Skip to main content

అమరావతిలో రాజధాని కడతారా?లేదా?:పవన్‌

అమరావతిలో రాజధాని కడతారా?లేదా?:పవన్‌
రాష్ట్రంలో ఇసుక కొరత సమస్యతో లక్షలాది మంది కార్మికులు పనుల్లేక బాధపడుతున్నారని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఆవేదన వ్యక్తంచేశారు. వైకాపా ప్రభుత్వం కొత్తగా ఉద్యోగాలు ఇవ్వాలి గానీ ఉన్న ఉద్యోగాలను తీసేయకూడదని అన్నారు. అసలు అమరావతిలో రాజధాని కడతారా? లేదా? స్పష్టం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శుక్రవారం ఆయన్ను ఇసుక లారీ యజమానులు కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పవన్‌  మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ పనితీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇసుక సరఫరా పునరుద్ధరణ జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు. ఇసుక లారీల యజమానులు తనను కలిసి బాధపడ్డారనీ.. ఇసుక రవాణా ఆగిపోయి అనేక ఇబ్బందులు పడుతున్నామని వాపోయారని వెల్లడించారు. ప్రభుత్వ విధానం వల్ల తమ కుటుంబాలు వీధిన పడ్డాయని ఆవేదన చెందుతున్నారని పవన్‌ తెలిపారు. ఇసుక కొరత ప్రభావం అన్ని వర్గాల ప్రజలపైనా ఉందన్నారు. భవన నిర్మాణ కార్మికులను ఆదుకొనేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని జనసేనాని స్పష్టంచేశారు. ప్రభుత్వ పరిపాలన తీరు చాలా బాధను కల్గిస్తోందన్నారు. ప్రజల సమస్యల్ని దృష్టిలో పెట్టుకొని స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ఇసుక ఆన్‌లైన్‌ బుకింగ్‌ అర్ధరాత్రి పూటే ఎందుకు? అని ప్రశ్నించారు.  
అమరావతిలో రాజధాని కడతారా?లేదా?:పవన్‌
రాజధాని ఉందో, లేదో తెలియదు.. బొత్స వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు..
‘‘రాయలసీమ నుంచి లాయర్లు వచ్చి కలిశారు. హైకోర్టు తమ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని అడుగుతున్నారు. రాయలసీమ నుంచే ఎక్కువ మంది సీఎంలు వచ్చారు. రాష్ట్ర విభజన దగ్గర నుంచి ఇప్పటిదాకా సమస్యలు తీరలేదు. రాజధాని ఉందో లేదో తెలియదు. మంత్రి బొత్స వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. కోపాలు, తాపాలు ఉంటే రాజకీయాల్లో చూసుకోండి. మీ నిర్ణయాల వెనుక కోట్ల మంది ప్రజలు ఉన్నారని మరచిపోవద్దు. హైకోర్టులో కప్పు టీ కూడా దొరకడంలేదు.. బెంచీలు కూడా లేవు. సరైన వసతుల్లేవు. అసలు రాజధాని కడతారా? కట్టరా? హైకోర్టును రాయలసీమకు తరలిస్తారా?ఇలాంటి అంశాలను స్పష్టంగా తెలియజేయాలి. వీటిపై గందరగోళం ఆపండి. సమస్యలు పరిష్కరించకపోతే ఈ ప్రజలు మిమ్మల్ని శిక్షిస్తారు’’ అని పవన్‌ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 

ఆ జీవోపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తాం!

‘‘ఇసుక సంక్షోభంతో 30లక్షల మంది రోడ్డున పడ్డారు. కానీ ఇసుక సరఫరాపై ఇప్పటికీ స్పష్టతలేదు. తెదేపా తప్పులు సరిదిద్దే క్రమంలో కొత్త సమస్య సృష్టించారు. 6వేల ఇసుక లారీలు కొత్తగా ఇస్తామని చెబుతున్నారు. ఈ లారీలకు జీఎస్టీ తగ్గించాలని ఏకంగా 486 జీవోను తీసుకొచ్చారు. ఇలా జీవో తేవడం సరికాదు. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తాం’’ అని పవన్‌ అన్నారు.

