Skip to main content

ఎగ్జిట్ పోల్స్.. మహారాష్ట్ర, హర్యానాలో బీజేపీదే హవా!

మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొంచెం సేపటి క్రితం ముగిసిన విషయం తెలిసిందే. ఆయా రాష్ట్రాల్లో ఏ పార్టీ గెలుపు సాధిస్తుందన్న విషయమై ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువడ్డాయి. మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో బీజేపీ కూటమి విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనాగా ఉంది. ఈ అంచనాలు నిజమైతే కనుక మరోసారి రెండు రాష్ట్రాల్లో బీజేపీ అధికారం దక్కించుకోనుంది. కాంగ్రెస్ పార్టీకి మరోసారి ఘోరంగా భంగపడనుంది.

టైమ్స్ నౌ (మహారాష్ట్ర)..  బీజేపీ కూటమికి 230 స్థానాలు, కాంగ్రెస్ కూటమికి 48 స్థానాలు, ఇతరులకు 10 స్థానాలు

టైమ్స్ నౌ (హర్యానా).. బీజేపీకి 71 స్థానాలు, కాంగ్రెస్ కు 11 స్థానాలు

ఇండియా టుడే (మహారాష్ట్ర) .. బీజేపీకి 109 నుంచి 124 స్థానాలు, శివసేనకు 57 నుంచి 70, కాంగ్రెస్ కు 32 నుంచి 40, ఎన్సీపీ 40 నుంచి 50, ఇతరులకు 22 నుంచి 30 స్థానాలు

రిపబ్లిక్ (మహారాష్ట్ర).. బీజేపీకి 135 నుంచి 142 స్థానాలు, శివసేనకు 81నుంచి 88 స్థానాలు, కాంగ్రెస్ కు 20 నుంచి 24 స్థానాలు, ఎన్సీపీకి 30 నుంచి 35 స్థానాలు, ఇతరులకు 8 నుంచి 12 స్థానాలు

రిపబ్లిక్ (హర్యానా).. బీజేపీకి  52 నుంచి 63 స్థానాలు, కాంగ్రెస్ కు 15 నుంచి 19 స్థానాలు, జేజేపీ కి 5 నుంచి 9 స్థానాలు, ఐఎన్ఎల్ డీ 0 నుంచి 1 స్థానం, ఇతరులకు 7 నుంచి 9 స్థానాలు

న్యూస్ ఎక్స్ (హర్యానా).. 
బీజేపీకి 75 నుంచి 80 స్థానాలు, కాంగ్రెస్ 9 నుంచి 12 స్థానాలు, ఇతరులకు 1 నుంచి 3 స్థానాలు

సీఎన్ఎన్ న్యూస్ 18 (మహారాష్ట్ర).. 
బీజేపీకి 243 స్థానాలు, కాంగ్రెస్ కు 41 స్థానాలు, ఇతరులకు 4 స్థానాలు

ఏబీపీ న్యూస్ సి.ఓటర్ (మహారాష్ట్ర).. 
బీజేపీకి 204 స్థానాలు, కాంగ్రెస్ కు 69 స్థానాలు, ఇతరులకు 15 స్థానాలు

న్యూస్ 24 (మహారాష్ట్ర).. బీజేపీకి 230 స్థానాలు, కాంగ్రెస్ కు 48 స్థానాలు, ఇతరులకు 10 స్థానాలు

Comments

Popular posts from this blog

అత్యంత కష్టం మీద బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం బృందం

నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

మీడియాపై మాకు గౌరవముంది: కోటంరెడ్డి

  కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ పాలనపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మీడియాపై తమకు గౌరవం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. జీవో 2430 కొత్తగా తీసుకొచ్చింది కాదని, ఎప్పటినుంచో అది ఉందని తెలిపారు.  ఈ రోజు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్ని పత్రికలు, ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు వార్తలతో అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలని పేర్కొన్నారు. ఒకప్పుడు సాక్షి మీడియాను చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నేతలు ఎటుపోయారని నిలదీశారు. లోకేశ్ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మంగళగిరి నియోజక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేశ్ కు తెలియదని విమర్శించారు. తమ పాలనను చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, తన హయాంలో తన కొడుకు లోకేశ్ తో కలిసి దోచుకుని లోటు బడ్జెట్ ను చూపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని చెప్పారు.  చంద్రబాబుకు చదువుకునేటప్పటి నుంచే కులపిచ్చి ఉందని పేర్కొన్నారు. స్థాని...