Skip to main content

బాగ్దాదీపై ఆపరేషన్‌ ‘కైలా ముల్లెర్’ ఎందుకంటే?



బాగ్దాదీపై ఆపరేషన్‌ ‘కైలా ముల్లెర్’ ఎందుకంటే?

 కుక్కలు తరుముతుండగా... ఒక కలుగు (టన్నెల్‌)లో చివరికి వచ్చి ఎటువెళ్లాలో తెలియక ఐసిస్‌ వ్యవస్థాపకుడు బాగ్దాదీ చిక్కుకుపోయాడు.. లొంగిపొమ్మని అమెరికా హెచ్చరికలు వినిపిస్తుండగా.. హఠాత్తుగా బాగ్దాదీ ఉన్న చోట భారీ పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో బాగ్దాదీతోపాటు మరో ముగ్గురు పిల్లలు కూడా ప్రాణాలు కోల్పోయారు. కైలా ముల్లెర్‌కు న్యాయం దక్కింది.. అసలు ఈ ముల్లెర్‌ ఎవరూ..? బాగ్దాదీ మరణంతో ఆమెకు న్యాయం ఎలా జరిగిందో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవండి.
ఆపరేషన్‌కు బీజం..
డిజిటల్‌ నిఘా వచ్చిన ఈ రోజుల్లో కూడా బాగ్దాదీ వేటకు అమెరికా పురాతనమైన మానవ ఇంటెలిజెన్స్‌ విధానాన్ని అనుసరించడం విశేషం. సెప్టెంబర్‌ మధ్యలో  ఇరాక్‌కు చెందిన అధికారులకు ఒక వ్యక్తిపై అనుమానం వచ్చింది. అతను బాగ్దాదీ సోదరులైన అహ్మద్‌, జుమాల భార్యలను ఇడ్లిబ్‌ ప్రాంతానికి అక్రమంగా తరలించడానికి సహాయం చేసినట్లు గుర్తించారు.  అదే స్మగ్లర్‌ బాగ్దాదీ పిల్లలను కూడా అక్కడకు తరలించినట్లు పసిగట్టారు. బాగ్దాదీ అల్లుడు, అతని భార్య నుంచి బాగ్దాదీ ప్రయాణించే మార్గం వివరాలను ఇరాక్‌ అధికారులు తెలుసుకొని అమెరికా నిఘా సంస్థ సీఐఏకు ఉప్పందించారు. 

