ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఇవాళ మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. చిదంబరం తరపున సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ కోర్టులో వాదించనున్నారు. జస్టిస్ ఎన్వీ రమణ బెంచ్ ఈ కేసును తక్షణమే చేపట్టాలని ఆయన పిటిషన్లో కోరారు. ఇదే బెంచ్లో జస్టిస్ సంజీవ్ ఖన్నా, కృష్ణ మురారీలు ఉన్నారు. అయితే చిదంబరం పెట్టుకున్న అభ్యర్థనను చీఫ్ జస్టిస్కు పంపనున్నారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో విచారణను ఎదుర్కొంటున్న చిదంబరం ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. సెప్టెంబర్ 30వ తేదీన ఢిల్లీ హైకోర్టు బెయిల్ పిటిషన్ను తిరస్కరించింది. దీంతో చిదంబరం సుప్రీంను ఆశ్రయించారు.
నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.
Comments
Post a Comment