Skip to main content

బాగ్దాదీపై ఆపరేషన్‌ ‘కైలా ముల్లెర్’ ఎందుకంటే?



బాగ్దాదీపై ఆపరేషన్‌ ‘కైలా ముల్లెర్’ ఎందుకంటే?

 కుక్కలు తరుముతుండగా... ఒక కలుగు (టన్నెల్‌)లో చివరికి వచ్చి ఎటువెళ్లాలో తెలియక ఐసిస్‌ వ్యవస్థాపకుడు బాగ్దాదీ చిక్కుకుపోయాడు.. లొంగిపొమ్మని అమెరికా హెచ్చరికలు వినిపిస్తుండగా.. హఠాత్తుగా బాగ్దాదీ ఉన్న చోట భారీ పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో బాగ్దాదీతోపాటు మరో ముగ్గురు పిల్లలు కూడా ప్రాణాలు కోల్పోయారు. కైలా ముల్లెర్‌కు న్యాయం దక్కింది.. అసలు ఈ ముల్లెర్‌ ఎవరూ..? బాగ్దాదీ మరణంతో ఆమెకు న్యాయం ఎలా జరిగిందో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవండి.
ఆపరేషన్‌కు బీజం..
డిజిటల్‌ నిఘా వచ్చిన ఈ రోజుల్లో కూడా బాగ్దాదీ వేటకు అమెరికా పురాతనమైన మానవ ఇంటెలిజెన్స్‌ విధానాన్ని అనుసరించడం విశేషం. సెప్టెంబర్‌ మధ్యలో  ఇరాక్‌కు చెందిన అధికారులకు ఒక వ్యక్తిపై అనుమానం వచ్చింది. అతను బాగ్దాదీ సోదరులైన అహ్మద్‌, జుమాల భార్యలను ఇడ్లిబ్‌ ప్రాంతానికి అక్రమంగా తరలించడానికి సహాయం చేసినట్లు గుర్తించారు.  అదే స్మగ్లర్‌ బాగ్దాదీ పిల్లలను కూడా అక్కడకు తరలించినట్లు పసిగట్టారు. బాగ్దాదీ అల్లుడు, అతని భార్య నుంచి బాగ్దాదీ ప్రయాణించే మార్గం వివరాలను ఇరాక్‌ అధికారులు తెలుసుకొని అమెరికా నిఘా సంస్థ సీఐఏకు ఉప్పందించారు. 