అప్పటికే గాయాలు, మతిమరుపు, మధుమేహంతో బాధపడుతున్న 48 ఏళ్ల బాగ్దాదీ తరచూ తన స్థావరాలను మార్చేస్తున్నట్లు గుర్తించారు. జనవరిలో తూర్పు సిరియాలోని భగూజ్‌ వద్ద ఉన్నట్లు యూరప్‌ ఇంటెలిజెన్స్‌ వర్గాలు పసిగట్టాయి. ఇడ్లిబ్‌కు రావడానికి ముందు తూర్పు సిరియా, పశ్చిమ ఇరాక్‌ మధ్య ప్రాంతాల్లోనే ఉండేందుకు అతడు ఇష్టపడ్డాడు. టర్కీకి అత్యంత సమీపంలోని బరీష్‌ గ్రామంలో ఇళ్లను తరచూ మారుస్తున్నట్లు అమెరికా, ఇరాక్‌ బలగాలు ధ్రువీకరించుకొన్నాయి. 
అదే సమయంలో అబు మహమ్మద్‌ అల్‌ హలాబీ పేరు బయటకు వచ్చింది. ఇతను ఒకప్పుడు బాగ్దాదీకి అత్యంత సన్నిహితుడు. హుర్రాస్‌ అల్‌ దెయిన్‌ అనే స్థానిక మిలిటెంట్‌ గ్రూప్‌ నాయకుడు. అతను బరీష్‌
 వద్ద సొరంగంపై నిర్మించిన ఇంటిని గత ఏడాది కొనుగోలు చేశాడు. ఇది ఎవరైనా తప్పించుకోవడానికి అత్యంత అనువుగా ఉంటుంది.  హలాబీ గ్రూప్‌ అంతకు కొన్ని వారాల ముందే కొందరు ఐసిస్‌ సానుభూతిపరులను చంపింది కూడా. కానీ, బాగ్దాదీ అతని ఇంట్లోనే ఉండటం విశేషం. ఈ విషయాన్ని ధ్రువీకరించుకొని అమెరికా నిఘా వర్గాలు గురువారం మధ్యాహ్నం అధ్యక్షుడు ట్రంప్‌, ఉపాధ్యక్షుడు పెన్స్‌కు సమాచారం చేరవేశాయి. శనివారం ఈ ఆపరేషన్‌ నిర్వహించేందుకు ట్రంప్‌ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది. అమెరికా ప్రత్యేక బలగాలు వెంటనే ఇర్బిల్‌లోని స్థావరం నుంచి ఇడ్లిబ్‌ దిశగా బయల్దేరాయి.  వాస్తవానికి ఇడ్లిబ్‌ గగనతలాన్ని రష్యా నియంత్రిస్తోంది. దీంతో రష్యా, కుర్దులు, టర్కీకు సంక్షిప్తంగా సమాచారం తెలియజేశారు. అలా ఆపరేషన్‌ కైలా ముల్లెర్‌ మొదలైంది. 
కైలా ముల్లెర్‌ ఎవరో తెలుసా..?
బాగ్దాదీపై ఆపరేషన్‌ ‘కైలా ముల్లెర్’ ఎందుకంటే?
‘ఆపరేషన్‌ కైలా ముల్లెర్’ అనే పేరిట బాగ్దాదీ వేటను ప్రారంభించారు. దీనికి ఆ పేరు పెట్టడానికి కారణం ఉంది.  కైలా ముల్లెర్‌ (26) అమెరికాలోని ఆరిజోనా వాసి. ఆమె ఒక  సేవా సంస్థలో పనిచేస్తుండేది. ఆమె ఒక ఆసుపత్రిలో విధులు నిర్వహించేందుకు టర్కీ నుంచి అలెప్పోకు ప్రయాణిస్తుండగా ఐసిస్‌ కిడ్నాప్‌ చేసింది.  ఐసిస్‌ అధినేత అబు బాగ్దాదీనే అత్యాచారం చేసి అతిదారుణంగా చంపాడు. ఈ ఘటన 2013లో జరిగింది. 2015 ఫిబ్రవరిలో ఐసిస్‌ కస్టడీలో ఆమె మరణించిన విషయాన్ని అమెరికా ధ్రువీకరించింది.  ఐసిస్‌ మాత్రం రక్కాలో జరిగిన వైమానిక దాడిలో ఆమె మరణించిందని బుకాయించింది. 
అర్ధరాత్రి ఒంటిగంటకు..
బాగ్దాదీపై ఆపరేషన్‌ ‘కైలా ముల్లెర్’ ఎందుకంటే?
అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో ఎనిమిది హెలికాప్టర్లు (ఇప్పటి వరకు వచ్చిన సమాచారం ప్రకారం) బాగ్దాదీ ఉంటున్న ఇంటి ప్రాంగణాన్ని చుట్టుముట్టాయి. ఈ క్రమంలో ఆ ఇంట్లోని వారు కాల్పులు ప్రారంభించడంతో దళాలు వాటిని తిప్పికొట్టాయి. బాగ్దాదీ కాకుండా దాదాపు 9 మంది ఈ ఘటనలో మృతి చెందారు. వీరంతా ఐసిస్‌ అధినేత బంధువులేనని భావిస్తున్నారు. అదే సమయంలో బాగ్దాదీ ఆ ఇంట్లో ఉన్న సొరంగంలోకి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో తన పిల్లల్లో ముగ్గురిని మానవ కవచాలుగా వాడుకొనేందుకు తనతోపాటు తీసుకుపోయాడు. అప్పటికే అమెరికాకు ఆ సొరంగం ఎక్కడ ఉంది.. ఆపరేషన్‌ ఎలా మొదలు పెట్టాలో అవగాహన ఉండటంతో పెద్దగా ఇబ్బంది లేకుండా పోయింది. సొరంగంలో కుక్కలు అతన్ని వెంబడించడంతో సొరంగం చివర వరకు చేరుకొన్నాడు. అక్కడి నుంచి తప్పించుకోవడానికి మార్గం లేకపోవడంతో ఒంటిపై అమర్చుకొన్న బాంబులను పేల్చేసుకొన్నాడు. 
వెంటనే అక్కడ దొరికిన శరీర నమూనాలను సేకరించి డీఎన్‌ఏ పరీక్షలను మొదలుపెట్టారు. ఈ ఆపరేషన్‌కు ముందే బాగ్దాదీ డీఎన్‌ఏతో సిద్ధంగా ఉన్న నిపుణుల బృందం ఆ శరీర భాగాలకు పరీక్షించి ఆవి బాగ్దాదీవేనని తేల్చాయి. దాడి ముగిసిన రెండు గంటల్లోనే బాగ్దాదీ శరీరభాగాలకు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించి ఫలితాలను ప్రకటించడం విశేషం.
మరో బృందం అక్కడ రక్షించిన పిల్లలను సమీపంలోని ప్రాంతాలకు తరలించింది. దీంతోపాటు అటాక్‌ హెలికాప్టర్ల దాడిలో ధ్వంసమైన ఇళ్ల శిథిలాల నుంచి లభించిన నమూనాలను సేకరించారు.  తెల్లవారుజామున 3.30కు దాడి ముగించుకొని హెలికాప్టర్‌ బృందాలు ఇర్బిల్‌కు తిరుగు ప్రయాణమయ్యాయి. దాదాపు 70 నిమిషాలు ప్రయాణించి గమ్యానికి చేరుకొన్నాయి.  అనంతరం ఈ సమాచారాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు తెలియజేశాయి. 

