Skip to main content

ఆర్టీసీ సమ్మెపై మరోసారి సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్

 


తెలంగాణలో ఆర్టీసీ సమ్మె 23వ రోజుకు చేరింది. అటు సర్కారు నుంచి కానీ, ఇటు ఆర్టీసీ కార్మికుల నుంచి కానీ ఎలాంటి చొరవ కనిపించకపోవడంతో నిన్న జరిగిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ తాజా పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ ప్రగతిభవన్ లో నిర్వహించిన ఈ సమీక్ష సమావేశంలో కేసీఆర్ తో పాటు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ, రవాణా శాఖ కమిషనర్ సందీప్ సుల్తానియా తదితరులు పాల్గొన్నారు. కార్మిక సంఘాల జేఏసీతో జరిగిన చర్చల వివరాలను ఈ సందర్భంగా అధికారులు సీఎం కేసీఆర్ కు వివరించారు. అంతేకాకుండా, కోర్టులో సమ్మెపై వినిపించాల్సిన వాదనలను కూడా సీఎంతో చర్చించారు.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.