Skip to main content

నువ్వు గంభీర్ కెరీర్ ముగించావా? మరి నీ కెరీర్ ఎవరు ముగించారో తెలుసా?: పాక్ బౌలర్ ను ఆటాడుకుంటున్న నెటిజన్లు

టీమిండియా క్రికెటర్ గౌతమ్ గంభీర్ కెరీర్ ను తానే ముగించానని, తన బౌలింగ్ అంటే గంభీర్ జడుసుకునేవాడని, చివరికి తనను సూటిగా చూడ్డానికే భయపడేవాడని పాకిస్థాన్ క్రికెటర్ మహ్మద్ ఇర్ఫాన్ కోతలు కోసిన సంగతి తెలిసిందే. దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు భారీగా ట్రోలింగ్ మొదలుపెట్టారు. "అసలింతకీ ఈ ఇర్ఫాన్ ఎవరో తెలియడంలేదే, అతని కోసం గూగుల్ లో వెతకాలనుకుంటా!" అంటూ సెటైర్లు గుప్పిస్తున్నారు.

"నువ్వు గంభీర్ కెరీర్ ముగించావా? మరి నీ కెరీర్ ముగించింది ఎవరో తెలుసా?... నువ్వే. నీ కెరీర్ కు నువ్వే ముగింపు పలికావు. మ్యాచ్ ఫిక్సర్లు నిన్ను నాలుగు సార్లు కలిసినా మీ క్రికెట్ బోర్డుకు సమాచారం అందించలేదు. తప్పు చేశావు. అందుకే నిన్ను నాలుగేళ్ల పాటు నిషేధించారు. గంభీర్ ఓ వరల్డ్ కప్ విన్నర్. మరి నువ్వు, ఓ అవినీతిపరుడివి" అంటూ నెటిజన్లు ఘాటుగా విమర్శించారు.

అసలు, గంభీర్ పై ఇర్ఫాన్ స్పందించడానికి కారణం అఫ్రిది! భారత్ పై విషం చిమ్మడానికి ముందుండే అఫ్రిదీని ఇటీవలే గంభీర్ తీవ్రంగా విమర్శించాడు. అందువల్లే గంభీర్ పై ఇర్ఫాన్ అవాకులుచెవాకులు పేలినట్టు అర్థమవుతోంది.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...