బాగ్దాదీపై ఆపరేషన్‌ ‘కైలా ముల్లెర్’ ఎందుకంటే?
రోబో వాడలేదు.. 
ఈ ఆపరేషన్‌కు ఒక రోబో వాడేందుకు అమెరికా సిద్ధమైంది. కానీ, ఆ రోబోను ఒక మనిషి దగ్గర నుంచి నడిపించాలి. బాగ్దాదీ వద్ద అప్పటికే ఆత్మాహుతి సూట్‌ ఉండటంతో ఆ రోబో ఆపరేటర్‌ మరణించే అవకాశం ఉంది. దీంతో కుక్కలను వినియోగించారు. ఈ దాడిలో అమెరికాకు చెందిన ఒక ధైర్యవంతమైన, ప్రతిభావంతమైన శునకం గాయపడిందని ట్రంప్‌ వెల్లడించారు. 

అలా ‘ఆపరేషన్‌ కైలా ముల్లెర్’  ముగిసింది. ఇప్పటివరకు పలు ఆపరేషన్లలో తప్పించుకున్న బాగ్దాదీ ముల్లెర్‌ పేరుతో మొదలు పెట్టిన ఆపరేషన్‌లో ప్రాణాలు కోల్పోయాడు. ఆ రకంగా ముల్లెర్‌ ప్రతీకారం తీర్చుకొన్నట్లైంది. 

