Skip to main content

వైసీపీకి పడ్డ ఓట్ల కంటే ఫిర్యాదుల పరంగా వచ్చే దరఖాస్తుల సంఖ్యే ఎక్కువగా ఉంటుంది: ఎంపీ సుజనా చౌదరి

ఏపీలోని అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీపై బీజేపీ ఎంపీ సుజనా చౌదరి విమర్శలు చేశారు. నందిగామ మండలం కంచికచర్లలో గాంధీ సంకల్ప యాత్రను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ, రాజ్యాంగానికి అతీతులం అన్నట్టుగా, నిరంకుశంగా సీఎం జగన్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర సమస్యలపై గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేస్తే కనుక మొన్నటి ఎన్నికల్లో వైసీపీకి పడిన ఓట్ల కంటే వచ్చే దరఖాస్తుల సంఖ్యే ఎక్కువగా ఉంటుందని విమర్శించారు.

అసలు సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వమే వాటిని సృష్టిస్తోందని ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో టీడీపీ విఫలమైందని అన్నారు. సీఎం జగన్ కు బదులుగా రాష్ట్రంలో సమస్యలను టార్గెట్ చేయాలని టీడీపీ నాయకులకు సూచించారు. దేశంలో కుల, మత వివక్షకు తావులేని సమాజం కోసం గాంధీ మహాత్ముడు కలలు కన్నారని అన్నారు. అలాంటి దేశంలో ప్రాంతీయ పార్టీలు తమ స్వార్థం కోసం కులతత్వాన్ని రెచ్చగొడుతున్నాయని ధ్వజమెత్తారు. ఏపీలో కూడా బీజేపీ బలపడుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.   

Comments

Popular posts from this blog

అమరావతిలో భూముల రేట్లు తగ్గకుండా: సీఆర్డీఏ స్థానంలో కొత్త అథారిటీ: కీలక నోటిఫికేషన్

 మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందడం, రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్డీ) రద్దు నేపథ్యంలో.. ప్రభుత్వం మెరుపు వేగంతో నిర్ణయాలను తీసుకుంటోంది. పరిపాలనను వేగవంతం చేసేలా తక్షణ చర్యలకు దిగింది. సీఆర్డీఏ బిల్లు రద్దు అనంతరం దాని స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలిని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. దాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఏఎంఆర్డీఏ కమిటీ సభ్యులనూ నియమించింది. సీఆర్డీఏకు బదులుగా ఏఎంఆర్డీఏ సీఆర్డీఏ స్థాయంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలి (ఏఎంఆర్డీఏ)ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్‌ను జారీ చేసింది. సీఆర్డీఏను రద్దు చేస్తూ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేసిన మరుసటి రోజే ఏఎంఆర్డీఏను తెరపైకి తీసుకొచ్చింది. దానితో పాటు కొత్త సభ్యులను నియమించింది. మున్సిపల్ శాఖ కార్యదర్శి జే శ్యామల రావు దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను జారీ చేశారు. మొత్తం 11 మంది సభ్యులను ఏఎంఆర్డీఏ కమిటీలో నియమించారు. సభ్యులు వీరే.. మున్సిపల్ శాఖ కార్యదర్శి డిప్య...