Skip to main content

హైకోర్టుతోపాటు రాజధాని కూడా రాయలసీమలోనే ఏర్పాటు చేయాలి: బీజేపీ ఎంపీ టీజీ వెంకటేశ్ డిమాండ్‌

 


ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో హైకోర్టుతోపాటు రాష్ట్ర రాజధానిని కూడా రాయల సీమలో ఏర్పాటు చేయడం మంచిదని బీజేపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ డిమాండ్‌ చేశారు.  రాజధాని కోసం అధ్యయనం పేరుతో కాలయాపన చేయడం కంటే మూడు ప్రాంతాలకు మూడు రాజధానులు ఇస్తే సరిపోతుందని ఆయన అన్నారు. ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించి ప్రత్యేక రాయలసీమ డిమాండ్‌ చేసే పరిస్థితులు తేవొద్దని హితవు పలికారు. రాయలసీమ డిక్లరేషన్‌ అమలయ్యే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. రాయల సీమపై అభిమానం ఉంటే రాంగోపాలవర్మ మంచి సినిమాలు తీస్తే బాగుంటుందని  వెంకటేశ్ అన్నారు. వర్మ ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమాను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా భావిస్తున్నారు.  

Comments

Popular posts from this blog

అమరావతిలో భూముల రేట్లు తగ్గకుండా: సీఆర్డీఏ స్థానంలో కొత్త అథారిటీ: కీలక నోటిఫికేషన్

 మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందడం, రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్డీ) రద్దు నేపథ్యంలో.. ప్రభుత్వం మెరుపు వేగంతో నిర్ణయాలను తీసుకుంటోంది. పరిపాలనను వేగవంతం చేసేలా తక్షణ చర్యలకు దిగింది. సీఆర్డీఏ బిల్లు రద్దు అనంతరం దాని స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలిని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. దాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఏఎంఆర్డీఏ కమిటీ సభ్యులనూ నియమించింది. సీఆర్డీఏకు బదులుగా ఏఎంఆర్డీఏ సీఆర్డీఏ స్థాయంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలి (ఏఎంఆర్డీఏ)ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్‌ను జారీ చేసింది. సీఆర్డీఏను రద్దు చేస్తూ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేసిన మరుసటి రోజే ఏఎంఆర్డీఏను తెరపైకి తీసుకొచ్చింది. దానితో పాటు కొత్త సభ్యులను నియమించింది. మున్సిపల్ శాఖ కార్యదర్శి జే శ్యామల రావు దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను జారీ చేశారు. మొత్తం 11 మంది సభ్యులను ఏఎంఆర్డీఏ కమిటీలో నియమించారు. సభ్యులు వీరే.. మున్సిపల్ శాఖ కార్యదర్శి డిప్య...