తన భద్రత విషయంలో ఏపీ టీడీపీ నేత పరిటాల సునీత హైకోర్టును ఆశ్రయించారు. ఏపీ
ప్రభుత్వం తన వ్యక్తిగత భద్రతను తగ్గించిందని ఆరోపిస్తూ ఓ పిటిషన్ దాఖలు
చేశారు. 2 ప్లస్ 2 భద్రతను 1 ప్లస్ 1కు తగ్గించారని పిటిషన్ లో
పేర్కొన్నారు. తన ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ దృష్ట్యా 2 ప్లస్ 2 భద్రత
కొనసాగించాలని కోరారు.
బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Comments
Post a Comment