Skip to main content

అమిత్ షాతో జగన్ అపాయింట్ మెంట్... వరుసగా రెండోసారి క్యాన్సిల్!

కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాతో జరగాల్సిన వైఎస్ జగన్ భేటీ మరోసారి రద్దయింది. జగన్ కు ఇచ్చిన అపాయింట్ మెంట్ ను రద్దు చేసుకుంటున్నట్టు అమిత్ షా కార్యాలయం నుంచి జగన్ కు సమాచారం అందింది. మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలోనే అపాయింట్ మెంట్ క్యాన్సిల్ అయినట్టు తెలుస్తోంది. రెండు రాష్ట్రాల్లో నామినేషన్ల పర్వం ముగిసి, ప్రచారం అయిపోయేంత వరకూ అమిత్ షా బిజీగా ఉంటారని, ఎవరికీ విడిగా అపాయింట్లు ఇచ్చే పరిస్థితి లేదని హోమ్ శాఖ అధికారులు వెల్లడించినట్టు సమాచారం. కాగా, ఇటీవలి కాలంలో అమిత్, జగన్ ల భేటీ రద్దు కావడం ఇది రెండోసారి. ఇక అమిత్ షా అందుబాటులో లేకపోవడంతో జగన్ తన ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకున్నారు. వాస్తవానికి నేడు ఢిల్లీకి వెళ్లి పలు అంశాలపై అమిత్ షా తో జగన్ చర్చించాల్సి వుంది. గత వారం ఢిల్లీ పర్యటనలో భాగంగా మోదీని కలిసిన జగన్, హోమ్ మంత్రిని మాత్రం కలవలేకపోయారు. 

Comments

Popular posts from this blog

అమరావతిలో భూముల రేట్లు తగ్గకుండా: సీఆర్డీఏ స్థానంలో కొత్త అథారిటీ: కీలక నోటిఫికేషన్

 మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందడం, రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్డీ) రద్దు నేపథ్యంలో.. ప్రభుత్వం మెరుపు వేగంతో నిర్ణయాలను తీసుకుంటోంది. పరిపాలనను వేగవంతం చేసేలా తక్షణ చర్యలకు దిగింది. సీఆర్డీఏ బిల్లు రద్దు అనంతరం దాని స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలిని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. దాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఏఎంఆర్డీఏ కమిటీ సభ్యులనూ నియమించింది. సీఆర్డీఏకు బదులుగా ఏఎంఆర్డీఏ సీఆర్డీఏ స్థాయంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలి (ఏఎంఆర్డీఏ)ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్‌ను జారీ చేసింది. సీఆర్డీఏను రద్దు చేస్తూ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేసిన మరుసటి రోజే ఏఎంఆర్డీఏను తెరపైకి తీసుకొచ్చింది. దానితో పాటు కొత్త సభ్యులను నియమించింది. మున్సిపల్ శాఖ కార్యదర్శి జే శ్యామల రావు దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను జారీ చేశారు. మొత్తం 11 మంది సభ్యులను ఏఎంఆర్డీఏ కమిటీలో నియమించారు. సభ్యులు వీరే.. మున్సిపల్ శాఖ కార్యదర్శి డిప్య...