Skip to main content

కచ్చులూరు వద్ద గోదావరిలో ఓ వ్యక్తి మొండెం లభ్యం

ఇటీవల తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరిలో బోటు మునిగిన ఘటనలో పలువురు గల్లంతయ్యారు. ఇవాళ బోటు వెలికితీత పనుల సందర్భంగా కచ్చులూరు వద్ద నదిలో ఓ వ్యక్తి మొండెం లభ్యమైంది. బ్లాక్ జీన్స్ ప్యాంటు ధరించినట్టుగా ఉన్న మృతదేహాన్ని బోటు ప్రమాదంలో గల్లంతైనవారిలో ఒకరిదిగా భావిస్తున్నారు.

కాగా, వైజాగ్ నుంచి ధర్మాడి సత్యం తీసుకువచ్చిన స్కూబా డైవర్లు ఎట్టకేలకు నదీ గర్భంలో ప్రవేశించారు. ఆక్సిజన్ మాస్క్ లు ధరించిన స్కూబా డైవర్లు బోటు మునిగిన ప్రాంతంలో నది లోపలికి వెళ్లి పరిస్థితిని తెలుసుకున్నారు. కొద్దిసేపటి తర్వాత వెలుపలికి వచ్చి తాము గమనించిన విషయాలను అధికారులతో పంచుకున్నారు.

ధర్మాడి సత్యం బృందం ఆధ్వర్యంలో నేడు కూడా వెలికితీత పనులు షురూ అయ్యాయి. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగరు తగిలించి బయటికి లాగాలన్నది ధర్మాడి సత్యం బృందం ప్రణాళికగా తెలుస్తోంది.

Comments

Popular posts from this blog

చింతమనేనికి బెయిల్ నిరాకరణ: అక్టోబర్ 9వరకు రిమాండ్ పొడిగింపు

తెలుగుదేశం పార్టీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు కోర్టులో చుక్కెదురు అయ్యింది. చింతమనేనికి బెయిల్ ఇచ్చేందుకు ఏలూరు కోర్టు నిరాకరించింది. అంతేకాదు చింతమనేని రిమాండ్ ను అక్టోబర్ 9 వరకు పొండిగించింది.  2017లో అప్పనపాడు గ్రామంలో స్థల వివాదంలో వ్యక్తిని నిర్బంధించి కులం పేరుతో దూషించిన కేసులో కేసు నమోదు అయ్యింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో భాగంగా ఇటీవలే చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.  అనంతరం చింతమనేని ప్రభాకర్ ను ఏలూరులోని ఎస్సీఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరచగా కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. రిమాండ్ పూర్తవ్వడంతో బుధవారం పోలీసులు మరోసారి ఏలూరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరిచారు.  అలాగే బెయిల్ ఇవ్వాలంటూ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తరపు న్యాయవాది సైతం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. చింతమనేని బెయిల్ పిటీషన్ ను న్యాయస్థానం తోసిపుచ్చింది. అనంతరం చింతమనేని రిమాండ్ ను వచ్చే నెల 9 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏలూరు కోర్టు.  ఇకపోతే చింతమనేని ప్రభాకర్ ను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన సమయంలో మహిళా పో...

పవన్ కు శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవి

  సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటోన్న నేపథ్యంలో ఆయనకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు.  ఆయనకు మహేశ్ బాబుతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో పవన్ కల్యాణ్ అద్భుత విజయాలు సాధించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.