Skip to main content

రతన్ టాటాకు జన్మ జన్మలకు రుణ పడి ఉంటాను: కేశినేని నాని


 విజయవాడ పార్లమెంటు నియోజకవర్గంలో టాటా ట్రస్టు స్వస్థ కుటుంబం ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న సేవా కార్యక్రమాలపై స్పందించిన టీడీపీ ఎంపీ కేశినేని నాని.. ఆ సంస్థ అధినేత రతన్ టాటాకు కృతజ్ఞతలు తెలిపారు. 'రతన్ టాటా గారు టాటా ట్రస్టు ద్వారా విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్న 265 గ్రామాలకు చెందిన 10 లక్షల మంది ప్రజలకు చేస్తోన్న సేవలు అమోఘం. నేను ఆయనకి జన్మ జన్మలకు రుణ పడి వుంటాను' అని ట్వీట్ చేశారు.

విజయవాడ పార్లమెంటు నియోజకవర్గంలో టాటా ట్రస్టు ద్వారా లక్షలాది మందికి ఉచితంగా వైద్యం అందుతోందని ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని కేశినేని నాని పోస్ట్ చేశారు. కాగా, కేశినేని నాని చొరవతో మూడేళ్ల క్రితం ఇక్కడ బీమా కార్డులను జారీ చేశారు. రెండేళ్ల క్రితం టెలీమెడిసిన్ సెంటర్లు ప్రారంభమయ్యాయి. ఆ నియోజక వర్గ పరిధిలోని ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉచిత వైద్య శిబిరాలు అందుబాటులో ఉంటున్నాయి. దీంతో అక్కడి గ్రామాల ప్రజలకు మెరుగైన వైద్యం అందుతోంది.   

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.