Skip to main content

గీత రచయిత జొన్నవిత్తులపై రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు

 

ప్రముఖ గీత రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావుపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. "ఓ నా బుజ్జి జొన్న" అంటూ మొదలుపెట్టి 'స్త్రీ సాంగత్యం' వరకు వెళ్లారు. "నీ వీడియో చూశాన్రా కిస్సీ బాయ్! నీకు అప్పుడప్పుడు, కనీసం దశాబ్దానికోసారైనా స్త్రీ సాంగత్యం అవసరం, లేకపోతే అసహనంతో చచ్చిపోతావ్ జొన్నా" అంటూ ఘాటుగా ట్వీట్ చేశారు. "అయినా నిన్ను నీ భార్యాపిల్లలు ఎలా భరిస్తున్నారు?" అంటూ ప్రశ్నించారు. వాళ్ల మీద జాలి కలుగుతోంది అంటూ వెటకారం ప్రదర్శించారు. చివర్లో "ఐ లవ్యూ డా" అంటూ ట్వీట్ ముగించారు.

వర్మ వ్యాఖ్యలకు కారణం ఉంది. ఇటీవలే జొన్నవిత్తుల మీడియాతో మాట్లాడుతూ, దిక్కుమాలిన ఆలోచనలతో వివాదాస్పద సినిమాలు తీస్తున్నాడంటూ వర్మపై మండిపడ్డారు. వర్మ ఎంతో ప్రమాదకారి అని పేర్కొన్నారు. వర్మ తనకు టీవీ చర్చా కార్యక్రమంలో జొన్నవిత్తుల చౌదరి అనే బిరుదు ఇచ్చాడని, అందుకే వర్మపై పప్పు వర్మ అనే బయోపిక్ తీస్తానని వెల్లడించారు. ఈ వ్యాఖ్యలకు ప్రతిస్పందనగానే వర్మ తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డాడు.

Comments

Popular posts from this blog

Android ఫోన్లలో బ్యాంక్ అకౌంట్ వివరాలు దోచుకునే కొత్త మాల్వేర్ 'BlackRock' హడలెత్తిస్తోంది

Trojan కేటగిరికి చెందినదిగా చెబుతున్న 'BlackRock' అనే ఒక మాల్వేర్ Android స్మార్ట్ ఫోన్ల నుండి వినియోగదారుల విలువైన బ్యాంక్ సమాచారాన్ని సేకరిస్తున్నట్లు బయటపడింది. ఇప్పటి వరకూ పర్సనల్ డేటా చౌర్యానికి మాత్రమే పరిమితమైన సైబర్ దాడులు ఇప్పుడు ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ల నుండి బ్యాంక్ అకౌంట్ వివరాలు కూడా దోచుకునేంతగా ముందుకు సాగుతోంది. ఒక మాల్వేర్, బ్యాంక్ అకౌంట్ ఆధారాలను మరియు క్రెడిట్ కార్డు వాటి వాటి వివరాలను ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ల ద్వారా సేకరిస్తున్నట్లు మరియు ఇది దాదాపుగా 300 పైగా ఆండ్రాయిడ్ యాప్స్ పైన తాన్ ప్రభావాన్ని చూపిస్తున్నట్లు తెలిపింది. అసలే ప్రజలు కరోనా మహమ్మారితో దెబ్బకి హడలెత్తి పోతోంటే, ఆన్ లైన్ లో సైబర్ దాడులు మరియు సైబర్ మోసాలు మరింతగా కృంగదీస్తున్నాయి. ఇప్పటి వరకూ పర్సనల్ డేటా చౌర్యానికి మాత్రమే పరిమితమైన సైబర్ దాడులు ఇప్పుడు ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ల నుండి బ్యాంక్ అకౌంట్ వివరాలు కూడా దోచుకునేంతగా ముందుకు  సాగుతోంది. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఒక నివేదిక ప్రకారం,Trojan కేటగిరికి చెందినదిగా చెబుతున్న 'BlackRock' అనే ఒక మాల్వేర్ Android స...

ఆమిర్‌ ఖాన్‌పై విమర్శలు గుప్పిస్తున్న నెటిజెన్లు

  బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ పై నెటిజెన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే, తన తాజా చిత్రం 'లాల్ సింగ్ చద్దా' షూటింగ్ కోసం ఆమిర్ ఇటీవల టర్కీకి వెళ్లారు. ఈ సమయంలో ఆయనతో సెల్ఫీలు తీసుకునేందుకు అక్కడి వారు ఉత్సాహం చూపారు. తన పర్యటనలో భాగంగా టర్కీ అధ్యక్షుడి భార్య ఎమినే ఎర్డోగన్ ను కూడా ఆమిర్ కలిశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఆమె తెలిపారు. ప్రముఖ భారతీయ నటుడు ఆమిర్ ను కలవడం సంతోషంగా ఉందని ఆమె చెప్పారు. టర్కీలోని పలు ప్రాంతాల్లో షూటింగ్ చేశారని.. ఆ చిత్రాన్ని చూసేందుకు తాను కూడా ఎదురుచూస్తున్నానని ఆమె అన్నారు. ఈ వ్యవహారంపై ఆమిర్ పై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. కశ్మీర్ విషయంలో పాకిస్థాన్ కు టర్కీ అధ్యక్షుడు మద్దతు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఎమినేను ఆమిర్ కలవకుండా వుండి ఉంటే బాగుండేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.