Skip to main content

భవిష్యత్తులో రైళ్లలోనూ వైఫై: పీయూష్ గోయల్

 


భవిష్యత్తులో రైళ్లలోనూ వైఫై సదుపాయం కల్పిస్తామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ... 'ఇది చాలా క్లిష్టమైన సాంకేతికతకు సంబంధించిన విషయం. ఇందుకోసం విదేశీ సాంకేతికత, పెట్టుబడులు అవసరం అవుతాయి. కదులుతోన్న రైళ్లలో వైఫై అందించడానికి పెట్టుబడులతో పాటు టవర్ల ఏర్పాటు, ఇందుకు తగ్గ సామగ్రి అవసరం ఉంటుంది' అని చెప్పారు.

'అయితే, రైళ్లలో వైఫై తీసుకొస్తే భద్రత పరంగానూ చాలా ప్రయోజనాలు ఉంటాయి. ప్రతి కంపార్ట్ మెంట్ లోని సీసీటీవీ కెమెరాల ద్వారా పోలీస్ స్టేషన్ లకు లైవ్ ఫీడ్ అందుతుంది. వైఫై ద్వారా ఇందుకు కావాల్సిన సిగ్నలింగ్ వ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. మరో నాలుగున్నరేళ్లలో రైళ్లలో వైఫై సదుపాయం అందిస్తాం. ప్రస్తుతం దేశంలోని 5,150 రైల్వే స్టేషన్లలో వైఫై సేవలు అందుతున్నాయి. ఈ ఏడాది చివరిలోగా ఈ సంఖ్యను 6,500కు పెంచడానికి ప్రయత్నిస్తున్నాం' అని గోయల్ తెలిపారు.

'ప్రయివేటు సంస్థల ద్వారా రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ పనులను కొనసాగిస్తున్నాం. భోపాల్ లో ఇటువంటి విధానాన్నే అమలు చేస్తున్నాం. అక్కడి రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులు ముగింపు దశకు చేరుకున్నాయి. దేశంలోని 13 రైల్వే స్టేషన్ల పరిధిలో ఆధునికీకరణ, షాపింగ్ మాల్స్ వంటి వాటిని అభివృద్ధి చేయడం కోసం నేషనల్ బిల్డింగ్స్ కన్స్ స్ట్రక్షన్ కార్పొరేషన్ లిమిటెడ్ కూడా పని చేస్తోంది. ఈ ప్రక్రియ విజయవంతమైతే దేశ మంతటా వేగవంతంగా ఈ విధానాన్ని అమలు చేస్తాం. ఈ పనుల్లో ప్రైవేటు రంగంతో కలిసి పని చేసే అవకాశాలు అధికంగా ఉన్నాయి' అని పీయూష్ గోయల్ అన్నారు.

'దేశంలోని చాలా ప్రాంతాల్లో రైల్వే భూములకు భవిష్యత్తులో డిమాండ్ అధికంగా ఉంటుంది. రైల్వే భూములను సౌర విద్యుత్తు ఉత్పత్తి కోసం అధికంగా వినియోగిస్తాం. ప్రధాని మోదీ నాయకత్వంలో పనులు కొనసాగిస్తూ, భారత రైల్వేను ప్రపంచంలోనే కర్బన ఉద్గారాల వినియోగం లేని తొలి రైల్వే వ్యవస్థగా తీర్చిదిద్దుతాం. అలాగే, రైల్వే భూములను పారిశ్రామిక పార్కుల కోసం వినియోగించాలని ప్రణాళికలు వేసుకుంటున్నాం' అని గోయల్ వివరించారు.      

Comments

Popular posts from this blog

అత్యంత కష్టం మీద బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం బృందం

నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

మీడియాపై మాకు గౌరవముంది: కోటంరెడ్డి

  కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ పాలనపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మీడియాపై తమకు గౌరవం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. జీవో 2430 కొత్తగా తీసుకొచ్చింది కాదని, ఎప్పటినుంచో అది ఉందని తెలిపారు.  ఈ రోజు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్ని పత్రికలు, ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు వార్తలతో అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలని పేర్కొన్నారు. ఒకప్పుడు సాక్షి మీడియాను చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నేతలు ఎటుపోయారని నిలదీశారు. లోకేశ్ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మంగళగిరి నియోజక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేశ్ కు తెలియదని విమర్శించారు. తమ పాలనను చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, తన హయాంలో తన కొడుకు లోకేశ్ తో కలిసి దోచుకుని లోటు బడ్జెట్ ను చూపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని చెప్పారు.  చంద్రబాబుకు చదువుకునేటప్పటి నుంచే కులపిచ్చి ఉందని పేర్కొన్నారు. స్థాని...