సీఎం జగన్ వైఖరిని విశ్లేషించడం ఎవరి వల్ల కావడంలేదని, గాంధీ జయంతి రోజున కూడా మద్యం అమ్మడం ఏంటో అర్థంకావడంలేదని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించడం పట్ల చిలకలూరిపేట వైసీపీ ఎమ్మెల్యే విడదల రజని స్పందించారు. గాంధీ జయంతి రోజు మద్యం షాపులు ఎక్కడ తెరిచారో చంద్రబాబు చెప్పాలని నిలదీశారు. సీఎం జగన్ పాలన చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని, ప్రభుత్వంపై బురద చల్లేందుకే చంద్రబాబు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. తమ ప్రభుత్వం మద్యనిషేధం దిశగా కృషి చేస్తోందని విడదల రజని స్పష్టం చేశారు.
వీడియో చూడండి : Click here ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాహన శ్రేణి అంబులెన్స్కు దారిఇచ్చింది. పులివెందుల నుంచి తిరిగివచ్చిన సీఎం గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి నివాసానికి బయల్దేరారు. గూడవల్లి నిడమానూరు మధ్య ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని తరలిస్తున్న అబులెన్స్కు దారి ఇచ్చారు. ఉయ్యూరు నుంచి గన్నవరం బైక్పైవెళ్తున్న చాపర్తిన శేఖర్ అనే వ్యక్తి ఉషారామ ఇంజినీరింగ్కాలేజీ సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. అతన్ని నేషనల్ హైవే అంబులెన్స్ ద్వారా విజయవాడ ఈఎస్ఐ ఆస్పత్రికి తరలిస్తుండగా, దీనికి ముందు ఉన్న ముఖ్యమంత్రి కాన్వాయ్ పక్కకు తొలగి అంబులెన్స్కు దారి ఇచ్చింది.
Comments
Post a Comment