సీఎం జగన్ వైఖరిని విశ్లేషించడం ఎవరి వల్ల కావడంలేదని, గాంధీ జయంతి రోజున కూడా మద్యం అమ్మడం ఏంటో అర్థంకావడంలేదని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించడం పట్ల చిలకలూరిపేట వైసీపీ ఎమ్మెల్యే విడదల రజని స్పందించారు. గాంధీ జయంతి రోజు మద్యం షాపులు ఎక్కడ తెరిచారో చంద్రబాబు చెప్పాలని నిలదీశారు. సీఎం జగన్ పాలన చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని, ప్రభుత్వంపై బురద చల్లేందుకే చంద్రబాబు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. తమ ప్రభుత్వం మద్యనిషేధం దిశగా కృషి చేస్తోందని విడదల రజని స్పష్టం చేశారు.
నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.
Comments
Post a Comment