Skip to main content

పుష్కరిణిలో వైభవంగా చక్రస్నానం... ముగిసిన తిరుమల బ్రహ్మోత్సవాలు

 తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు నేటితో ముగిశాయి. బ్రహ్మోత్సవాల్లో చివరి రోజున ఆగమోక్తంగా చక్రస్నాన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయం నుంచి ఉభయ దేవేరులతో కూడిన మలయప్పస్వామి, చక్రత్తాళ్వార్‌ లను పల్లకిలో వరాహస్వామి ఆలయానికి చేర్చిన పూజారులు, ఉదయం 7 గంటల నుంచి ఉత్సవ మూర్తులకు స్నపన తిరుమంజనాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆపై చక్రత్తాళ్వార్‌ ను అర్చకులు పుష్కరిణిలో మూడు మునకలు వేయించారు. 

ఈ కార్యక్రమంలో పలువురు టీటీడీ అధికారులు, ప్రముఖులతో పాటు వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఈ సాయంత్రం బంగారు తిరుచ్చిపై శ్రీవారు విహరించనున్నారు. రాత్రి 7 గంటలకు ధ్వజావరోహణంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు అధికారికంగా ముగియనున్నాయి. కాగా, రేపటి నుంచి ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలను పునరుద్ధరిస్తున్నట్టు టీటీడీ ఓ ప్రకటనలో పేర్కొంది. బ్రహ్మోత్సవాలు జరిగినన్ని రోజులూ భక్తులు ఎంతో సహకరించారని తెలిపింది.   

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...