Skip to main content

ఎవరు ఎప్పుడు ఎలిమినేట్ కావాలో ముందే ప్లాన్ చేసుకున్నారు: బిగ్ బాస్ షోపై హేమ వ్యాఖ్యలు

 


తెలుగు బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షో బిగ్ బాస్ మూడో సీజన్ మరో వారంలో ముగియనుంది. ఈ షోలో తొలివారమే ఎలిమినేట్ అయిన సినీ నటి హేమ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బిగ్ బాస్ ఇంట్లో ఉన్నవాళ్లంతా ఒకే గ్రూపు అని, శ్రీముఖి బర్త్ డే సందర్భంగా అందరూ కలిసి పార్టీ చేసుకున్నారని వివరించారు. తాను బలమైన కంటెస్టెంట్ గా మారతానని తెలుసుకుని, తనను బయటికి పంపించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని అన్నారు. ఎవరు ఎప్పుడు ఎలిమినేట్ అవ్వాలో అప్పుడే నిర్ణయించుకున్నారని వెల్లడించారు. తనతో హౌస్ లో కావాలనే గొడవకు దిగేవాళ్లని హేమ ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీముఖి గేమ్ కు ఇతర కంటెస్టెంట్లు బలవుతున్నారని, శ్రీముఖి బయట ఒకలా, లోపల మరోలా మాట్లాడుతుందని ఆరోపించారు.  హిమజ ఎలిమినేట్ అయ్యాక 

Comments

Popular posts from this blog

వారానికోసారి కష్టమేమీ కాదు... సీఎం జగన్‌ కేసులో సీబీఐ కౌంటర్

కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం జగన్ వేసిన పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. అక్రమాస్తుల కేసు విచారణ నుంచి తనకు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీబీఐ కోర్టులో వేసిన పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. సీఎం జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. సాక్షులను జగన్ ప్రభావితం చేసే అవకాశం ఉందని పిటిషన్‌లో పేర్కొంది. ఆయన వాస్తవాలను దాచిపెట్టి పిటిషన్ వేశారని ఆరోపించింది. జగన్ జైల్లో ఉన్నప్పుడు సాక్షులను ప్రభావితం చేశారని... సీఎం పదవిలో ఉన్న జగన్ సాక్షులను మరింత ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ తన పిటిషన్‌లో పేర్కొంది. ఏపీలో రెవెన్యూ లోటు అనేది సీఎంగా ఉన్న జగన్ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చే కారణం కాదని తెలిపింది. సీఎంగా ఉన్న జగన్ విజయవాడ నుంచి వారానికోసారి హైదరాబాద్ రావడంకష్టమేమీ కాదని కౌంటర్‌ పిటిషన్‌లో సీబీఐ పేర్కొన్నట్టు తెలుస్తోంది. సీబీఐ కౌంటర్‌పై కోర్టు శుక్రవారం వాదనలు వినిపించనుంది.

బోటు వెలికితీత మరింత ఆలస్యం

కచ్చులూరు వద్ద మునిగిన బోటును రేపు వెలికితీస్తామని ధర్మాడి సత్యం తెలిపారు. బోటు వెలికితీత కోసం రెండోరోజు చేసిన ప్రయత్నాలు విఫలమైనట్లు చెప్పారు. వాతావరణం అనుకూలించనందువల్లే ఈ ఆలస్యం జరుగుతుందని వివరించారు. గోదావరిలో వరద ప్రహహం తగ్గిన కారణంగా బోటును రేపు బయటికి తీస్తామని స్పష్టం చేశారు. కాగా.. ధర్మాడి సత్యం బృందం వేసిన లంగర్‌కు బోటు తగిలి కదిలిందని స్థానికులు తెలిపారు.