ఇటీవల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హిందీ నేర్చుకోవాలంటూ చేసిన వ్యాఖ్యలు అనేక రాష్ట్రాల్లో ఆగ్రహావేశాలను రగిల్చాయి. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు ఇది ఆమోదయోగ్యం కాదంటూ అనేక విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పందించారు. హిందీని ఎవరిపైనా బలవంతంగా రుద్దే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. అన్ని భాషలకు సరైన గౌరవం కల్పించాలని అన్నారు. హిందీ ప్రచారంలో తెలుగు సాహిత్యం పాత్ర కీలకం అని అభిప్రాయపడ్డారు. జాతీయ భాష ప్రచారానికి హైదరాబాద్ ముఖద్వారం వంటిదని పేర్కొన్నారు.
వీడియో చూడండి : Click here ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాహన శ్రేణి అంబులెన్స్కు దారిఇచ్చింది. పులివెందుల నుంచి తిరిగివచ్చిన సీఎం గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి నివాసానికి బయల్దేరారు. గూడవల్లి నిడమానూరు మధ్య ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని తరలిస్తున్న అబులెన్స్కు దారి ఇచ్చారు. ఉయ్యూరు నుంచి గన్నవరం బైక్పైవెళ్తున్న చాపర్తిన శేఖర్ అనే వ్యక్తి ఉషారామ ఇంజినీరింగ్కాలేజీ సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. అతన్ని నేషనల్ హైవే అంబులెన్స్ ద్వారా విజయవాడ ఈఎస్ఐ ఆస్పత్రికి తరలిస్తుండగా, దీనికి ముందు ఉన్న ముఖ్యమంత్రి కాన్వాయ్ పక్కకు తొలగి అంబులెన్స్కు దారి ఇచ్చింది.
Comments
Post a Comment