Skip to main content

నువ్వు గంభీర్ కెరీర్ ముగించావా? మరి నీ కెరీర్ ఎవరు ముగించారో తెలుసా?: పాక్ బౌలర్ ను ఆటాడుకుంటున్న నెటిజన్లు

టీమిండియా క్రికెటర్ గౌతమ్ గంభీర్ కెరీర్ ను తానే ముగించానని, తన బౌలింగ్ అంటే గంభీర్ జడుసుకునేవాడని, చివరికి తనను సూటిగా చూడ్డానికే భయపడేవాడని పాకిస్థాన్ క్రికెటర్ మహ్మద్ ఇర్ఫాన్ కోతలు కోసిన సంగతి తెలిసిందే. దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు భారీగా ట్రోలింగ్ మొదలుపెట్టారు. "అసలింతకీ ఈ ఇర్ఫాన్ ఎవరో తెలియడంలేదే, అతని కోసం గూగుల్ లో వెతకాలనుకుంటా!" అంటూ సెటైర్లు గుప్పిస్తున్నారు.

"నువ్వు గంభీర్ కెరీర్ ముగించావా? మరి నీ కెరీర్ ముగించింది ఎవరో తెలుసా?... నువ్వే. నీ కెరీర్ కు నువ్వే ముగింపు పలికావు. మ్యాచ్ ఫిక్సర్లు నిన్ను నాలుగు సార్లు కలిసినా మీ క్రికెట్ బోర్డుకు సమాచారం అందించలేదు. తప్పు చేశావు. అందుకే నిన్ను నాలుగేళ్ల పాటు నిషేధించారు. గంభీర్ ఓ వరల్డ్ కప్ విన్నర్. మరి నువ్వు, ఓ అవినీతిపరుడివి" అంటూ నెటిజన్లు ఘాటుగా విమర్శించారు.

అసలు, గంభీర్ పై ఇర్ఫాన్ స్పందించడానికి కారణం అఫ్రిది! భారత్ పై విషం చిమ్మడానికి ముందుండే అఫ్రిదీని ఇటీవలే గంభీర్ తీవ్రంగా విమర్శించాడు. అందువల్లే గంభీర్ పై ఇర్ఫాన్ అవాకులుచెవాకులు పేలినట్టు అర్థమవుతోంది.

Comments

Popular posts from this blog

బలపరీక్ష ఎప్పుడు నిర్వహించినా సిద్ధం.. తమ ఎమ్మెల్యేలను హోటళ్లకు తరలించిన శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్

మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు తమ ఎమ్మెల్యేలను ముంబయిలోని పలు లగ్జరీ హోటళ్లకు తరలించాయి. తమ పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభాలకు గురి చేయకుండా ఉండేందుకు ఆ పార్టీల అగ్రనేతలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అసెంబ్లీలో బీజేపీ బలనిరూపణ ఏ రోజు జరిగినా దానికి హాజరయ్యేందుకు సిద్ధంగా ఉండాలని ఆ మూడు పార్టీలు భావిస్తున్నాయి. ముంబయిలోని పోవైలో ఉన్న ఓ హోటల్ కు నిన్న రాత్రే ఎన్సీపీ ఎమ్మెల్యేలు బస్సుల్లో చేరుకున్నారు. శివసేన నుంచి 56 మంది నేతలు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన విషయం తెలిసిందే. వారిలో 55 మంది  అధేరీలో ఉన్న ఓ హోటల్ లో ఉన్నారు. అలాగే, వారి నుంచి ఆ పార్టీ అధిష్ఠానం సెల్ ఫోన్ లను తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ తమ 44 మంది ఎమ్మెల్యేలను మరో హోటల్ కి తరలించింది. అలాగే, శివసేన ఎమ్మెల్యేలు ఉన్న హోటల్ లోనే ఎనిమిది మంది స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా ఉన్నారని ఇండిపెండెంట్ ఎమ్మెల్యే రాజ్ కుమార్ పటేల్ మీడియాకు చెప్పారు. 

రామమందిర నిర్మాణానికి ముహూర్తం ఖరారు: బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ముహూర్తం ఖరారయ్యిందన్నట్లు మాట్లాడి ఓ బీజేపీ ఎమ్మెల్యే సంచలనానికి తెరతీశారు. నవంబరు 18వ తేదీన నిర్మాణం ప్రారంభమవుతుందంటూ డేట్‌ కూడా ఫిక్స్‌ చేసేశారు. ప్రస్తుతం ఈ వివాదం కోర్టు పరిధిలో వుంది. రామాలయ నిర్మాణం విషయంలో శుభవార్త వింటారని ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ రెండు రోజుల క్రితమే వ్యాఖ్యానించారు. ఈ సమయంలో ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే...రాజస్థాన్‌ రాష్ట్రం పాలి జిల్లా కేంద్రంలో జరిగిన రాంలీలా కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే గైన్‌చంద్‌ పరఖ్‌ మాట్లాడారు. సుప్రీం కోర్టులో విచారణ జరుగుతున్న రామజన్మభూమి కేసు నవంబరు 17వ తేదీ నాటికి కొలిక్కి వస్తుందని, 18వ తేదీన రామమందిర నిర్మాణం మొదలవుతుందని చెప్పారు. బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై ఆసక్తికర చర్చ సాగుతోంది.