Skip to main content

బెయిల్ కోసం సుప్రీంను ఆశ్ర‌యించిన చిదంబ‌రం

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఇవాళ‌ మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబ‌రం సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. చిదంబ‌రం త‌ర‌పున సీనియ‌ర్ అడ్వ‌కేట్ క‌పిల్ సిబ‌ల్ కోర్టులో వాదించ‌నున్నారు. జ‌స్టిస్ ఎన్‌వీ ర‌మ‌ణ బెంచ్ ఈ కేసును త‌క్ష‌ణ‌మే చేప‌ట్టాల‌ని ఆయ‌న పిటిష‌న్‌లో కోరారు. ఇదే బెంచ్‌లో జ‌స్టిస్ సంజీవ్ ఖ‌న్నా, కృష్ణ మురారీలు ఉన్నారు. అయితే చిదంబ‌రం పెట్టుకున్న అభ్య‌ర్థ‌న‌ను చీఫ్ జ‌స్టిస్‌కు పంప‌నున్నారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో విచార‌ణను ఎదుర్కొంటున్న చిదంబ‌రం ప్ర‌స్తుతం తీహార్ జైలులో ఉన్నారు. సెప్టెంబ‌ర్ 30వ తేదీన ఢిల్లీ హైకోర్టు బెయిల్ పిటిష‌న్‌ను తిర‌స్క‌రించింది. దీంతో చిదంబ‌రం సుప్రీంను ఆశ్ర‌యించారు.

Comments

Popular posts from this blog

అరటిపండ్లు తినడానికి ఏం తొందరపడుతున్నాయో... గోవులతో పవన్ కల్యాణ్ మురిపెం

జనసేనాని పవన్ కల్యాణ్ తీరిక సమయాల్లో హైదరాబాద్ శివార్లలోని తన ఫాంహౌస్ లో గడుపుతారన్న విషయం తెలిసిందే. పవన్ వ్యవసాయ క్షేత్రంలో మామిడి, ఇతర ఫల వృక్షాలు ఎన్నో దర్శనమిస్తాయి. అనేక రకాల కూరగాయలు కూడా పండిస్తారు. అంతేకాదు, పెద్ద సంఖ్యలో గోవులను కూడా పవన్ పోషిస్తున్నారు. అందుకోసం తన ఫాంహౌస్ లో గోశాల ఏర్పాటు చేశారు. ఇవాళ ఆయన తన వ్యవసాయ క్షేత్రంలో మొక్కలు నాటారు. ఈ క్రమంలో గోశాలను సందర్శించిన సందర్భంగా గోవులతో ఉల్లాసంగా గడిపారు. వాటికి అరటి పండ్లు తినిపిస్తూ మురిసిపోయారు. కొన్ని ఆవులు అరటిపండ్లు అందుకునేందుకు ఎంత తొందరపడుతున్నాయో అంటూ ట్విట్టర్ లో తన ఉత్సాహాన్ని పంచుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

Android ఫోన్లలో బ్యాంక్ అకౌంట్ వివరాలు దోచుకునే కొత్త మాల్వేర్ 'BlackRock' హడలెత్తిస్తోంది

Trojan కేటగిరికి చెందినదిగా చెబుతున్న 'BlackRock' అనే ఒక మాల్వేర్ Android స్మార్ట్ ఫోన్ల నుండి వినియోగదారుల విలువైన బ్యాంక్ సమాచారాన్ని సేకరిస్తున్నట్లు బయటపడింది. ఇప్పటి వరకూ పర్సనల్ డేటా చౌర్యానికి మాత్రమే పరిమితమైన సైబర్ దాడులు ఇప్పుడు ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ల నుండి బ్యాంక్ అకౌంట్ వివరాలు కూడా దోచుకునేంతగా ముందుకు సాగుతోంది. ఒక మాల్వేర్, బ్యాంక్ అకౌంట్ ఆధారాలను మరియు క్రెడిట్ కార్డు వాటి వాటి వివరాలను ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ల ద్వారా సేకరిస్తున్నట్లు మరియు ఇది దాదాపుగా 300 పైగా ఆండ్రాయిడ్ యాప్స్ పైన తాన్ ప్రభావాన్ని చూపిస్తున్నట్లు తెలిపింది. అసలే ప్రజలు కరోనా మహమ్మారితో దెబ్బకి హడలెత్తి పోతోంటే, ఆన్ లైన్ లో సైబర్ దాడులు మరియు సైబర్ మోసాలు మరింతగా కృంగదీస్తున్నాయి. ఇప్పటి వరకూ పర్సనల్ డేటా చౌర్యానికి మాత్రమే పరిమితమైన సైబర్ దాడులు ఇప్పుడు ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ల నుండి బ్యాంక్ అకౌంట్ వివరాలు కూడా దోచుకునేంతగా ముందుకు  సాగుతోంది. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఒక నివేదిక ప్రకారం,Trojan కేటగిరికి చెందినదిగా చెబుతున్న 'BlackRock' అనే ఒక మాల్వేర్ Android స...