Skip to main content

అందుకే మినహాయింపు కోరుతున్నా: జగన్‌

అందుకే మినహాయింపు కోరుతున్నా: జగన్‌
అక్రమాస్తుల కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ ఏపీ సీఎం జగన్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై నాంపల్లి సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. కౌంటర్‌ దాఖలు చేసిన సమయంలో సీబీఐ వాడిన  భాషతీరుపై జగన్‌ తరఫు న్యాయవాది తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఊహాజనిత ఆరోపణలతో పిటిషన్‌కు సంబంధం లేని అంశాలను సీబీఐ తన కౌంటర్‌లో ప్రస్తావించిందని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరినట్లు జగన్‌ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. తాను హాజరుకాకపోతే విచారణలో జాప్యం ఎలా జరుగుతుందో సీబీఐ తెలపాలన్నారు. గత ఆరేళ్లలో ఎన్నడూ కేసుల వాయిదా కోరలేదని.. స్టే కూడా అడగలేదన్నారు.
గతంలో పాదయాత్ర కోసం మినహాయింపు కోరితే.. రాజకీయ అవసరాల కోసం ఇవ్వలేమని హైకోర్టు చెప్పిందని జగన్‌ గుర్తు చేశారు. అసౌకర్యంగా ఉందని హాజరు మినహాయింపు కోరడం లేదని.. సీఎంగా పరిపాలన చేయాల్సిన రాజ్యాంగబద్ధమైన బాధ్యత తనపై ఉందన్నారు. ప్రజల విస్తృత ప్రయోజనాల కోసమే హాజరు మినహాయింపు కోరుతున్నానని న్యాయస్థానానికి వివరించారు. సాక్షులను ప్రభావితం చేసినట్లు ఆరేళ్లలో ఒక్క ఆరోపణ అయినా ఉందా అని జగన్‌ ప్రశ్నించారు. అనంతరం సీబీఐ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. గతంలో అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే సీబీఐ కోర్టు, హైకోర్టు జగన్‌కు వ్యక్తిగత హాజరు మినహాయింపును నిరాకరించాయన్నారు. జగన్ హోదా మినహా కేసు పరిస్థితుల్లో ఎలాంటి మార్పులు లేవన్నారు. అవసరం ఉన్నప్పుడు పిటిషన్ వేసి ఆ ఒక్క రోజుకు హాజరు మినహాయింపు తీసుకుంటూనే ఉన్నారని.. ఇప్పుడు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వొద్దని న్యాయస్థానాన్ని సీబీఐ కోరింది. ఇరువర్గాల వాదనలు విన్న సీబీఐ న్యాయస్థానం..తీర్పును నవంబర్‌ 1కి వాయిదా వేసింది.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...