Skip to main content

అధికారుల పొరపాటు.. రెండు సార్లు ప్రమాణం చేసిన ఏపీ చీఫ్ జస్టిస్

అధికారులు చేసిన ఓ పొరపాటుకు ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ రెండు సార్లు ప్రమాణస్వీకారం చేయాల్సి వచ్చింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి ఈరోజు ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ బిశ్వభూషణ్ ఆయన చేత ప్రమాణం చేయించారు. అయితే, ప్రమాణస్వీకార పత్రంలో ఆంధ్రప్రదేశ్ బదులుగా మధ్యప్రదేశ్ అని రాసి ఉంది. ఈ నేపథ్యంలో గవర్నర్, చీఫ్ జస్టిస్ ఇద్దరూ మధ్యప్రదేశ్ అనే చదివారు. వెంటనే జరిగిన పొరపాటును గ్రహించారు. దీంతో, ఆంధ్రప్రదేశ్ అంటూ చీఫ్ జస్టిస్ తో గవర్నర్ మరోసారి ప్రమాణస్వీకారం చేయించారు. ప్రమాణస్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్ కూడా హాజరయ్యారు.

Comments

Popular posts from this blog

అంబులెన్స్‌కు దారి ఇచ్చిన సీఎం కాన్వాయ్...‌

వీడియో చూడండి : Click here ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాహన శ్రేణి అంబులెన్స్‌కు దారిఇచ్చింది. పులివెందుల నుంచి తిరిగివచ్చిన సీఎం గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి నివాసానికి బయల్దేరారు. గూడవల్లి నిడమానూరు మధ్య ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని తరలిస్తున్న అబులెన్స్‌కు దారి ఇచ్చారు. ఉయ్యూరు నుంచి గన్నవరం బైక్‌పైవెళ్తున్న చాపర్తిన శేఖర్‌ అనే వ్యక్తి ఉషారామ ఇంజినీరింగ్‌కాలేజీ సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. అతన్ని నేషనల్‌ హైవే అంబులెన్స్‌ ద్వారా విజయవాడ ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలిస్తుండగా, దీనికి ముందు ఉన్న ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పక్కకు తొలగి అంబులెన్స్‌కు దారి ఇచ్చింది.

హెలికాప్టర్ కు అనుమతి ఇవ్వని అధికారులు.. కేసీఆర్ సభ రద్దు

    తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హుజూర్ నగర్ సభ రద్దైంది. భారీ వర్షం కారణంగా సభను రద్దు చేశారు. ప్రతికూల వాతావరణం నేపథ్యంలో కేసీఆర్ హెలికాప్టర్ కు ఏవియేషన్ అధికారులు అనుమతి ఇవ్వలేదు. అధికారుల సూచనతో కేసీఆర్ తన సభను రద్దు చేసుకున్నారు. సీఎం రావడం లేదనే ప్రకటనతో సభా ప్రాంగణానికి భారీగా చేరుకున్న నాయకులు, ప్రజలు అక్కడి నుంచి వెళ్లిపోతున్నారు.