Skip to main content

చాలా కష్టపడి బోటును బయటకు తీశారు: మంత్రి అవంతి శ్రీనివాస్


 


కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిపోయిన బోటును ధర్మాడి సత్యం బృందం వెలికితీసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మంత్రి అవంతి శ్రీనివాస్ స్పందిస్తూ, బోటు వెలికితీతకు సంబంధించి ఎటువంటి లోపం లేకుండా చిత్తశుద్ధితో తాము, అధికారులందరూ పనిచేశారని అన్నారు. భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంటామని చెప్పారు.

పర్యాటక బోట్లకు సంబంధించిన విధివిధానాలను రాబోయే రోజుల్లో కఠినతరం చేస్తామని వెల్లడించారు. ఇలాంటి దురదృష్టకరమైన ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై, ప్రైవేట్ బోటు ఆపరేటర్లపై ఉందని అన్నారు. ప్రభుత్వ యంత్రాంగానికి, బోటు వెలికితీత పనుల్లో కష్టపడ్డ సిబ్బందికి ప్రభుత్వం తరపున, తన తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. ఈ ఘటనలో మృతదేహాలు దొరికిన వారి కుటుంబ సభ్యులకు ఏవిధంగా అయితే ప్రభుత్వ నష్టపరిహారం ఇచ్చామో, అదేవిధంగా, మృతదేహాలు లభ్యం కాని వారి కుటుంబాలకూ ఇస్తామని మరోమారు ఆయన స్పష్టం చేశారు.     

Comments

Popular posts from this blog

అంబులెన్స్‌కు దారి ఇచ్చిన సీఎం కాన్వాయ్...‌

వీడియో చూడండి : Click here ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాహన శ్రేణి అంబులెన్స్‌కు దారిఇచ్చింది. పులివెందుల నుంచి తిరిగివచ్చిన సీఎం గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి నివాసానికి బయల్దేరారు. గూడవల్లి నిడమానూరు మధ్య ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని తరలిస్తున్న అబులెన్స్‌కు దారి ఇచ్చారు. ఉయ్యూరు నుంచి గన్నవరం బైక్‌పైవెళ్తున్న చాపర్తిన శేఖర్‌ అనే వ్యక్తి ఉషారామ ఇంజినీరింగ్‌కాలేజీ సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. అతన్ని నేషనల్‌ హైవే అంబులెన్స్‌ ద్వారా విజయవాడ ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలిస్తుండగా, దీనికి ముందు ఉన్న ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పక్కకు తొలగి అంబులెన్స్‌కు దారి ఇచ్చింది.

నీకు పూర్తి మద్దతిస్తా: వంశీ రెండో లేఖపై స్పందించిన చంద్రబాబు

  తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడి మధ్య ఇప్పుడు లేఖల ద్వారా మాటలు సాగుతున్నాయి. నిన్న తన రాజీనామాకు దారితీసిన అంశాలను వివరిస్తూ, వంశీ లేఖ రాయగా, దానిపై చంద్రబాబు స్పందించారు. చంద్రబాబు స్పందనపై కృతజ్ఞతలు తెలుపుతూ, వంశీ మరో లేఖను రాయగా, చంద్రబాబు దానిపైనా స్పందించారు. వంశీకి పార్టీ పట్ల ఉన్న అంకితభావం, ఆయన చేసిన పోరాటాలను తాను మరువలేదని అన్నారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వంశీ చేసే పోరుకు తన మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. సమస్యలను పరిష్కరించుకుని, ఓ స్పష్టమైన కార్యాచరణతో ముందుకు సాగుదామని చంద్రబాబు సూచించారు. వంశీని బుజ్జగించే బాధ్యతలను ఎంపీ కేశినేని నాని, పార్టీ నేత కొనకళ్ల నారాయణలకు చంద్రబాబు అప్పగించినట్టు తెలుస్తోంది.