Skip to main content

అలా మాట్లాడే నైతికహక్కు చంద్రబాబుకు లేదు: ధర్మాన ప్రసాదరావు

 

 ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు, ఆయన అనుకూల మీడియా, ఆయన తాబేదారులు, కొంతమంది సహచరులు కలసి, ఏపీలో పత్రికాస్వేచ్ఛ నశించిపోయిందని మాట్లాడుతున్నారని వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. శ్రీకాకుళంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈవిధంగా మాట్లాడే నైతికహక్కు చంద్రబాబుకు లేదని భావిస్తున్నట్టు చెప్పారు.

గడచిన ఐదేళ్లలో బాబు పాలన చూశామని, అనేక చట్టాలను మోసగించి, కోర్టులకు దొరకకుండా, ఎత్తుగడలతో ప్రజాధనాన్ని దోచుకున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. తన తాబేదారులకు, అనుకూలమైన సంస్థలకు చంద్రబాబు దోచిపెట్టిన విషయం బహిరంగ రహస్యం అన్నారు. ఆనాడు తనకు అనుకూలంగా ఉన్న అనేక పత్రికలను అడ్డంపెట్టుకుని అనేక మంది జీవితాలతో ఆడుకున్నారని, రాజకీయంగా పతనం చేయాలని, రాజకీయపార్టీలను సర్వనాశనం చేయాలని చూశారని చంద్రబాబుపై ధ్వజమెత్తారు.

వైసీపీ ప్రభుత్వ నాలుగు నెలల పాలనలో ప్రజాస్వామ్యం లేదని, పత్రికా స్వేచ్ఛ హరించుకుపోయిందని, ఈ రాష్ట్రంలో గూండాయిజం సాగుతోందని, బీహార్ లా అయిపోయిందని మాట్లాడుతున్న చంద్రబాబు, నాడు తన పాలన ఎలా సాగిందో ఆయన చూసుకున్నారా? టీడీపీ హయాంలో రాష్ట్రం ఎంత అప్రతిష్టపాలైందో, ఎంత ధనం దోపిడీ అయిపోయిందో, ఎన్ని వ్యవస్థలను నాశనం చేశారో అంటూ ఆరోపణలు గుప్పించారు.   

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...