Comments

Popular posts from this blog

ఎలన్ మస్క్... స్టార్ షిప్ రెడీ... వచ్చే ఏడాది మార్స్ చెంతకు ప్రయాణం

మార్స్ గ్రహంపైకి వన్ వే ట్రిప్‌గా ఆసక్తి ఉన్న ప్రజలను పంపుతానని ప్రకటించిన ఆమెరికా బిలియనీర్ వ్యాపారి ఎలన్ మస్క్... అన్నంత పనీ చేస్తున్నారు. మనుషుల్ని చందమామ, మార్స్ చెంతకు తీసుకెళ్లడం కోసం ఆయన కంపెనీ స్పేస్ ఎక్స్... సరికొత్త విమానం తరహా స్పేస్ షిప్‌లను తయారుచేస్తోంది. ఇవి రాకెట్‌‌లా కాకుండా... విమానం లాగా... అంతరిక్షంలోకి వెళ్లి... గ్రహాలపై మనుషుల్ని దించేసి... తిరిగి ఖాళీగా వెనక్కి వచ్చేస్తాయి. గ్రహాలపైకి వెళ్లినవాళ్లు తిరిగి వచ్చే అవకాశాలు లేవు. ఇందుకు రిటర్న్ ట్రిప్ అవకాశం కల్పించట్లేదు ఎలన్ మస్క్. వన్ వే ట్రిప్‌గా వెళ్లేందుకు ఆసక్తి ఉన్నవారే టికెట్ బుక్ చేసుకోమని సూచిస్తున్నారు. తాజాగా ఆయన ఆవిష్కరించిన స్పేస్‌షిప్‌లో వంద మంది ప్రయాణించేందుకు వీలుంది. టెక్సాస్... బోకా చికాలో... ఎంతో మంది అంతరిక్ష ఔత్సాహికులు, రిపోర్టర్ల సమక్షంలో చందమామ, మార్స్‌పైకి పంపే స్టార్ షిప్‌ను ఆవిష్కరించారు ఎలన్ మస్క్. వచ్చే ఆరు నెలల్లో దాన్ని అంతరిక్షంలో ఓ రౌండ్ వేయించి... వచ్చే ఏడాది మనుషులను అందులో పంపాలనుకుంటున్నారు ఎలన్ మస్క్. ఎప్పుడో పదకొండు ఏళ్ల కిందట ఫాల్కన్-1 రాకెట్‌ను తయారుచేసింది స్పేస్ ఎక...

క్రెడిట్ పై పెట్రోలును కొనుగోలు చేస్తే నో క్యాష్‌బ్యాక్‌

క్రెడిట్‌ కార్డులను వినియోగించి పెట్రోలును కొనుగోలు చేస్తే ఇన్నాళ్లూ లభిస్తున్న 0.75 శాతం క్యాష్‌బ్యాక్‌ అక్టోబరు ఒకటో తేది నుంచి ఉండబోదని కంపెనీలు ప్ర‌క‌టించాయి.  2016లో పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే డిస్కౌంట్‌ ఇవ్వాలని చమురు కంపెనీలను కోరింది. దీంతో డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించడానికి  2016 డిసెంబరు నుంచి క్రెడిట్‌, డెబిట్‌, ఈ-వాలెట్ల ద్వారా పెట్రోల్‌, డీజిల్‌ కొనుగోలు చేసే వారికి 0.75శాతం డిస్కౌంట్‌ను క్యాష్‌బ్యాక్‌ రూపంలో  ఇవ్వాల‌ని  చమురు కంపెనీలు క్యాష్‌బ్యాక్‌లను ప్రకటించిన విష‌యం తెలిసిందే. కాగా వచ్చే నెల ఒకటో తేది నుంచి ఆ డిస్కౌంట్‌ ఉండబోదని తాజాగా కంపెనీలు వెల్లడించాయి. ఇకమీదట డెబిట్‌, ఇతర డిజిటల్‌ పద్ధతుల ద్వారా చెల్లించేవారికి మాత్రం ఈ డిస్కౌంట్‌ యధావిధిగా కొనసాగుతుంది.