Skip to main content

భవిష్యత్తులో రైళ్లలోనూ వైఫై: పీయూష్ గోయల్

 


భవిష్యత్తులో రైళ్లలోనూ వైఫై సదుపాయం కల్పిస్తామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ... 'ఇది చాలా క్లిష్టమైన సాంకేతికతకు సంబంధించిన విషయం. ఇందుకోసం విదేశీ సాంకేతికత, పెట్టుబడులు అవసరం అవుతాయి. కదులుతోన్న రైళ్లలో వైఫై అందించడానికి పెట్టుబడులతో పాటు టవర్ల ఏర్పాటు, ఇందుకు తగ్గ సామగ్రి అవసరం ఉంటుంది' అని చెప్పారు.

'అయితే, రైళ్లలో వైఫై తీసుకొస్తే భద్రత పరంగానూ చాలా ప్రయోజనాలు ఉంటాయి. ప్రతి కంపార్ట్ మెంట్ లోని సీసీటీవీ కెమెరాల ద్వారా పోలీస్ స్టేషన్ లకు లైవ్ ఫీడ్ అందుతుంది. వైఫై ద్వారా ఇందుకు కావాల్సిన సిగ్నలింగ్ వ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. మరో నాలుగున్నరేళ్లలో రైళ్లలో వైఫై సదుపాయం అందిస్తాం. ప్రస్తుతం దేశంలోని 5,150 రైల్వే స్టేషన్లలో వైఫై సేవలు అందుతున్నాయి. ఈ ఏడాది చివరిలోగా ఈ సంఖ్యను 6,500కు పెంచడానికి ప్రయత్నిస్తున్నాం' అని గోయల్ తెలిపారు.

'ప్రయివేటు సంస్థల ద్వారా రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ పనులను కొనసాగిస్తున్నాం. భోపాల్ లో ఇటువంటి విధానాన్నే అమలు చేస్తున్నాం. అక్కడి రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులు ముగింపు దశకు చేరుకున్నాయి. దేశంలోని 13 రైల్వే స్టేషన్ల పరిధిలో ఆధునికీకరణ, షాపింగ్ మాల్స్ వంటి వాటిని అభివృద్ధి చేయడం కోసం నేషనల్ బిల్డింగ్స్ కన్స్ స్ట్రక్షన్ కార్పొరేషన్ లిమిటెడ్ కూడా పని చేస్తోంది. ఈ ప్రక్రియ విజయవంతమైతే దేశ మంతటా వేగవంతంగా ఈ విధానాన్ని అమలు చేస్తాం. ఈ పనుల్లో ప్రైవేటు రంగంతో కలిసి పని చేసే అవకాశాలు అధికంగా ఉన్నాయి' అని పీయూష్ గోయల్ అన్నారు.

'దేశంలోని చాలా ప్రాంతాల్లో రైల్వే భూములకు భవిష్యత్తులో డిమాండ్ అధికంగా ఉంటుంది. రైల్వే భూములను సౌర విద్యుత్తు ఉత్పత్తి కోసం అధికంగా వినియోగిస్తాం. ప్రధాని మోదీ నాయకత్వంలో పనులు కొనసాగిస్తూ, భారత రైల్వేను ప్రపంచంలోనే కర్బన ఉద్గారాల వినియోగం లేని తొలి రైల్వే వ్యవస్థగా తీర్చిదిద్దుతాం. అలాగే, రైల్వే భూములను పారిశ్రామిక పార్కుల కోసం వినియోగించాలని ప్రణాళికలు వేసుకుంటున్నాం' అని గోయల్ వివరించారు.      

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...