Skip to main content

కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరిన యువకుడు.. స్కాన్ చేసి ఆశ్చర్యపోయిన వైద్యులు

కడుపు నొప్పితో విలవిల్లాడుతూ ఆసుపత్రిలో చేరిన ఓ యువకుడికి పరీక్షలు చేసిన వైద్యులు ఆశ్చర్యపోయారు. అతడి శరీరంలోని చాలా అవయవాలు వాటివాటి స్థానాల్లో కాకుండా వేరే ప్రాంతంలో ఉండడం వారిని షాక్‌కు గురిచేసింది. ఉత్తరప్రదేశ్‌లోని కుషినగర్‌ పాద్రౌనాలో జరిగిందీ ఘటన.

జమాలుద్దీన్ ఇటీవల కడుపు నొప్పితో బాధపడుతూ గోరఖ్‌పూర్‌లోని ఓ ఆసుపత్రిలో చేరాడు. అక్కడ అతడిని పరీక్షించిన వైద్యులు ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్ పరీక్షలు చేశారు. ఆయా రిపోర్టులను పరిశీలించిన వైద్యులు ఒక్కసారిగా షాకయ్యారు. అతడి గుండె కుడివైపు, కాలేయం ఎడమవైపున ఉండడం చూసి ఆశ్చర్యపోయారు. అంతేకాదు, చాలావరకు భాగాలు నిర్ధారిత స్థానాల్లో కాకుండా వేర్వేరు చోట్ల ఉండడంతో విస్తుపోయారు.

జమాలుద్దీన్ పిత్తాశయంలో రాళ్లు ఉన్నట్టు గుర్తించి శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించామని అయితే, అది అందరికీ భిన్నంగా ఎడమ వైపున ఉండడంతో ఆపరేషన్ చాలా కష్టమైందని వైద్యుడు శశాంక్ దీక్షిత్ తెలిపారు. మూడు రకాల ల్యాప్రోస్కోపిక్ యంత్రాలను ఉపయోగించి ఆపరేషన్ చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఇలాంటి కేసును చూడడం తన కెరియర్‌లో ఇదే తొలిసారని తెలిపారు.

Comments

Popular posts from this blog

అంబులెన్స్‌కు దారి ఇచ్చిన సీఎం కాన్వాయ్...‌

వీడియో చూడండి : Click here ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాహన శ్రేణి అంబులెన్స్‌కు దారిఇచ్చింది. పులివెందుల నుంచి తిరిగివచ్చిన సీఎం గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి నివాసానికి బయల్దేరారు. గూడవల్లి నిడమానూరు మధ్య ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని తరలిస్తున్న అబులెన్స్‌కు దారి ఇచ్చారు. ఉయ్యూరు నుంచి గన్నవరం బైక్‌పైవెళ్తున్న చాపర్తిన శేఖర్‌ అనే వ్యక్తి ఉషారామ ఇంజినీరింగ్‌కాలేజీ సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. అతన్ని నేషనల్‌ హైవే అంబులెన్స్‌ ద్వారా విజయవాడ ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలిస్తుండగా, దీనికి ముందు ఉన్న ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పక్కకు తొలగి అంబులెన్స్‌కు దారి ఇచ్చింది.

మరోసారి రంగంలోకి దిగిన ధర్మాడి సత్యం... ఓ చిన్నారి కోసం అన్వేషణ!

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో దీప్తిశ్రీ అనే ఏడేళ్ల చిన్నారి అదృశ్యం కావడం సంచలనం సృష్టించింది. దీప్తిశ్రీని  హత్యచేసి ఇంద్రపాలెం వద్ద ఉప్పుటేరులో పడవేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. అమె సవతి తల్లి శాంతకుమారి ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటుందని దీప్తిశ్రీ బంధువులు ఆరోపిస్తున్నారు. ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించడంతో కీలక సమాచారం అందజేసినట్టు తెలుస్తోంది. శాంతకుమారి ఇచ్చిన సమాచారం ఆధారంగా ఇంద్రపాలెం లాకుల వద్ద దీప్తిశ్రీ మృతదేహం కోసం గాలింపు చేపట్టారు. అందుకోసం పోలీసులు ధర్మాడి సత్యం బృందం సాయం కోరారు. ఇటీవలే గోదావరి నదిలో బోటును వెలికితీసిన ధర్మాడి సత్యం ఓ చిన్నారి కోసం వెంటనే స్పందించారు. తన బృందంతో ఉప్పుటేరులో గాలింపు చేపట్టారు. అయితే, 30 గంటలు గడిచిన తర్వాతే మృతదేహం నీటిపై తేలుతుందని, ఈలోపు తమ ప్రయత్నాలు కొనసాగిస్తామని ధర్మాడి సత్యం తెలిపారు.