Skip to main content

ఎగ్జిట్ పోల్స్.. మహారాష్ట్ర, హర్యానాలో బీజేపీదే హవా!

మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొంచెం సేపటి క్రితం ముగిసిన విషయం తెలిసిందే. ఆయా రాష్ట్రాల్లో ఏ పార్టీ గెలుపు సాధిస్తుందన్న విషయమై ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువడ్డాయి. మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో బీజేపీ కూటమి విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనాగా ఉంది. ఈ అంచనాలు నిజమైతే కనుక మరోసారి రెండు రాష్ట్రాల్లో బీజేపీ అధికారం దక్కించుకోనుంది. కాంగ్రెస్ పార్టీకి మరోసారి ఘోరంగా భంగపడనుంది.

టైమ్స్ నౌ (మహారాష్ట్ర)..  బీజేపీ కూటమికి 230 స్థానాలు, కాంగ్రెస్ కూటమికి 48 స్థానాలు, ఇతరులకు 10 స్థానాలు

టైమ్స్ నౌ (హర్యానా).. బీజేపీకి 71 స్థానాలు, కాంగ్రెస్ కు 11 స్థానాలు

ఇండియా టుడే (మహారాష్ట్ర) .. బీజేపీకి 109 నుంచి 124 స్థానాలు, శివసేనకు 57 నుంచి 70, కాంగ్రెస్ కు 32 నుంచి 40, ఎన్సీపీ 40 నుంచి 50, ఇతరులకు 22 నుంచి 30 స్థానాలు

రిపబ్లిక్ (మహారాష్ట్ర).. బీజేపీకి 135 నుంచి 142 స్థానాలు, శివసేనకు 81నుంచి 88 స్థానాలు, కాంగ్రెస్ కు 20 నుంచి 24 స్థానాలు, ఎన్సీపీకి 30 నుంచి 35 స్థానాలు, ఇతరులకు 8 నుంచి 12 స్థానాలు

రిపబ్లిక్ (హర్యానా).. బీజేపీకి  52 నుంచి 63 స్థానాలు, కాంగ్రెస్ కు 15 నుంచి 19 స్థానాలు, జేజేపీ కి 5 నుంచి 9 స్థానాలు, ఐఎన్ఎల్ డీ 0 నుంచి 1 స్థానం, ఇతరులకు 7 నుంచి 9 స్థానాలు

న్యూస్ ఎక్స్ (హర్యానా).. 
బీజేపీకి 75 నుంచి 80 స్థానాలు, కాంగ్రెస్ 9 నుంచి 12 స్థానాలు, ఇతరులకు 1 నుంచి 3 స్థానాలు

సీఎన్ఎన్ న్యూస్ 18 (మహారాష్ట్ర).. 
బీజేపీకి 243 స్థానాలు, కాంగ్రెస్ కు 41 స్థానాలు, ఇతరులకు 4 స్థానాలు

ఏబీపీ న్యూస్ సి.ఓటర్ (మహారాష్ట్ర).. 
బీజేపీకి 204 స్థానాలు, కాంగ్రెస్ కు 69 స్థానాలు, ఇతరులకు 15 స్థానాలు

న్యూస్ 24 (మహారాష్ట్ర).. బీజేపీకి 230 స్థానాలు, కాంగ్రెస్ కు 48 స్థానాలు, ఇతరులకు 10 స్థానాలు

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...