

‘‘రాయలసీమ నుంచి లాయర్లు వచ్చి కలిశారు. హైకోర్టు తమ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని అడుగుతున్నారు. రాయలసీమ నుంచే ఎక్కువ మంది సీఎంలు వచ్చారు. రాష్ట్ర విభజన దగ్గర నుంచి ఇప్పటిదాకా సమస్యలు తీరలేదు. రాజధాని ఉందో లేదో తెలియదు. మంత్రి బొత్స వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. కోపాలు, తాపాలు ఉంటే రాజకీయాల్లో చూసుకోండి. మీ నిర్ణయాల వెనుక కోట్ల మంది ప్రజలు ఉన్నారని మరచిపోవద్దు. హైకోర్టులో కప్పు టీ కూడా దొరకడంలేదు.. బెంచీలు కూడా లేవు. సరైన వసతుల్లేవు. అసలు రాజధాని కడతారా? కట్టరా? హైకోర్టును రాయలసీమకు తరలిస్తారా?ఇలాంటి అంశాలను స్పష్టంగా తెలియజేయాలి. వీటిపై గందరగోళం ఆపండి. సమస్యలు పరిష్కరించకపోతే ఈ ప్రజలు మిమ్మల్ని శిక్షిస్తారు’’ అని పవన్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఆ జీవోపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తాం!
‘‘ఇసుక సంక్షోభంతో 30లక్షల మంది రోడ్డున పడ్డారు. కానీ ఇసుక సరఫరాపై ఇప్పటికీ స్పష్టతలేదు. తెదేపా తప్పులు సరిదిద్దే క్రమంలో కొత్త సమస్య సృష్టించారు. 6వేల ఇసుక లారీలు కొత్తగా ఇస్తామని చెబుతున్నారు. ఈ లారీలకు జీఎస్టీ తగ్గించాలని ఏకంగా 486 జీవోను తీసుకొచ్చారు. ఇలా జీవో తేవడం సరికాదు. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తాం’’ అని పవన్ అన్నారు.
Comments
Post a Comment