Skip to main content

మహిళను హిప్నటైజ్ చేసి, అత్యాచారయత్నం చేసిన అమెజాన్ డెలివరీ బాయ్!


ఓ మహిళపై అత్యాచారానికి ప్రయత్నించిన అమెజాన్ డెలివరీ బాయ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఢిల్లీలో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే, 43 ఏళ్ల ఓ మహిళ ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తోంది. అమెజాన్ లో ఆమె ఐదు బాక్స్ లను బుక్ చేసింది. పార్సిల్ డెలివరీ అయిన తర్వాత చూస్తే అవి ఆమెకు నచ్చలేదు. దీంతో, వాటిని వెనక్కి తీసుకెళ్లాలంటూ రిటర్న్ రిక్వెస్ట్ పెట్టింది. ఈ నేపథ్యంలో, వాటిని తీసుకునేందుకు ఓ డెలివరీ బాయ్ (30)ను అమెజాన్ పంపింది.

కస్టమర్ నివాసానికి వెళ్లిన సదరు డెలివరీ బాయ్ ఐదు బాక్సులను వెనక్కి తీసుకోవడానికి అంగీకరించలేదు. నాలుగు బాక్సులు మాత్రమే తీసుకోవాలని తనకు చెప్పారని తెలిపాడు. ఈ నేపథ్యంలో, ఇరువురికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం అతను అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దాంతో బాధితురాలు కస్టమర్ కేర్ తో ఫోన్ ద్వారా మాట్లాడి... ఐదు బాక్సులను తీసుకోవడానికి డెలివరీ బాయ్ నిరాకరిస్తున్నాడని తెలిపింది. నాలుగు బాక్సులు తీసుకోవడానికే అతనికి అనుమతి ఉందని... ఐదు బాక్సులను తీసుకునేందుకు మరో వ్యక్తిని పంపుతామని కస్టమర్ కేర్ ప్రతినిధి చెప్పాడు.

కొన్ని నిమిషాల తర్వాత మళ్లీ వచ్చిన ఆ డెలివరీ బాయ్ ఐదు బాక్సులనూ రిటర్న్ తీసుకుంటానని చెప్పాడు. కానీ, మరో వ్యక్తిని పంపిస్తానని కస్టమర్ కేర్ వాళ్లు చెప్పారని, బాక్సులను నీకు ఇవ్వనని బాధితురాలు స్పష్టం చేసింది. ఆ తర్వాత కాసేపటికే ఆమె హిప్నాటిజంకు గురైంది. స్పృహ సరిగ్గా లేని స్థితిలో ఉన్న ఆమెపై డెలివరీ బాయ్ అత్యాచార యత్నం చేశాడు.

అయితే, కాసేపట్లోనే హిప్నటైజ్ స్టేజ్ నుంచి బయటకు వచ్చిన ఆమెకు... తన ముందు నిలబడి ప్యాంటును జారవిడిచిన స్థితిలో డెలివరీ బాయ్ కనిపించాడు. వెంటనే తేరుకున్న ఆమె... భయాందోళనలతో కేకలు వేసింది. దీంతో, అతను అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటన ఈ సోమవారం మధ్యాహ్నం 11.20 గంటల సమయంలో చోటు చేసుకుంది. జరిగిన ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.