Skip to main content

గూగుల్ ఆధ్వర్యంలో.. ఇక డ్రోన్ల ద్వారా డెలివరీ!





డోర్ డెలివరీ ప్రక్రియలో విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకోనున్నాయి. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన గూగుల్ సంస్థ ఈ దిశగా తొలి అడుగులు వేసింది. వినూత్న ఆవిష్కరణలకు పేరుగాంచిన గూగుల్  కంపెనీ ఆర్డర్ చేసిన వస్తువులను డెలివరీ చేయడానికి మనుషులకు బదులుగా డ్రోన్ లను ఉపయోగించడంలో విజయవంతమైంది. ఈ సౌకర్యాన్ని అమెరికాలో అప్పుడే ప్రారంభించింది కూడా.

ఇక దేశంలో ఈ తరహా సర్వీస్ ను అందించడానికి గూగుల్ సంస్థ అమెరికా ప్రభుత్వం నుంచి అనుమతి కూడా పొందింది. సంస్థకు చెందిన ఆల్ఫాబెట్ యూనిట్ ఈ సేవలను అందిస్తోంది. ఈ సేవలకు ‘వింగ్’ అని పేరు పెట్టి అక్కడి ఫెడ్ ఎక్స్ ఎక్స్ ప్రెస్, వాల్ గ్రీన్స్ కంపెనీల వస్తువులను డ్రోన్ల ద్వారా వినియోగదారులకు డెలివరీ చేస్తోంది.

సాధారణంగా మనుషులను డెలీవరీకి వినియోగిస్తే ట్రాఫిక్ చిక్కులతో సమయం ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది.  డ్రోన్ డెలివరీ ఇలాంటి అవరోధాలు అధిగమించి వస్తులను అతి తక్కువ సమయంలో డెలివరీ చేస్తుంది. గంటకు 120 కిలో మీటర్ల వేగంతో డ్రోన్ ప్రయాణిస్తుంది. విమానాల్లో ఉపయోగించే  సాఫ్ట్ వేర్, సెన్సార్లను డ్రోన్లలో అమర్చడంతో వీటి ప్రయాణం సాఫీగా సాగుతుంది. మనదేశంలో కూడా ఈ డ్రోన్ డెలివరీ వ్యవస్థ త్వరలో రానుందని సమాచారం.   

Comments

Popular posts from this blog

అమరావతిలో భూముల రేట్లు తగ్గకుండా: సీఆర్డీఏ స్థానంలో కొత్త అథారిటీ: కీలక నోటిఫికేషన్

 మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందడం, రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్డీ) రద్దు నేపథ్యంలో.. ప్రభుత్వం మెరుపు వేగంతో నిర్ణయాలను తీసుకుంటోంది. పరిపాలనను వేగవంతం చేసేలా తక్షణ చర్యలకు దిగింది. సీఆర్డీఏ బిల్లు రద్దు అనంతరం దాని స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలిని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. దాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఏఎంఆర్డీఏ కమిటీ సభ్యులనూ నియమించింది. సీఆర్డీఏకు బదులుగా ఏఎంఆర్డీఏ సీఆర్డీఏ స్థాయంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలి (ఏఎంఆర్డీఏ)ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్‌ను జారీ చేసింది. సీఆర్డీఏను రద్దు చేస్తూ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేసిన మరుసటి రోజే ఏఎంఆర్డీఏను తెరపైకి తీసుకొచ్చింది. దానితో పాటు కొత్త సభ్యులను నియమించింది. మున్సిపల్ శాఖ కార్యదర్శి జే శ్యామల రావు దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను జారీ చేశారు. మొత్తం 11 మంది సభ్యులను ఏఎంఆర్డీఏ కమిటీలో నియమించారు. సభ్యులు వీరే.. మున్సిపల్ శాఖ కార్యదర్శి డిప్య...