Skip to main content

కల్కి ఆశ్రమంలో అక్రమాలు బట్టబయలు... కోట్లాది రూపాయలు, కీలక పత్రాలు స్వాధీనం

 



కల్కి భగవాన్ కు చెందిన ప్రధాన ఆశ్రమంతో పాటు, పలు ప్రాంతాల్లో ఐటీ అధికారులు రెండో రోజు సోదాలు జరుపుతున్నారు. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకల్లో తనిఖీలను నిర్వహిస్తున్నారు. మొత్తం 400 మంది అధికారులు 16 బృందాలుగా విడిపోయి సోదాలను నిర్వహిస్తున్నారు. ఈ సోదాల్లో భారీ ఎత్తున డబ్బు బయటపడుతోంది. ఇప్పటి వరకు రూ. 33 కోట్లను అధికారులు గుర్తించారు. ఇందులో 9 కోట్ల విదేశీ కరెన్సీ కూడా ఉంది. దీంతో పాటు కీలక పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. వరదయ్యపాలెంలోని కల్కి ఆశ్రమంలో కంప్యూటర్లను సీజ్ చేశారు. చెన్నై, బెంగళూరుల్లో భారీగా భూములు కొన్నట్టు గుర్తించారు. ఆఫ్రికా, ఖతార్ దేశాల్లో కూడా ఆస్తులు ఉన్నట్టు కనుగొన్నారు.

Comments

Popular posts from this blog

వారానికోసారి కష్టమేమీ కాదు... సీఎం జగన్‌ కేసులో సీబీఐ కౌంటర్

కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం జగన్ వేసిన పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. అక్రమాస్తుల కేసు విచారణ నుంచి తనకు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీబీఐ కోర్టులో వేసిన పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. సీఎం జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. సాక్షులను జగన్ ప్రభావితం చేసే అవకాశం ఉందని పిటిషన్‌లో పేర్కొంది. ఆయన వాస్తవాలను దాచిపెట్టి పిటిషన్ వేశారని ఆరోపించింది. జగన్ జైల్లో ఉన్నప్పుడు సాక్షులను ప్రభావితం చేశారని... సీఎం పదవిలో ఉన్న జగన్ సాక్షులను మరింత ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ తన పిటిషన్‌లో పేర్కొంది. ఏపీలో రెవెన్యూ లోటు అనేది సీఎంగా ఉన్న జగన్ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చే కారణం కాదని తెలిపింది. సీఎంగా ఉన్న జగన్ విజయవాడ నుంచి వారానికోసారి హైదరాబాద్ రావడంకష్టమేమీ కాదని కౌంటర్‌ పిటిషన్‌లో సీబీఐ పేర్కొన్నట్టు తెలుస్తోంది. సీబీఐ కౌంటర్‌పై కోర్టు శుక్రవారం వాదనలు వినిపించనుంది.

బోటు వెలికితీత మరింత ఆలస్యం

కచ్చులూరు వద్ద మునిగిన బోటును రేపు వెలికితీస్తామని ధర్మాడి సత్యం తెలిపారు. బోటు వెలికితీత కోసం రెండోరోజు చేసిన ప్రయత్నాలు విఫలమైనట్లు చెప్పారు. వాతావరణం అనుకూలించనందువల్లే ఈ ఆలస్యం జరుగుతుందని వివరించారు. గోదావరిలో వరద ప్రహహం తగ్గిన కారణంగా బోటును రేపు బయటికి తీస్తామని స్పష్టం చేశారు. కాగా.. ధర్మాడి సత్యం బృందం వేసిన లంగర్‌కు బోటు తగిలి కదిలిందని స్థానికులు తెలిపారు.