Skip to main content

అప్పుడు వనజాక్షి... ఇప్పుడు సరళ... కోటంరెడ్డి కేసును నీరుగార్చకండి: పవన్ కల్యాణ్

అప్పట్లో తహసీల్దార్ వనజాక్షి వ్యవహారం ఎంత సంచలనం సృష్టించిందో ఇప్పుడు నెల్లూరు జిల్లాలో ఎంపీడీవో సరళపై దాష్టీకం కూడా అంతే ప్రకంపనలు రేకెత్తిస్తోంది. ఈ వ్యవహారానికి వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కేంద్రబిందువుగా నిలిచారు. దీనిపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు. మహిళా అధికారిపై దాడి చేసిన కోటంరెడ్డి కేసును నీరుగార్చకండి అంటూ ట్విట్టర్ లో లేఖ విడుదల చేశారు. అప్పుడు వనజాక్షి, ఇప్పుడు సరళ... ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులేనని, విధుల్లో నిజాయతీగా వ్యవహరించి ప్రజాప్రతినిధుల దౌర్జన్యానికి గురయ్యారని పవన్ తన పోస్టులో పేర్కొన్నారు. ఉద్యోగ విధుల్లో ఉన్న మహిళలపైనే ఇలాంటి దాడులకు తెగబడుతుంటే, సాధారణ మహిళల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. పవన్ లేఖ పూర్తి పాఠం ఇదిగో

Comments

Popular posts from this blog

వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏనాడూ అడ్డుపడలేదు: చంద్రబాబునాయుడు

రాజధాని అమరావతిని అభివృద్ధి చెందకుండా చేసేందుకు చూస్తున్నారని, అలా జరగనివ్వమని వైసీపీ ప్రభుత్వాన్ని చంద్రబాబు హెచ్చరించారు. విశాఖపట్టణంలో నిర్వహించిన టీడీపీ జిల్లా సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, అమరావతిని బతికించుకునే శక్తి తెలుగు ప్రజలకు ఉందని అన్నారు. గతంలో వైఎస్ తనను చాలా సార్లు విమర్శించారు కానీ, తాను ప్రారంభించిన కార్యక్రమాలకు ఆయన ఏనాడూ అడ్డుపడలేదని, అందుకే, హైదరాబాద్ అభివృద్ధి చెందిందని అన్నారు. ఏపీలో వున్నవి గ్రామ సచివాలయాలా? వైసీపీ కార్యాలయాలా? అని ప్రశ్నించిన చంద్రబాబు, శ్మశాన వాటికలకు కూడా వైసీపీ రంగు వేసుకుంటే బాగుంటుందని విమర్శించారు. ప్రజలే మీ ముఖాలకు రంగు వేసి బజార్లో తిప్పే రోజు వస్తుంది అని వైసీపీ నేతలపై చంద్రబాబు విరుచుకుపడ్డారు.

పది రోజుల్లోనే రూ. 5 వేలకు పైగా తగ్గిన పది గ్రాముల బంగారం ధర...మరింత తగ్గే అవకాశం !

 దాదాపు 10 రోజుల క్రితం 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర ఆల్ టైమ్ రికార్డు స్థాయిలో రూ. 56,200 వరకూ వెళ్లిన సంగతి తెలిసిందే. ఆపై ధరలో కరెక్షన్ ట్రెండ్ ప్రారంభం కాగా, ప్రస్తుతం రూ. 51,100 వరకూ ధర దిగి వచ్చింది. ఇదే సమయంలో కిలో వెండి ధర రూ. 14 వేలకు పైగా పడిపోయింది. ఓ దశలో రూ. 78 వేలను దాటిన వెండి ధర ఇప్పుడు రూ. 64 వేలకు చేరింది. అటు అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం ధరలు దిగివచ్చాయి. కరోనాకు వ్యాక్సిన్ వస్తోందన్న వార్తలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను తిరిగి స్టాక్ మార్కెట్ వైపు మళ్లించాయి. దీంతో బులియన్ మార్కెట్ డీలా పడిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గడచిన రెండు రోజులుగా బంగారం ధర స్వల్పంగా పెరుగుతూ ఉన్నప్పటికీ, రెండో దశ కరెక్షన్ రానుందని, బంగారం ధర మరింతగా తగ్గవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఎంసీఎక్స్ లో ప్రస్తుతం బంగారం ధర ధర రూ. 50,924గా ఉండగా, వెండి ధర రూ. 64,007 వద్ద నిలిచింది. న్యూయార్క్ కామెక్స్ లో ఔన్సు బంగారం ధర 0.6 శాతం పెరిగి 1,934 డాలర్లకు చేరింది. వెండి ధర ఔన్సుకు 26.64 డాలర్ల వద్ద కొనసాగుతోంది. యూఎస్, చైనాల మధ్య ఒప్పందం కుదరడం కూడా బంగారం ధరలు పతనం కావడానికి...