Skip to main content

గూగుల్ ఆధ్వర్యంలో.. ఇక డ్రోన్ల ద్వారా డెలివరీ!





డోర్ డెలివరీ ప్రక్రియలో విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకోనున్నాయి. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన గూగుల్ సంస్థ ఈ దిశగా తొలి అడుగులు వేసింది. వినూత్న ఆవిష్కరణలకు పేరుగాంచిన గూగుల్  కంపెనీ ఆర్డర్ చేసిన వస్తువులను డెలివరీ చేయడానికి మనుషులకు బదులుగా డ్రోన్ లను ఉపయోగించడంలో విజయవంతమైంది. ఈ సౌకర్యాన్ని అమెరికాలో అప్పుడే ప్రారంభించింది కూడా.

ఇక దేశంలో ఈ తరహా సర్వీస్ ను అందించడానికి గూగుల్ సంస్థ అమెరికా ప్రభుత్వం నుంచి అనుమతి కూడా పొందింది. సంస్థకు చెందిన ఆల్ఫాబెట్ యూనిట్ ఈ సేవలను అందిస్తోంది. ఈ సేవలకు ‘వింగ్’ అని పేరు పెట్టి అక్కడి ఫెడ్ ఎక్స్ ఎక్స్ ప్రెస్, వాల్ గ్రీన్స్ కంపెనీల వస్తువులను డ్రోన్ల ద్వారా వినియోగదారులకు డెలివరీ చేస్తోంది.

సాధారణంగా మనుషులను డెలీవరీకి వినియోగిస్తే ట్రాఫిక్ చిక్కులతో సమయం ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది.  డ్రోన్ డెలివరీ ఇలాంటి అవరోధాలు అధిగమించి వస్తులను అతి తక్కువ సమయంలో డెలివరీ చేస్తుంది. గంటకు 120 కిలో మీటర్ల వేగంతో డ్రోన్ ప్రయాణిస్తుంది. విమానాల్లో ఉపయోగించే  సాఫ్ట్ వేర్, సెన్సార్లను డ్రోన్లలో అమర్చడంతో వీటి ప్రయాణం సాఫీగా సాగుతుంది. మనదేశంలో కూడా ఈ డ్రోన్ డెలివరీ వ్యవస్థ త్వరలో రానుందని సమాచారం.   

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...