ఇటీవల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హిందీ నేర్చుకోవాలంటూ చేసిన వ్యాఖ్యలు అనేక రాష్ట్రాల్లో ఆగ్రహావేశాలను రగిల్చాయి. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు ఇది ఆమోదయోగ్యం కాదంటూ అనేక విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పందించారు. హిందీని ఎవరిపైనా బలవంతంగా రుద్దే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. అన్ని భాషలకు సరైన గౌరవం కల్పించాలని అన్నారు. హిందీ ప్రచారంలో తెలుగు సాహిత్యం పాత్ర కీలకం అని అభిప్రాయపడ్డారు. జాతీయ భాష ప్రచారానికి హైదరాబాద్ ముఖద్వారం వంటిదని పేర్కొన్నారు.
నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.
Comments
Post a Comment