అప్పట్లో తహసీల్దార్ వనజాక్షి వ్యవహారం ఎంత సంచలనం సృష్టించిందో ఇప్పుడు నెల్లూరు జిల్లాలో ఎంపీడీవో సరళపై దాష్టీకం కూడా అంతే ప్రకంపనలు రేకెత్తిస్తోంది. ఈ వ్యవహారానికి వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కేంద్రబిందువుగా నిలిచారు. దీనిపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు. మహిళా అధికారిపై దాడి చేసిన కోటంరెడ్డి కేసును నీరుగార్చకండి అంటూ ట్విట్టర్ లో లేఖ విడుదల చేశారు. అప్పుడు వనజాక్షి, ఇప్పుడు సరళ... ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులేనని, విధుల్లో నిజాయతీగా వ్యవహరించి ప్రజాప్రతినిధుల దౌర్జన్యానికి గురయ్యారని పవన్ తన పోస్టులో పేర్కొన్నారు. ఉద్యోగ విధుల్లో ఉన్న మహిళలపైనే ఇలాంటి దాడులకు తెగబడుతుంటే, సాధారణ మహిళల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. పవన్ లేఖ పూర్తి పాఠం ఇదిగో
తెలుగుదేశం పార్టీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు కోర్టులో చుక్కెదురు అయ్యింది. చింతమనేనికి బెయిల్ ఇచ్చేందుకు ఏలూరు కోర్టు నిరాకరించింది. అంతేకాదు చింతమనేని రిమాండ్ ను అక్టోబర్ 9 వరకు పొండిగించింది. 2017లో అప్పనపాడు గ్రామంలో స్థల వివాదంలో వ్యక్తిని నిర్బంధించి కులం పేరుతో దూషించిన కేసులో కేసు నమోదు అయ్యింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో భాగంగా ఇటీవలే చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం చింతమనేని ప్రభాకర్ ను ఏలూరులోని ఎస్సీఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరచగా కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. రిమాండ్ పూర్తవ్వడంతో బుధవారం పోలీసులు మరోసారి ఏలూరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరిచారు. అలాగే బెయిల్ ఇవ్వాలంటూ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తరపు న్యాయవాది సైతం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. చింతమనేని బెయిల్ పిటీషన్ ను న్యాయస్థానం తోసిపుచ్చింది. అనంతరం చింతమనేని రిమాండ్ ను వచ్చే నెల 9 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏలూరు కోర్టు. ఇకపోతే చింతమనేని ప్రభాకర్ ను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన సమయంలో మహిళా పో...
Comments
Post a Comment