Skip to main content

బెయిల్ కోసం సుప్రీంను ఆశ్ర‌యించిన చిదంబ‌రం

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఇవాళ‌ మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబ‌రం సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. చిదంబ‌రం త‌ర‌పున సీనియ‌ర్ అడ్వ‌కేట్ క‌పిల్ సిబ‌ల్ కోర్టులో వాదించ‌నున్నారు. జ‌స్టిస్ ఎన్‌వీ ర‌మ‌ణ బెంచ్ ఈ కేసును త‌క్ష‌ణ‌మే చేప‌ట్టాల‌ని ఆయ‌న పిటిష‌న్‌లో కోరారు. ఇదే బెంచ్‌లో జ‌స్టిస్ సంజీవ్ ఖ‌న్నా, కృష్ణ మురారీలు ఉన్నారు. అయితే చిదంబ‌రం పెట్టుకున్న అభ్య‌ర్థ‌న‌ను చీఫ్ జ‌స్టిస్‌కు పంప‌నున్నారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో విచార‌ణను ఎదుర్కొంటున్న చిదంబ‌రం ప్ర‌స్తుతం తీహార్ జైలులో ఉన్నారు. సెప్టెంబ‌ర్ 30వ తేదీన ఢిల్లీ హైకోర్టు బెయిల్ పిటిష‌న్‌ను తిర‌స్క‌రించింది. దీంతో చిదంబ‌రం సుప్రీంను ఆశ్ర‌యించారు.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.