ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఇవాళ మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. చిదంబరం తరపున సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ కోర్టులో వాదించనున్నారు. జస్టిస్ ఎన్వీ రమణ బెంచ్ ఈ కేసును తక్షణమే చేపట్టాలని ఆయన పిటిషన్లో కోరారు. ఇదే బెంచ్లో జస్టిస్ సంజీవ్ ఖన్నా, కృష్ణ మురారీలు ఉన్నారు. అయితే చిదంబరం పెట్టుకున్న అభ్యర్థనను చీఫ్ జస్టిస్కు పంపనున్నారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో విచారణను ఎదుర్కొంటున్న చిదంబరం ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. సెప్టెంబర్ 30వ తేదీన ఢిల్లీ హైకోర్టు బెయిల్ పిటిషన్ను తిరస్కరించింది. దీంతో చిదంబరం సుప్రీంను ఆశ్రయించారు.
జనసేనాని పవన్ కల్యాణ్ తీరిక సమయాల్లో హైదరాబాద్ శివార్లలోని తన ఫాంహౌస్ లో గడుపుతారన్న విషయం తెలిసిందే. పవన్ వ్యవసాయ క్షేత్రంలో మామిడి, ఇతర ఫల వృక్షాలు ఎన్నో దర్శనమిస్తాయి. అనేక రకాల కూరగాయలు కూడా పండిస్తారు. అంతేకాదు, పెద్ద సంఖ్యలో గోవులను కూడా పవన్ పోషిస్తున్నారు. అందుకోసం తన ఫాంహౌస్ లో గోశాల ఏర్పాటు చేశారు. ఇవాళ ఆయన తన వ్యవసాయ క్షేత్రంలో మొక్కలు నాటారు. ఈ క్రమంలో గోశాలను సందర్శించిన సందర్భంగా గోవులతో ఉల్లాసంగా గడిపారు. వాటికి అరటి పండ్లు తినిపిస్తూ మురిసిపోయారు. కొన్ని ఆవులు అరటిపండ్లు అందుకునేందుకు ఎంత తొందరపడుతున్నాయో అంటూ ట్విట్టర్ లో తన ఉత్సాహాన్ని పంచుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
Comments
Post a Comment