Skip to main content

చంద్రబాబూ: విజయసాయి రెడ్డి ఎద్దేవా


ఎప్పుడు మీడియా సమావేశాల్లో మాట్లాడినా, 40 ఇయర్స్ ఇండస్ట్రీ, 14 ఏళ్ల సిఎం, పదేళ్ల అపోజిషన్ లీడర్... అన్న పదాలను చంద్రబాబు వాడకుండా ఉండలేకపోతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు. మరెవరైనా చెబితే బాగుంటుందిగానీ, సమయం, సందర్భం లేకుండా తానే స్వయంగా చెప్పుకుంటూ పోతే ఎలాగని ఎద్దేవా చేశారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఈ ఉదయం విజయసాయి ట్వీట్లు పెట్టారు.

"మీడియా ముందైనా, సమీక్షా సమేవేశాలైనా మూడు విషయాలు తప్పనిసరిగా చెబ్తాడని ముందే తెలిసి పోతుంది. 40 ఇయర్స్ ఇండస్ట్రీ, 14 ఏళ్ల సిఎం, పదేళ్ల అపోజిషన్ లీడర్. ఇవి లేకుండా మాట్లాడలేడు. ఇంకెవరైనా చెబితే బాగుంటుంది కానీ సమయం సందర్భం లేకుండా మీకు మీరే చెప్పుకుంటే ఎలా చంద్రబాబు గారూ?" అని ప్రశ్నించారు.

అంతకుముందు, "అవునా కాదా తమ్ముళ్లూ? అంటూ చంద్రబాబు దీనాలాపనలు చేస్తున్నాడు. తను ఎంత ఆవేశపడుతున్నా తమాషా చూస్తున్నట్టు ఏ స్పందన లేకుండా కూర్చున్నారేమిటని కార్యకర్తల వైపు అనుమానంగా చూస్తున్నాడు. పోలవరం, అమరావతి, పిపిఏ ల గురించి అవే పాచి మాటలు. మాటల్లో ఎందుకో వణుకు కనిపిస్తోంది" అని కూడా వ్యాఖ్యానించారు.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.