Skip to main content

ఏపీఎస్ఆర్టీసీ పేరు మారనుందా.. మరి కొత్త పేరేంటి..


 అఖండ విజయంతో అధికారంలోకి వచ్చిన జగన్ వచ్చిన వెంటనే తను ఇచ్చిన హామీల పై ఫోకస్ పెట్టారు. వాటిలో ఒకటి ఆర్టీసీ విలీనం. ఏపీఎస్ ఆర్టీసీ విలీనం పై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాల్సిందిగా ఈ ఏడాది జూన్ 14న ఆరు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ రిటైర్డ్ ఐపీఎస్ ఆంజనేయ రెడ్డి ఆధ్వర్యంలో ఉంది. 

ఇటీవల ఈ కమిటీ ఆర్టీసీ విలీనం సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. నివేదికను పరిశీలించిన జగన్ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులు మరియు కార్మికులను ప్రభుత్వం లో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఏపీఎస్ ఆర్టీసీ విలీనం లో భాగంగా ఏపీఎస్ఆర్టీసీ పేరును కూడా మార్చాలని ఈ కమిటీ నివేదిక అందజేసింది. దీంతో ఇకపై ఏపీఎస్ఆర్టీసీ పేరును ప్రజా రవాణా శాఖ గా మారుస్తున్న ట్లు రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి ఎంపీ కృష్ణ బాబు పేర్కొన్నారు.

 ఉద్యోగులకు వేతనాలు ఎంత ఉండాలి వారికి ఏ స్థాయి కల్పించాలి పాలనా యంత్రాంగం ఎలా ఉండాలి అనే అంశంపై అధ్యయనానికి ప్రభుత్వం ఆరుగురు నిపుణులతో కమిటీ వేసింది. దీనికి రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి చైర్మన్గా ఉంటారు. ప్రభుత్వంలో ఏపీఎస్ ఆర్టీసీ విలీనం తర్వాత అధికారికంగా ఆర్టీసీ పేరును మార్పును అమలులోకి తీసుకు వస్తామన్నారు.

Comments

Popular posts from this blog

అత్యంత కష్టం మీద బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం బృందం

నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

మీడియాపై మాకు గౌరవముంది: కోటంరెడ్డి

  కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ పాలనపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మీడియాపై తమకు గౌరవం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. జీవో 2430 కొత్తగా తీసుకొచ్చింది కాదని, ఎప్పటినుంచో అది ఉందని తెలిపారు.  ఈ రోజు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్ని పత్రికలు, ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు వార్తలతో అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలని పేర్కొన్నారు. ఒకప్పుడు సాక్షి మీడియాను చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నేతలు ఎటుపోయారని నిలదీశారు. లోకేశ్ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మంగళగిరి నియోజక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేశ్ కు తెలియదని విమర్శించారు. తమ పాలనను చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, తన హయాంలో తన కొడుకు లోకేశ్ తో కలిసి దోచుకుని లోటు బడ్జెట్ ను చూపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని చెప్పారు.  చంద్రబాబుకు చదువుకునేటప్పటి నుంచే కులపిచ్చి ఉందని పేర్కొన్నారు. స్థాని...