తన భద్రత విషయంలో ఏపీ టీడీపీ నేత పరిటాల సునీత హైకోర్టును ఆశ్రయించారు. ఏపీ
ప్రభుత్వం తన వ్యక్తిగత భద్రతను తగ్గించిందని ఆరోపిస్తూ ఓ పిటిషన్ దాఖలు
చేశారు. 2 ప్లస్ 2 భద్రతను 1 ప్లస్ 1కు తగ్గించారని పిటిషన్ లో
పేర్కొన్నారు. తన ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ దృష్ట్యా 2 ప్లస్ 2 భద్రత
కొనసాగించాలని కోరారు.
నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.
Comments
Post a Comment