అప్పటికే గాయాలు, మతిమరుపు, మధుమేహంతో బాధపడుతున్న 48 ఏళ్ల బాగ్దాదీ తరచూ తన స్థావరాలను మార్చేస్తున్నట్లు గుర్తించారు. జనవరిలో తూర్పు సిరియాలోని భగూజ్‌ వద్ద ఉన్నట్లు యూరప్‌ ఇంటెలిజెన్స్‌ వర్గాలు పసిగట్టాయి. ఇడ్లిబ్‌కు రావడానికి ముందు తూర్పు సిరియా, పశ్చిమ ఇరాక్‌ మధ్య ప్రాంతాల్లోనే ఉండేందుకు అతడు ఇష్టపడ్డాడు. టర్కీకి అత్యంత సమీపంలోని బరీష్‌ గ్రామంలో ఇళ్లను తరచూ మారుస్తున్నట్లు అమెరికా, ఇరాక్‌ బలగాలు ధ్రువీకరించుకొన్నాయి. 
అదే సమయంలో అబు మహమ్మద్‌ అల్‌ హలాబీ పేరు బయటకు వచ్చింది. ఇతను ఒకప్పుడు బాగ్దాదీకి అత్యంత సన్నిహితుడు. హుర్రాస్‌ అల్‌ దెయిన్‌ అనే స్థానిక మిలిటెంట్‌ గ్రూప్‌ నాయకుడు. అతను బరీష్‌
 వద్ద సొరంగంపై నిర్మించిన ఇంటిని గత ఏడాది కొనుగోలు చేశాడు. ఇది ఎవరైనా తప్పించుకోవడానికి అత్యంత అనువుగా ఉంటుంది.  హలాబీ గ్రూప్‌ అంతకు కొన్ని వారాల ముందే కొందరు ఐసిస్‌ సానుభూతిపరులను చంపింది కూడా. కానీ, బాగ్దాదీ అతని ఇంట్లోనే ఉండటం విశేషం. ఈ విషయాన్ని ధ్రువీకరించుకొని అమెరికా నిఘా వర్గాలు గురువారం మధ్యాహ్నం అధ్యక్షుడు ట్రంప్‌, ఉపాధ్యక్షుడు పెన్స్‌కు సమాచారం చేరవేశాయి. శనివారం ఈ ఆపరేషన్‌ నిర్వహించేందుకు ట్రంప్‌ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది. అమెరికా ప్రత్యేక బలగాలు వెంటనే ఇర్బిల్‌లోని స్థావరం నుంచి ఇడ్లిబ్‌ దిశగా బయల్దేరాయి.  వాస్తవానికి ఇడ్లిబ్‌ గగనతలాన్ని రష్యా నియంత్రిస్తోంది. దీంతో రష్యా, కుర్దులు, టర్కీకు సంక్షిప్తంగా సమాచారం తెలియజేశారు. అలా ఆపరేషన్‌ కైలా ముల్లెర్‌ మొదలైంది. 
కైలా ముల్లెర్‌ ఎవరో తెలుసా..?
బాగ్దాదీపై ఆపరేషన్‌ ‘కైలా ముల్లెర్’ ఎందుకంటే?
‘ఆపరేషన్‌ కైలా ముల్లెర్’ అనే పేరిట బాగ్దాదీ వేటను ప్రారంభించారు. దీనికి ఆ పేరు పెట్టడానికి కారణం ఉంది.  కైలా ముల్లెర్‌ (26) అమెరికాలోని ఆరిజోనా వాసి. ఆమె ఒక  సేవా సంస్థలో పనిచేస్తుండేది. ఆమె ఒక ఆసుపత్రిలో విధులు నిర్వహించేందుకు టర్కీ నుంచి అలెప్పోకు ప్రయాణిస్తుండగా ఐసిస్‌ కిడ్నాప్‌ చేసింది.  ఐసిస్‌ అధినేత అబు బాగ్దాదీనే అత్యాచారం చేసి అతిదారుణంగా చంపాడు. ఈ ఘటన 2013లో జరిగింది. 2015 ఫిబ్రవరిలో ఐసిస్‌ కస్టడీలో ఆమె మరణించిన విషయాన్ని అమెరికా ధ్రువీకరించింది.  ఐసిస్‌ మాత్రం రక్కాలో జరిగిన వైమానిక దాడిలో ఆమె మరణించిందని బుకాయించింది. 
అర్ధరాత్రి ఒంటిగంటకు..
బాగ్దాదీపై ఆపరేషన్‌ ‘కైలా ముల్లెర్’ ఎందుకంటే?
అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో ఎనిమిది హెలికాప్టర్లు (ఇప్పటి వరకు వచ్చిన సమాచారం ప్రకారం) బాగ్దాదీ ఉంటున్న ఇంటి ప్రాంగణాన్ని చుట్టుముట్టాయి. ఈ క్రమంలో ఆ ఇంట్లోని వారు కాల్పులు ప్రారంభించడంతో దళాలు వాటిని తిప్పికొట్టాయి. బాగ్దాదీ కాకుండా దాదాపు 9 మంది ఈ ఘటనలో మృతి చెందారు. వీరంతా ఐసిస్‌ అధినేత బంధువులేనని భావిస్తున్నారు. అదే సమయంలో బాగ్దాదీ ఆ ఇంట్లో ఉన్న సొరంగంలోకి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో తన పిల్లల్లో ముగ్గురిని మానవ కవచాలుగా వాడుకొనేందుకు తనతోపాటు తీసుకుపోయాడు. అప్పటికే అమెరికాకు ఆ సొరంగం ఎక్కడ ఉంది.. ఆపరేషన్‌ ఎలా మొదలు పెట్టాలో అవగాహన ఉండటంతో పెద్దగా ఇబ్బంది లేకుండా పోయింది. సొరంగంలో కుక్కలు అతన్ని వెంబడించడంతో సొరంగం చివర వరకు చేరుకొన్నాడు. అక్కడి నుంచి తప్పించుకోవడానికి మార్గం లేకపోవడంతో ఒంటిపై అమర్చుకొన్న బాంబులను పేల్చేసుకొన్నాడు. 
వెంటనే అక్కడ దొరికిన శరీర నమూనాలను సేకరించి డీఎన్‌ఏ పరీక్షలను మొదలుపెట్టారు. ఈ ఆపరేషన్‌కు ముందే బాగ్దాదీ డీఎన్‌ఏతో సిద్ధంగా ఉన్న నిపుణుల బృందం ఆ శరీర భాగాలకు పరీక్షించి ఆవి బాగ్దాదీవేనని తేల్చాయి. దాడి ముగిసిన రెండు గంటల్లోనే బాగ్దాదీ శరీరభాగాలకు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించి ఫలితాలను ప్రకటించడం విశేషం.
మరో బృందం అక్కడ రక్షించిన పిల్లలను సమీపంలోని ప్రాంతాలకు తరలించింది. దీంతోపాటు అటాక్‌ హెలికాప్టర్ల దాడిలో ధ్వంసమైన ఇళ్ల శిథిలాల నుంచి లభించిన నమూనాలను సేకరించారు.  తెల్లవారుజామున 3.30కు దాడి ముగించుకొని హెలికాప్టర్‌ బృందాలు ఇర్బిల్‌కు తిరుగు ప్రయాణమయ్యాయి. దాదాపు 70 నిమిషాలు ప్రయాణించి గమ్యానికి చేరుకొన్నాయి.  అనంతరం ఈ సమాచారాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు తెలియజేశాయి. 

