Skip to main content

నువ్వు గంభీర్ కెరీర్ ముగించావా? మరి నీ కెరీర్ ఎవరు ముగించారో తెలుసా?: పాక్ బౌలర్ ను ఆటాడుకుంటున్న నెటిజన్లు

టీమిండియా క్రికెటర్ గౌతమ్ గంభీర్ కెరీర్ ను తానే ముగించానని, తన బౌలింగ్ అంటే గంభీర్ జడుసుకునేవాడని, చివరికి తనను సూటిగా చూడ్డానికే భయపడేవాడని పాకిస్థాన్ క్రికెటర్ మహ్మద్ ఇర్ఫాన్ కోతలు కోసిన సంగతి తెలిసిందే. దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు భారీగా ట్రోలింగ్ మొదలుపెట్టారు. "అసలింతకీ ఈ ఇర్ఫాన్ ఎవరో తెలియడంలేదే, అతని కోసం గూగుల్ లో వెతకాలనుకుంటా!" అంటూ సెటైర్లు గుప్పిస్తున్నారు.

"నువ్వు గంభీర్ కెరీర్ ముగించావా? మరి నీ కెరీర్ ముగించింది ఎవరో తెలుసా?... నువ్వే. నీ కెరీర్ కు నువ్వే ముగింపు పలికావు. మ్యాచ్ ఫిక్సర్లు నిన్ను నాలుగు సార్లు కలిసినా మీ క్రికెట్ బోర్డుకు సమాచారం అందించలేదు. తప్పు చేశావు. అందుకే నిన్ను నాలుగేళ్ల పాటు నిషేధించారు. గంభీర్ ఓ వరల్డ్ కప్ విన్నర్. మరి నువ్వు, ఓ అవినీతిపరుడివి" అంటూ నెటిజన్లు ఘాటుగా విమర్శించారు.

అసలు, గంభీర్ పై ఇర్ఫాన్ స్పందించడానికి కారణం అఫ్రిది! భారత్ పై విషం చిమ్మడానికి ముందుండే అఫ్రిదీని ఇటీవలే గంభీర్ తీవ్రంగా విమర్శించాడు. అందువల్లే గంభీర్ పై ఇర్ఫాన్ అవాకులుచెవాకులు పేలినట్టు అర్థమవుతోంది.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.