Skip to main content

మంత్రులకూ తప్పని ఓటమి..

 
మంత్రులకూ తప్పని ఓటమి..
 హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వెలువడుతున్నాయి. అధికార భాజపా కూటమి 40 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజార్టీని మాత్రం సాధించలేకపోయింది. మరోవైపు రాష్ట్రంలో కేబినెట్‌ మంత్రులే ఓటమి చవిచూడటం గమనార్హం. 
హరియాణా కేబినెట్‌లో సీఎంతో కలిపి 9 మంది మంత్రులు ఉన్నారు. వీరిలో సీఎం మనోహర్‌లాల్‌ ఖట్టర్‌, అనిల్‌ విజ్‌ మినహా మిగతా ఏడుగురు మంత్రులు విజయతీరాలను చేరుకోలేకపోయారు. ఇప్పటికే మంత్రులు కెప్టెన్‌ అభిమన్యు, రామ్‌ విలాస్‌ శర్మ ఓడిపోగా.. మిగతా వారూ వెనుకంజలో ఉన్నారు. సహాయ మంత్రి కృష్ణ కుమార్‌, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సుభాష్‌ బరాలా కూడా ఓటమి చవిచూశారు. 
హరియాణాలో మొత్తం 90 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 46 సీట్లు అవసరం. అయితే ప్రస్తుతం ప్రధాన పార్టీలైన భాజపా, కాంగ్రెస్‌కు మెజార్టీ రాకపోవడంతో దుశ్యంత్‌ చౌటాలా నేతృత్వంలోని జేజేపీ కీలకంగా మారింది. ఆ పార్టీ 10 స్థానాల్లో విజయం సాధించింది. జేజేపీ ఏ పార్టీకి మద్దతిస్తే ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. 

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...