Skip to main content

మహిళను హిప్నటైజ్ చేసి, అత్యాచారయత్నం చేసిన అమెజాన్ డెలివరీ బాయ్!


ఓ మహిళపై అత్యాచారానికి ప్రయత్నించిన అమెజాన్ డెలివరీ బాయ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఢిల్లీలో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే, 43 ఏళ్ల ఓ మహిళ ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తోంది. అమెజాన్ లో ఆమె ఐదు బాక్స్ లను బుక్ చేసింది. పార్సిల్ డెలివరీ అయిన తర్వాత చూస్తే అవి ఆమెకు నచ్చలేదు. దీంతో, వాటిని వెనక్కి తీసుకెళ్లాలంటూ రిటర్న్ రిక్వెస్ట్ పెట్టింది. ఈ నేపథ్యంలో, వాటిని తీసుకునేందుకు ఓ డెలివరీ బాయ్ (30)ను అమెజాన్ పంపింది.

కస్టమర్ నివాసానికి వెళ్లిన సదరు డెలివరీ బాయ్ ఐదు బాక్సులను వెనక్కి తీసుకోవడానికి అంగీకరించలేదు. నాలుగు బాక్సులు మాత్రమే తీసుకోవాలని తనకు చెప్పారని తెలిపాడు. ఈ నేపథ్యంలో, ఇరువురికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం అతను అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దాంతో బాధితురాలు కస్టమర్ కేర్ తో ఫోన్ ద్వారా మాట్లాడి... ఐదు బాక్సులను తీసుకోవడానికి డెలివరీ బాయ్ నిరాకరిస్తున్నాడని తెలిపింది. నాలుగు బాక్సులు తీసుకోవడానికే అతనికి అనుమతి ఉందని... ఐదు బాక్సులను తీసుకునేందుకు మరో వ్యక్తిని పంపుతామని కస్టమర్ కేర్ ప్రతినిధి చెప్పాడు.

కొన్ని నిమిషాల తర్వాత మళ్లీ వచ్చిన ఆ డెలివరీ బాయ్ ఐదు బాక్సులనూ రిటర్న్ తీసుకుంటానని చెప్పాడు. కానీ, మరో వ్యక్తిని పంపిస్తానని కస్టమర్ కేర్ వాళ్లు చెప్పారని, బాక్సులను నీకు ఇవ్వనని బాధితురాలు స్పష్టం చేసింది. ఆ తర్వాత కాసేపటికే ఆమె హిప్నాటిజంకు గురైంది. స్పృహ సరిగ్గా లేని స్థితిలో ఉన్న ఆమెపై డెలివరీ బాయ్ అత్యాచార యత్నం చేశాడు.

అయితే, కాసేపట్లోనే హిప్నటైజ్ స్టేజ్ నుంచి బయటకు వచ్చిన ఆమెకు... తన ముందు నిలబడి ప్యాంటును జారవిడిచిన స్థితిలో డెలివరీ బాయ్ కనిపించాడు. వెంటనే తేరుకున్న ఆమె... భయాందోళనలతో కేకలు వేసింది. దీంతో, అతను అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటన ఈ సోమవారం మధ్యాహ్నం 11.20 గంటల సమయంలో చోటు చేసుకుంది. జరిగిన ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...