Skip to main content

రతన్ టాటాకు జన్మ జన్మలకు రుణ పడి ఉంటాను: కేశినేని నాని


 విజయవాడ పార్లమెంటు నియోజకవర్గంలో టాటా ట్రస్టు స్వస్థ కుటుంబం ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న సేవా కార్యక్రమాలపై స్పందించిన టీడీపీ ఎంపీ కేశినేని నాని.. ఆ సంస్థ అధినేత రతన్ టాటాకు కృతజ్ఞతలు తెలిపారు. 'రతన్ టాటా గారు టాటా ట్రస్టు ద్వారా విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్న 265 గ్రామాలకు చెందిన 10 లక్షల మంది ప్రజలకు చేస్తోన్న సేవలు అమోఘం. నేను ఆయనకి జన్మ జన్మలకు రుణ పడి వుంటాను' అని ట్వీట్ చేశారు.

విజయవాడ పార్లమెంటు నియోజకవర్గంలో టాటా ట్రస్టు ద్వారా లక్షలాది మందికి ఉచితంగా వైద్యం అందుతోందని ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని కేశినేని నాని పోస్ట్ చేశారు. కాగా, కేశినేని నాని చొరవతో మూడేళ్ల క్రితం ఇక్కడ బీమా కార్డులను జారీ చేశారు. రెండేళ్ల క్రితం టెలీమెడిసిన్ సెంటర్లు ప్రారంభమయ్యాయి. ఆ నియోజక వర్గ పరిధిలోని ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉచిత వైద్య శిబిరాలు అందుబాటులో ఉంటున్నాయి. దీంతో అక్కడి గ్రామాల ప్రజలకు మెరుగైన వైద్యం అందుతోంది.   

Comments

Popular posts from this blog

అమరావతిలో భూముల రేట్లు తగ్గకుండా: సీఆర్డీఏ స్థానంలో కొత్త అథారిటీ: కీలక నోటిఫికేషన్

 మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందడం, రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్డీ) రద్దు నేపథ్యంలో.. ప్రభుత్వం మెరుపు వేగంతో నిర్ణయాలను తీసుకుంటోంది. పరిపాలనను వేగవంతం చేసేలా తక్షణ చర్యలకు దిగింది. సీఆర్డీఏ బిల్లు రద్దు అనంతరం దాని స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలిని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. దాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఏఎంఆర్డీఏ కమిటీ సభ్యులనూ నియమించింది. సీఆర్డీఏకు బదులుగా ఏఎంఆర్డీఏ సీఆర్డీఏ స్థాయంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలి (ఏఎంఆర్డీఏ)ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్‌ను జారీ చేసింది. సీఆర్డీఏను రద్దు చేస్తూ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేసిన మరుసటి రోజే ఏఎంఆర్డీఏను తెరపైకి తీసుకొచ్చింది. దానితో పాటు కొత్త సభ్యులను నియమించింది. మున్సిపల్ శాఖ కార్యదర్శి జే శ్యామల రావు దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను జారీ చేశారు. మొత్తం 11 మంది సభ్యులను ఏఎంఆర్డీఏ కమిటీలో నియమించారు. సభ్యులు వీరే.. మున్సిపల్ శాఖ కార్యదర్శి డిప్య...