అప్పట్లో తహసీల్దార్ వనజాక్షి వ్యవహారం ఎంత సంచలనం సృష్టించిందో ఇప్పుడు నెల్లూరు జిల్లాలో ఎంపీడీవో సరళపై దాష్టీకం కూడా అంతే ప్రకంపనలు రేకెత్తిస్తోంది. ఈ వ్యవహారానికి వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కేంద్రబిందువుగా నిలిచారు. దీనిపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు. మహిళా అధికారిపై దాడి చేసిన కోటంరెడ్డి కేసును నీరుగార్చకండి అంటూ ట్విట్టర్ లో లేఖ విడుదల చేశారు. అప్పుడు వనజాక్షి, ఇప్పుడు సరళ... ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులేనని, విధుల్లో నిజాయతీగా వ్యవహరించి ప్రజాప్రతినిధుల దౌర్జన్యానికి గురయ్యారని పవన్ తన పోస్టులో పేర్కొన్నారు. ఉద్యోగ విధుల్లో ఉన్న మహిళలపైనే ఇలాంటి దాడులకు తెగబడుతుంటే, సాధారణ మహిళల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. పవన్ లేఖ పూర్తి పాఠం ఇదిగో
బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Comments
Post a Comment