Skip to main content

ఏపీఎస్ఆర్టీసీ పేరు మారనుందా.. మరి కొత్త పేరేంటి..


 అఖండ విజయంతో అధికారంలోకి వచ్చిన జగన్ వచ్చిన వెంటనే తను ఇచ్చిన హామీల పై ఫోకస్ పెట్టారు. వాటిలో ఒకటి ఆర్టీసీ విలీనం. ఏపీఎస్ ఆర్టీసీ విలీనం పై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాల్సిందిగా ఈ ఏడాది జూన్ 14న ఆరు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ రిటైర్డ్ ఐపీఎస్ ఆంజనేయ రెడ్డి ఆధ్వర్యంలో ఉంది. 

ఇటీవల ఈ కమిటీ ఆర్టీసీ విలీనం సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. నివేదికను పరిశీలించిన జగన్ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులు మరియు కార్మికులను ప్రభుత్వం లో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఏపీఎస్ ఆర్టీసీ విలీనం లో భాగంగా ఏపీఎస్ఆర్టీసీ పేరును కూడా మార్చాలని ఈ కమిటీ నివేదిక అందజేసింది. దీంతో ఇకపై ఏపీఎస్ఆర్టీసీ పేరును ప్రజా రవాణా శాఖ గా మారుస్తున్న ట్లు రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి ఎంపీ కృష్ణ బాబు పేర్కొన్నారు.

 ఉద్యోగులకు వేతనాలు ఎంత ఉండాలి వారికి ఏ స్థాయి కల్పించాలి పాలనా యంత్రాంగం ఎలా ఉండాలి అనే అంశంపై అధ్యయనానికి ప్రభుత్వం ఆరుగురు నిపుణులతో కమిటీ వేసింది. దీనికి రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి చైర్మన్గా ఉంటారు. ప్రభుత్వంలో ఏపీఎస్ ఆర్టీసీ విలీనం తర్వాత అధికారికంగా ఆర్టీసీ పేరును మార్పును అమలులోకి తీసుకు వస్తామన్నారు.

Comments

Popular posts from this blog

పవన్ కు శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవి

  సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటోన్న నేపథ్యంలో ఆయనకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు.  ఆయనకు మహేశ్ బాబుతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో పవన్ కల్యాణ్ అద్భుత విజయాలు సాధించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.

చింతమనేనికి బెయిల్ నిరాకరణ: అక్టోబర్ 9వరకు రిమాండ్ పొడిగింపు

తెలుగుదేశం పార్టీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు కోర్టులో చుక్కెదురు అయ్యింది. చింతమనేనికి బెయిల్ ఇచ్చేందుకు ఏలూరు కోర్టు నిరాకరించింది. అంతేకాదు చింతమనేని రిమాండ్ ను అక్టోబర్ 9 వరకు పొండిగించింది.  2017లో అప్పనపాడు గ్రామంలో స్థల వివాదంలో వ్యక్తిని నిర్బంధించి కులం పేరుతో దూషించిన కేసులో కేసు నమోదు అయ్యింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో భాగంగా ఇటీవలే చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.  అనంతరం చింతమనేని ప్రభాకర్ ను ఏలూరులోని ఎస్సీఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరచగా కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. రిమాండ్ పూర్తవ్వడంతో బుధవారం పోలీసులు మరోసారి ఏలూరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరిచారు.  అలాగే బెయిల్ ఇవ్వాలంటూ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తరపు న్యాయవాది సైతం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. చింతమనేని బెయిల్ పిటీషన్ ను న్యాయస్థానం తోసిపుచ్చింది. అనంతరం చింతమనేని రిమాండ్ ను వచ్చే నెల 9 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏలూరు కోర్టు.  ఇకపోతే చింతమనేని ప్రభాకర్ ను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన సమయంలో మహిళా పో...