ చేస్తున్న ఓ క్రూరుడు చిక్కినట్లే చిక్కి తప్పించుకుటుండడంతో బలగాలు తీవ్ర అసహనంతో ఉన్నాయి. ఈ తరుణంలో ఎతావి ఇచ్చిన సమాచారం కీలకంగా మారింది.
కీలక సమాచారం...
ఎతావి పట్టుబడటమే బాగ్దాదీని అంతమొందించే ప్రక్రియలో టర్నింగ్‌ పాయింట్‌గా మారింది. ఇస్లామిక్‌ సైన్సెస్‌లో పీహెచ్‌డీ చేసిన ఎతావి 2006లో అల్‌ ఖైదాలో చేరాడు. ఇరాకీ భద్రతాధికారులు చెప్పిన ప్రకారం 2008లో అతన్ని అమెరికా బలగాలు అరెస్టు చేశాయి. దీంతో నాలుగేళ్లు అతడు జైలు జీవితం గడిపాడు. తిరిగొచ్చి ఐసిస్‌లో చేరాడు. బాగ్దాదీకి కీలక అనుచరుడి స్థాయికి ఎదిగాడు. మతపరమైన బోధనలు చేయడం, ఇస్లామిక్‌ స్టేట్‌ కమాండర్లని ఎంపిక చేయడంలాంటి కీలక బాధ్యతల్ని ఎతావికి అప్పగించాడు. కానీ, అమెరికా బలగాలు ఐసిస్‌పై విరుచుకుపడటం ప్రారంభించడంతో 2017లో ఎతావి కుటుంబంతో కలిసి సిరియాకు మకాం మార్చాడు. 2018లో ఇరాక్‌ బలగాలు అతన్ని అరెస్టు చేసి కీలక సమాచారాన్ని రాబట్టాయి. అలాగే అమెరికా, ఇరాక్‌, టర్కీ బలగాలు ఈ ఏడాది ఆరంభంలో చేపట్టిన ఆపరేషన్‌లో మరికొంత మంది ఐసిస్‌ నేతలు పట్టుబడడం కూడా బాగ్దాదీ ఆచూకీ కనిపెట్టడంలో దోహదపడింది. వీరు ఐసిస్‌ అధినేత సంచరించే కీలక ప్రాంతాల సమాచారం ఇచ్చారు. అందుకనుగుణంగా సీఐఏ ఆయా ప్రదేశాల్లో బలగాల్ని మోహరించి ఆపరేషన్‌ని ముందుకు తీసుకెళ్లిందని ఇరాక్‌కు చెందిన ఓ భద్రతాధికారి తెలిపారు. వీరిచ్చిన సమాచారంతో సిరియాలోని ఇడ్లిబ్‌ ప్రాంతంలో బాగ్దాదీ కుటుంబంతో కలిసి వివిధ గ్రామాలకుకు మారుతున్నాడని నిఘా వర్గాలు పసిగట్టాయి. ఓ రోజు ఇరాక్‌కు చెందిన వ్యక్తి అక్కడి మార్కెట్‌ ప్రాంతంలో సంచరిస్తుండడం గమనించారు. అతను ఎతావి అని ధ్రువీకరించుకున్నారు. అతన్ని అనుసరిస్తూ వెళ్లారు. చివరకు అతడు బాగ్దాదీ ఉన్న ఇంటికే చేరుకున్నాడు. ఈ సమాచారాన్ని వారు సీఐఏకి అందజేశారు. దీంతో వారు గత ఐదు నెలలుగా శాటిలైట్‌, డ్రోన్ల సాయంతో ఆ ప్రాంతంపై నిఘా ఉంచారు. ఇటీవల మినీబస్‌లో పక్కనున్న గ్రామానికి బాగ్దాదీ వెళ్లడం గమనించారు. అప్పటికే వారి వద్ద ఉన్న సమాచారంతో అతను బాగ్దాదీయే అని ధ్రువీకరించుకున్నారు. 

స్థానిక శత్రువులు...
ఇడ్లిబ్‌ ప్రాంతంలో కీలకంగా వ్యవహరిస్తున్న జిహాదీ సంస్థ ‘హయత్‌ తారిర్‌ అల్‌-శామ్‌’ కూడా బాగ్దాదీ కోసం గాలిస్తోంది. ఈ సంస్థ అల్‌ ఖైదాకు అనుబంధంగా పనిచేస్తోంది. సిరియా యుద్ధంలో ఈ గ్రూపు ఐసిస్‌తో తలపడింది. అలాగే ఈ ప్రాంతంలో బాగ్దాదీ ఉంటే తమ ఉనికికి ప్రమాదం ఉండే అవకాశం ఉందని భావించిన ‘హయత్‌ తారిర్‌’ నేతలు అతడి ఆచూకీ కోసం ముమ్మర ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ క్రమంలో బాగ్దాదీ కీలక అనుచరుడైన ఖలీదీ వీరికి పట్టుబడ్డాడు. అతడిచ్చిన సమాచారంతో రెండు నెలల క్రితం సర్మిన్‌ అనే పట్టణంపై దాడి చేశారు. కానీ, బాగ్దాదీ అక్కడి లేకపోవడంతో వెనక్కి తిరిగారు. ఇక అప్పటి నుంచి ‘హయత్‌ తారిర్‌’ నేతలు సైతం అతనిపై నిఘా ఉంచారు. స్థానికులు తెలిపిన ప్రకారం తాహిర్‌ సంస్థకి టర్కీ బలగాలతో సంబంధాలు ఉన్నాయి. అలా వీరి గాలింపు చర్యల పురోగతి సమాచారం కూడా నిఘా వర్గాలకు అందినట్లు భావిస్తున్నారు.

ఇలా ఎట్టకేలకు అతనిపై భారీ నిఘాతో టర్కీ, సిరియా సాయంతో అమెరికా ప్రత్యేక బలగాలు, ఇంటెలిజెన్స్‌ వర్గాలు బాగ్దాదీ కదలికల్ని కచ్చితంగా పసిగట్టాయి. శనివారం రాత్రి భారీ ఆపరేషన్‌లో అతన్ని అంతమొందించాయి.

Comments

Popular posts from this blog

అమరావతిలో భూముల రేట్లు తగ్గకుండా: సీఆర్డీఏ స్థానంలో కొత్త అథారిటీ: కీలక నోటిఫికేషన్

 మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందడం, రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్డీ) రద్దు నేపథ్యంలో.. ప్రభుత్వం మెరుపు వేగంతో నిర్ణయాలను తీసుకుంటోంది. పరిపాలనను వేగవంతం చేసేలా తక్షణ చర్యలకు దిగింది. సీఆర్డీఏ బిల్లు రద్దు అనంతరం దాని స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలిని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. దాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఏఎంఆర్డీఏ కమిటీ సభ్యులనూ నియమించింది. సీఆర్డీఏకు బదులుగా ఏఎంఆర్డీఏ సీఆర్డీఏ స్థాయంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలి (ఏఎంఆర్డీఏ)ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్‌ను జారీ చేసింది. సీఆర్డీఏను రద్దు చేస్తూ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేసిన మరుసటి రోజే ఏఎంఆర్డీఏను తెరపైకి తీసుకొచ్చింది. దానితో పాటు కొత్త సభ్యులను నియమించింది. మున్సిపల్ శాఖ కార్యదర్శి జే శ్యామల రావు దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను జారీ చేశారు. మొత్తం 11 మంది సభ్యులను ఏఎంఆర్డీఏ కమిటీలో నియమించారు. సభ్యులు వీరే.. మున్సిపల్ శాఖ కార్యదర్శి డిప్య...