ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఇవాళ మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. చిదంబరం తరపున సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ కోర్టులో వాదించనున్నారు. జస్టిస్ ఎన్వీ రమణ బెంచ్ ఈ కేసును తక్షణమే చేపట్టాలని ఆయన పిటిషన్లో కోరారు. ఇదే బెంచ్లో జస్టిస్ సంజీవ్ ఖన్నా, కృష్ణ మురారీలు ఉన్నారు. అయితే చిదంబరం పెట్టుకున్న అభ్యర్థనను చీఫ్ జస్టిస్కు పంపనున్నారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో విచారణను ఎదుర్కొంటున్న చిదంబరం ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. సెప్టెంబర్ 30వ తేదీన ఢిల్లీ హైకోర్టు బెయిల్ పిటిషన్ను తిరస్కరించింది. దీంతో చిదంబరం సుప్రీంను ఆశ్రయించారు.
సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటోన్న నేపథ్యంలో ఆయనకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. ఆయనకు మహేశ్ బాబుతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో పవన్ కల్యాణ్ అద్భుత విజయాలు సాధించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.
Comments
Post a Comment