Skip to main content

ఈ ప్రశ్నకు సీఎం జగన్, ఆయన పార్టీ తప్పకుండా సమాధానం చెప్పాలి!: జీవీఎల్




ఓడిపోయిన తెలుగుదేశం పార్టీతో అనుబంధం పెంచుకోవాల్సిన అవసరం తమ పార్టీకి లేదని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీలో ఓ శక్తిగా ఎదగాలని తాము అనుకుంటామే తప్పా వేరే పార్టీని ఉద్ధరించాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేశారు. ఏపీలో ఏ పార్టీతో కలిసి వెళ్లే ఉద్దేశం బీజేపీకి కచ్చితంగా లేదని అన్నారు.

ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు గురించి ఆయన ప్రస్తావించారు. ఈ ప్రాజెక్టు విషయంలో తప్పులు జరిగాయని గతంలో తాము చెప్పామని, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చెబుతోందని అన్నారు. రూ.2,200 కోట్ల అవినీతి జరిగిందని చెబుతున్న ప్రభుత్వం దీనిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని మరోమారు ప్రశ్నిస్తున్నట్టు చెప్పారు. ఈ ప్రశ్నకు సీఎం జగన్, ఆయన పార్టీ తప్పకుండా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

రాజధాని అమరావతి విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వానికి తమ డిమాండ్ ఇదే అని, గత ప్రభుత్వం ఎక్కువ ధరకు భూములను కొనుగోలు చేసి, తక్కువ ధరకు ఈ భూములను ఎవరికి కేటాయించారన్న సమాచారం రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది కదా, తప్పు ఎవరైతే చేశారో వారిపై చర్యలు తీసుకోకుండా ఎందుకు నీళ్లు నములుతోంది? అని ప్రశ్నించారు.   

Comments

Popular posts from this blog

వారానికోసారి కష్టమేమీ కాదు... సీఎం జగన్‌ కేసులో సీబీఐ కౌంటర్

కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం జగన్ వేసిన పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. అక్రమాస్తుల కేసు విచారణ నుంచి తనకు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీబీఐ కోర్టులో వేసిన పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. సీఎం జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. సాక్షులను జగన్ ప్రభావితం చేసే అవకాశం ఉందని పిటిషన్‌లో పేర్కొంది. ఆయన వాస్తవాలను దాచిపెట్టి పిటిషన్ వేశారని ఆరోపించింది. జగన్ జైల్లో ఉన్నప్పుడు సాక్షులను ప్రభావితం చేశారని... సీఎం పదవిలో ఉన్న జగన్ సాక్షులను మరింత ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ తన పిటిషన్‌లో పేర్కొంది. ఏపీలో రెవెన్యూ లోటు అనేది సీఎంగా ఉన్న జగన్ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చే కారణం కాదని తెలిపింది. సీఎంగా ఉన్న జగన్ విజయవాడ నుంచి వారానికోసారి హైదరాబాద్ రావడంకష్టమేమీ కాదని కౌంటర్‌ పిటిషన్‌లో సీబీఐ పేర్కొన్నట్టు తెలుస్తోంది. సీబీఐ కౌంటర్‌పై కోర్టు శుక్రవారం వాదనలు వినిపించనుంది.

బోటు వెలికితీత మరింత ఆలస్యం

కచ్చులూరు వద్ద మునిగిన బోటును రేపు వెలికితీస్తామని ధర్మాడి సత్యం తెలిపారు. బోటు వెలికితీత కోసం రెండోరోజు చేసిన ప్రయత్నాలు విఫలమైనట్లు చెప్పారు. వాతావరణం అనుకూలించనందువల్లే ఈ ఆలస్యం జరుగుతుందని వివరించారు. గోదావరిలో వరద ప్రహహం తగ్గిన కారణంగా బోటును రేపు బయటికి తీస్తామని స్పష్టం చేశారు. కాగా.. ధర్మాడి సత్యం బృందం వేసిన లంగర్‌కు బోటు తగిలి కదిలిందని స్థానికులు తెలిపారు.