Skip to main content

రతన్ టాటాకు జన్మ జన్మలకు రుణ పడి ఉంటాను: కేశినేని నాని


 విజయవాడ పార్లమెంటు నియోజకవర్గంలో టాటా ట్రస్టు స్వస్థ కుటుంబం ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న సేవా కార్యక్రమాలపై స్పందించిన టీడీపీ ఎంపీ కేశినేని నాని.. ఆ సంస్థ అధినేత రతన్ టాటాకు కృతజ్ఞతలు తెలిపారు. 'రతన్ టాటా గారు టాటా ట్రస్టు ద్వారా విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్న 265 గ్రామాలకు చెందిన 10 లక్షల మంది ప్రజలకు చేస్తోన్న సేవలు అమోఘం. నేను ఆయనకి జన్మ జన్మలకు రుణ పడి వుంటాను' అని ట్వీట్ చేశారు.

విజయవాడ పార్లమెంటు నియోజకవర్గంలో టాటా ట్రస్టు ద్వారా లక్షలాది మందికి ఉచితంగా వైద్యం అందుతోందని ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని కేశినేని నాని పోస్ట్ చేశారు. కాగా, కేశినేని నాని చొరవతో మూడేళ్ల క్రితం ఇక్కడ బీమా కార్డులను జారీ చేశారు. రెండేళ్ల క్రితం టెలీమెడిసిన్ సెంటర్లు ప్రారంభమయ్యాయి. ఆ నియోజక వర్గ పరిధిలోని ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉచిత వైద్య శిబిరాలు అందుబాటులో ఉంటున్నాయి. దీంతో అక్కడి గ్రామాల ప్రజలకు మెరుగైన వైద్యం అందుతోంది.   

Comments

Popular posts from this blog

Android ఫోన్లలో బ్యాంక్ అకౌంట్ వివరాలు దోచుకునే కొత్త మాల్వేర్ 'BlackRock' హడలెత్తిస్తోంది

Trojan కేటగిరికి చెందినదిగా చెబుతున్న 'BlackRock' అనే ఒక మాల్వేర్ Android స్మార్ట్ ఫోన్ల నుండి వినియోగదారుల విలువైన బ్యాంక్ సమాచారాన్ని సేకరిస్తున్నట్లు బయటపడింది. ఇప్పటి వరకూ పర్సనల్ డేటా చౌర్యానికి మాత్రమే పరిమితమైన సైబర్ దాడులు ఇప్పుడు ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ల నుండి బ్యాంక్ అకౌంట్ వివరాలు కూడా దోచుకునేంతగా ముందుకు సాగుతోంది. ఒక మాల్వేర్, బ్యాంక్ అకౌంట్ ఆధారాలను మరియు క్రెడిట్ కార్డు వాటి వాటి వివరాలను ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ల ద్వారా సేకరిస్తున్నట్లు మరియు ఇది దాదాపుగా 300 పైగా ఆండ్రాయిడ్ యాప్స్ పైన తాన్ ప్రభావాన్ని చూపిస్తున్నట్లు తెలిపింది. అసలే ప్రజలు కరోనా మహమ్మారితో దెబ్బకి హడలెత్తి పోతోంటే, ఆన్ లైన్ లో సైబర్ దాడులు మరియు సైబర్ మోసాలు మరింతగా కృంగదీస్తున్నాయి. ఇప్పటి వరకూ పర్సనల్ డేటా చౌర్యానికి మాత్రమే పరిమితమైన సైబర్ దాడులు ఇప్పుడు ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ల నుండి బ్యాంక్ అకౌంట్ వివరాలు కూడా దోచుకునేంతగా ముందుకు  సాగుతోంది. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఒక నివేదిక ప్రకారం,Trojan కేటగిరికి చెందినదిగా చెబుతున్న 'BlackRock' అనే ఒక మాల్వేర్ Android స...

ఆమిర్‌ ఖాన్‌పై విమర్శలు గుప్పిస్తున్న నెటిజెన్లు

  బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ పై నెటిజెన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే, తన తాజా చిత్రం 'లాల్ సింగ్ చద్దా' షూటింగ్ కోసం ఆమిర్ ఇటీవల టర్కీకి వెళ్లారు. ఈ సమయంలో ఆయనతో సెల్ఫీలు తీసుకునేందుకు అక్కడి వారు ఉత్సాహం చూపారు. తన పర్యటనలో భాగంగా టర్కీ అధ్యక్షుడి భార్య ఎమినే ఎర్డోగన్ ను కూడా ఆమిర్ కలిశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఆమె తెలిపారు. ప్రముఖ భారతీయ నటుడు ఆమిర్ ను కలవడం సంతోషంగా ఉందని ఆమె చెప్పారు. టర్కీలోని పలు ప్రాంతాల్లో షూటింగ్ చేశారని.. ఆ చిత్రాన్ని చూసేందుకు తాను కూడా ఎదురుచూస్తున్నానని ఆమె అన్నారు. ఈ వ్యవహారంపై ఆమిర్ పై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. కశ్మీర్ విషయంలో పాకిస్థాన్ కు టర్కీ అధ్యక్షుడు మద్దతు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఎమినేను ఆమిర్ కలవకుండా వుండి ఉంటే బాగుండేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.