Skip to main content

నువ్వు గంభీర్ కెరీర్ ముగించావా? మరి నీ కెరీర్ ఎవరు ముగించారో తెలుసా?: పాక్ బౌలర్ ను ఆటాడుకుంటున్న నెటిజన్లు

టీమిండియా క్రికెటర్ గౌతమ్ గంభీర్ కెరీర్ ను తానే ముగించానని, తన బౌలింగ్ అంటే గంభీర్ జడుసుకునేవాడని, చివరికి తనను సూటిగా చూడ్డానికే భయపడేవాడని పాకిస్థాన్ క్రికెటర్ మహ్మద్ ఇర్ఫాన్ కోతలు కోసిన సంగతి తెలిసిందే. దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు భారీగా ట్రోలింగ్ మొదలుపెట్టారు. "అసలింతకీ ఈ ఇర్ఫాన్ ఎవరో తెలియడంలేదే, అతని కోసం గూగుల్ లో వెతకాలనుకుంటా!" అంటూ సెటైర్లు గుప్పిస్తున్నారు.

"నువ్వు గంభీర్ కెరీర్ ముగించావా? మరి నీ కెరీర్ ముగించింది ఎవరో తెలుసా?... నువ్వే. నీ కెరీర్ కు నువ్వే ముగింపు పలికావు. మ్యాచ్ ఫిక్సర్లు నిన్ను నాలుగు సార్లు కలిసినా మీ క్రికెట్ బోర్డుకు సమాచారం అందించలేదు. తప్పు చేశావు. అందుకే నిన్ను నాలుగేళ్ల పాటు నిషేధించారు. గంభీర్ ఓ వరల్డ్ కప్ విన్నర్. మరి నువ్వు, ఓ అవినీతిపరుడివి" అంటూ నెటిజన్లు ఘాటుగా విమర్శించారు.

అసలు, గంభీర్ పై ఇర్ఫాన్ స్పందించడానికి కారణం అఫ్రిది! భారత్ పై విషం చిమ్మడానికి ముందుండే అఫ్రిదీని ఇటీవలే గంభీర్ తీవ్రంగా విమర్శించాడు. అందువల్లే గంభీర్ పై ఇర్ఫాన్ అవాకులుచెవాకులు పేలినట్టు అర్థమవుతోంది.

Comments

Popular posts from this blog

అత్యంత కష్టం మీద బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం బృందం

నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

మీడియాపై మాకు గౌరవముంది: కోటంరెడ్డి

  కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ పాలనపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మీడియాపై తమకు గౌరవం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. జీవో 2430 కొత్తగా తీసుకొచ్చింది కాదని, ఎప్పటినుంచో అది ఉందని తెలిపారు.  ఈ రోజు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్ని పత్రికలు, ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు వార్తలతో అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలని పేర్కొన్నారు. ఒకప్పుడు సాక్షి మీడియాను చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నేతలు ఎటుపోయారని నిలదీశారు. లోకేశ్ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మంగళగిరి నియోజక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేశ్ కు తెలియదని విమర్శించారు. తమ పాలనను చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, తన హయాంలో తన కొడుకు లోకేశ్ తో కలిసి దోచుకుని లోటు బడ్జెట్ ను చూపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని చెప్పారు.  చంద్రబాబుకు చదువుకునేటప్పటి నుంచే కులపిచ్చి ఉందని పేర్కొన్నారు. స్థాని...