Skip to main content

సుజనా చౌదరితో వల్లభనేని వంశీ భేటీ.. పార్టీ మారబోతున్నారంటూ ప్రచారం!



బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరితో గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. వంశీ పార్టీ మారే యోచనలో ఉన్నారనే ప్రచారం జరుగుతున్న తరుణంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం ఆసక్తికరంగా మారింది.

ఒంగోలు వెళ్తున్న సుజనా చౌదరి గుంటూరులోని ఓ బీజేపీ నేత ఇంటి వద్ద కాసేపు ఆగారు. ఈ సమయంలో వంశీ అక్కడకు వచ్చి సుజనా చౌదరిని కలిశారు. కాసేపు మాట్లాడుకున్న తర్వాత... ఇద్దరూ కలిసి ఒకే కారులో ఒంగోలుకు బయల్దేరారు. కొంత కాలం క్రితమే సుజనా చౌదరి టీడీపీని వీడి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. మరోవైపు, టీడీపీపై కొంత కాలంగా వంశీ అసంతృప్తిగా ఉన్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, వీరిద్దరి భేటీ అనుమానాలకు మరింత ఆజ్యం పోసినట్టైంది. వంశీ పార్టీ మారబోతున్నారనే ప్రచారం ఊపందుకుంది.

Comments

Popular posts from this blog

అంబులెన్స్‌కు దారి ఇచ్చిన సీఎం కాన్వాయ్...‌

వీడియో చూడండి : Click here ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాహన శ్రేణి అంబులెన్స్‌కు దారిఇచ్చింది. పులివెందుల నుంచి తిరిగివచ్చిన సీఎం గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి నివాసానికి బయల్దేరారు. గూడవల్లి నిడమానూరు మధ్య ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని తరలిస్తున్న అబులెన్స్‌కు దారి ఇచ్చారు. ఉయ్యూరు నుంచి గన్నవరం బైక్‌పైవెళ్తున్న చాపర్తిన శేఖర్‌ అనే వ్యక్తి ఉషారామ ఇంజినీరింగ్‌కాలేజీ సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. అతన్ని నేషనల్‌ హైవే అంబులెన్స్‌ ద్వారా విజయవాడ ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలిస్తుండగా, దీనికి ముందు ఉన్న ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పక్కకు తొలగి అంబులెన్స్‌కు దారి ఇచ్చింది.

పవన్ కు శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవి

  సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటోన్న నేపథ్యంలో ఆయనకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు.  ఆయనకు మహేశ్ బాబుతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో పవన్ కల్యాణ్ అద్భుత విజయాలు సాధించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.