బాగ్దాదీపై ఆపరేషన్‌ ‘కైలా ముల్లెర్’ ఎందుకంటే?
రోబో వాడలేదు.. 
ఈ ఆపరేషన్‌కు ఒక రోబో వాడేందుకు అమెరికా సిద్ధమైంది. కానీ, ఆ రోబోను ఒక మనిషి దగ్గర నుంచి నడిపించాలి. బాగ్దాదీ వద్ద అప్పటికే ఆత్మాహుతి సూట్‌ ఉండటంతో ఆ రోబో ఆపరేటర్‌ మరణించే అవకాశం ఉంది. దీంతో కుక్కలను వినియోగించారు. ఈ దాడిలో అమెరికాకు చెందిన ఒక ధైర్యవంతమైన, ప్రతిభావంతమైన శునకం గాయపడిందని ట్రంప్‌ వెల్లడించారు. 

అలా ‘ఆపరేషన్‌ కైలా ముల్లెర్’  ముగిసింది. ఇప్పటివరకు పలు ఆపరేషన్లలో తప్పించుకున్న బాగ్దాదీ ముల్లెర్‌ పేరుతో మొదలు పెట్టిన ఆపరేషన్‌లో ప్రాణాలు కోల్పోయాడు. ఆ రకంగా ముల్లెర్‌ ప్రతీకారం తీర్చుకొన్నట్లైంది. 

Comments

Popular posts from this blog

అత్యంత కష్టం మీద బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం బృందం

నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

మీడియాపై మాకు గౌరవముంది: కోటంరెడ్డి

  కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ పాలనపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మీడియాపై తమకు గౌరవం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. జీవో 2430 కొత్తగా తీసుకొచ్చింది కాదని, ఎప్పటినుంచో అది ఉందని తెలిపారు.  ఈ రోజు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్ని పత్రికలు, ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు వార్తలతో అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలని పేర్కొన్నారు. ఒకప్పుడు సాక్షి మీడియాను చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నేతలు ఎటుపోయారని నిలదీశారు. లోకేశ్ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మంగళగిరి నియోజక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేశ్ కు తెలియదని విమర్శించారు. తమ పాలనను చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, తన హయాంలో తన కొడుకు లోకేశ్ తో కలిసి దోచుకుని లోటు బడ్జెట్ ను చూపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని చెప్పారు.  చంద్రబాబుకు చదువుకునేటప్పటి నుంచే కులపిచ్చి ఉందని పేర్కొన్నారు. స్థాని...