Comments

Popular posts from this blog

అమరావతిలో భూముల రేట్లు తగ్గకుండా: సీఆర్డీఏ స్థానంలో కొత్త అథారిటీ: కీలక నోటిఫికేషన్

 మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందడం, రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్డీ) రద్దు నేపథ్యంలో.. ప్రభుత్వం మెరుపు వేగంతో నిర్ణయాలను తీసుకుంటోంది. పరిపాలనను వేగవంతం చేసేలా తక్షణ చర్యలకు దిగింది. సీఆర్డీఏ బిల్లు రద్దు అనంతరం దాని స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలిని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. దాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఏఎంఆర్డీఏ కమిటీ సభ్యులనూ నియమించింది. సీఆర్డీఏకు బదులుగా ఏఎంఆర్డీఏ సీఆర్డీఏ స్థాయంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలి (ఏఎంఆర్డీఏ)ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్‌ను జారీ చేసింది. సీఆర్డీఏను రద్దు చేస్తూ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేసిన మరుసటి రోజే ఏఎంఆర్డీఏను తెరపైకి తీసుకొచ్చింది. దానితో పాటు కొత్త సభ్యులను నియమించింది. మున్సిపల్ శాఖ కార్యదర్శి జే శ్యామల రావు దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను జారీ చేశారు. మొత్తం 11 మంది సభ్యులను ఏఎంఆర్డీఏ కమిటీలో నియమించారు. సభ్యులు వీరే.. మున్సిపల్ శాఖ కార్యదర్శి డిప్య...

కర్ఫ్యూ ఎత్తేస్తే రక్తపాతమే.. యుద్ధం వస్తే మేం సిద్ధం : ఇమ్రాన్‌

జమ్ముకశ్మీర్‌లో కర్ఫ్యూ ఎత్తేస్తే రక్తపాతమేనని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చెప్పుకొచ్చారు. శుక్రవారం నాడు 74వ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో భాగంగా ఇమ్రాన్ మాట్లాడుతూ.. ఐరాస వేదికగా కవ్వింపు ప్రకటన చేశారు. కశ్మీర్‌ను కేవలం రాజకీయం కోసం మాత్రమే వాడుకుంటున్నారని విమర్శలు గుప్పించారు.   ప్రపంచం ఏం చేసింది?.   బాలాకోట్‌లో 500 మంది తీవ్రవాదులు రెడీగా ఉన్నారని ఇండియా రక్షణ మంత్రి చెబుతున్నారు. 500 మంది తీవ్రవాదులను పంపి మేమేం సాధిస్తాం?. 500 మంది తీవ్రవాదులను పంపాల్సిన అవసరం మాకేంటి.?. ఇస్లామిక్ టెర్రరిజం అంటూ ఇండియా మాపై ముద్ర వేస్తుంది. కశ్మీరీల హక్కులు ఎవరికీ పట్టవు. కశ్మీర్‌లో అనుసరిస్తున్న విధానాలు భారత్‌లో ఉన్న ముస్లింలపై ఎలా ప్రభావం చూపుతాయో మోదీ ఆలోచించారా?. 10 లక్షల మంది రోహింగ్యాలను బర్మా నుంచి గెంటేస్తే ప్రపంచం ఏం చేసింది?. ఇలాంటి పరిణామాలే ఇస్లాం సమాజంలో ఆవేదన, అసంతృప్తిని రేపుతున్నాయి ’  అని ఇమ్రాన్ ఆగ్రహ వ్యక్తం చేశారు. యుద్ధం వస్తే మేం సిద్ధం! ‘ ఇప్పుడు చాలా సంక్లిష్టం సమయం నడుస్తోంది. అణ్వాయుధాలున్న రెండు దేశాలు తలపడాల్స...