Skip to main content

ఇంద్రకీలాద్రిపై అవస్థలు పడ్డ రెబల్ స్టార్!

కేంద్ర మాజీ మంత్రి, రెబల్ స్టార్ గా సుపరిచితుడైన సీనియర్ నటుడు కృష్ణంరాజు, ఇంద్రీకీలాద్రిపై అవస్థలు పడ్డారు. తానెవరో తెలిసి కూడా, అధికారులు కనీస సౌకర్యాలను కల్పించలేదని, మెట్లు ఎక్కుతూ దిగుతూ, ఆరు అంతస్తులు ఎక్కాల్సి వచ్చిందని ఆయన అసహనాన్ని వ్యక్తం చేశారు. దసరా సందర్భంగా నిన్న ఘాట్ రోడ్డు మీదుగా కృష్ణంరాజు కుటుంబం కొండపైకి రాగా, తాను కుంకుమార్చనకు వెళ్లాలని ఆయన పోలీసులను కోరారు. అయితే, వారు పట్టించుకోలేదు. ఆలయ సిబ్బందిని అడిగినా, అదే స్పందన వచ్చింది.

 దీంతో ఆయన ఫ్యామిలీ మొత్తం ఈవో కార్యాలయానికి చేరుకుని, ఆ పక్కనే ఏర్పాటు చేసిన క్యూలైన్ లో కుంకుమ పూజలను జరిపిస్తున్న ప్రదేశానికి చేరుకున్నారు. సాధారణ భక్తులతో పాటు అవస్థలు పడుతూ మెట్లు ఎక్కుతూ, దిగుతూ ఆయన ఆరో అంతస్తుకు వెళ్లారు. ఈ క్రమంలో ఆయన చాలా చోట్ల ఆయాస పడుతూ, గ్రిల్స్ పట్టుకుని నిలబడటం కనిపించింది. తాను నడవలేనని ఆలయ సిబ్బందికి చెప్పినా పట్టించుకోలేదని ఆయన అసహనాన్ని వ్యక్తం చేశారు. తమ అభిమాన నటుడిని చూసిన భక్తులు, ఆయన పడుతున్న అవస్థలను చూసి ఆలయ సిబ్బందిపై విమర్శలకు దిగడంతో, ప్రత్యేక విశేష కుంకుమార్చన చేయించిన అధికారులు, అమ్మవారి ప్రసాదాలను అందించారు.   

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.